కారు గుర్తుకు ఓటేయండి అభివృద్ధికి పాటుపడండి…..కడియం శ్రీహరి

స్టేషన్ ఘనపూర్: (జనగాం) నేటి రాత్రి

జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండల కేంద్రంలోని రంగరాయగూడెం లో బిఆర్ఎస్ విస్తృత ఆత్మీయ సమావేశం గ్రామ శాఖ అధ్యక్షుడు చట్ల సురేష్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్యఅతిథి ప్రస్తుత ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి హాజరయ్యారు.

అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన నిజాయితీతో చిత్త శుద్ధితో కార్యాచరణతో అభివృద్ధి పనులు చేస్తానని నాపై నమ్మకం ఉంటే నాకు ఓటు వేయాలని గ్రామ ప్రజలను అభ్యర్థించారు.
కచ్చితంగా గెలిచినా అనంతరం గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందామని హామీ ఇచ్చారు. కొన్ని పార్టీలు మీ దగ్గరకు వస్తున్నాయి భాజపా కాంగ్రెస్ పార్టీలను అవదని నమ్మితే మోసపోతామని ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను సంక్షేమ పథకాలను చూసి బిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా నా కారు గుర్తుకు ఓటు వేసి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపిటిసి శైలజ – అజయ్ రెడ్డి రైతు కోఆర్డినేటర్ తోట వెంకన్న, జనగామ జిల్లా రూరల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బెలిద వెంకన్న,
చాగల్ సర్పంచ్ సారంగ పాణీ, జిల్లపల్లి స్వామి, ముఖ్య కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *