భూభారతి సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్ రాజిరెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని మెటల్ కుంట గ్రామంలో నిర్వహించిన భూభారతి సదస్సును ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు స్వీకరించారని తహసీల్దారును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు భూ సమస్యలకు సంబంధించి తగిన ఆధారాలతో గ్రామసభలో దరఖాస్తు చేసుకుంటే వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సర్వేర్ లాల్ సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ మహమ్మద్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.