బిఎస్పి లో చేరిన కొండాపూర్ గ్రామస్తులు.

బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నుండి బీఎస్పీ లోకి,భారీ చేరికలు.

మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం
నవాబుపేట మండలం లోని కొండాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుండి బీఎస్పీలోకి భారీగా యువత చేరడం జరిగింది. అగ్రకుల పార్టీలకు రాజీనామా చేసి జడ్చర్ల నియోజకవర్గంలో మరియు తెలంగాణ గడ్డమీద బహుజన జండా ఎగరేస్తామని కొండాపూర్ గ్రామస్తులు దీమా వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా మాదాసు మహేష్, గోరింక కేశవులు, కోస్గి జంగయ్య, మాదాసు రంగన్న, మాతరి నర్సింహులు, మాదాసు రమేష్, కోస్గి శేఖర్, యాదగిరి, కుమార్, ప్రవీణ్, శివకుమార్, మల్లేష్, నరేందర్, శివ, తదితర గ్రామస్తులు బీఎస్పీలో భారీగా చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నవాబుపేట మండల అధ్యక్షుడు శ్రీకాంత్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు గోరింక గిరి, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *