vidyardulaku andaga youth for swach duggondi, విద్యార్థులకు అండగా యూత్ ఫర్ స్వచ్చ దుగ్గొండి
విద్యార్థులకు అండగా యూత్ ఫర్ స్వచ్చ దుగ్గొండి
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎప్పటికీ అండగా ఉంటామని యూత్ ఫర్ స్వచ్చదుగ్గొండి అధ్యక్షుడు, టీఆర్ఎస్ ఎన్నారై ఫోరం అధికార ప్రతినిధి శానబోయిన రాజ్కుమార్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించడం పట్ల దుగ్గొండి మండలకేంద్రంలో ఆయన మాట్లాడారు. యూత్ ఫర్ స్వచ్చ దుగ్గొండి, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని పదవతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్తోపాటు వివిధ రకాలుగా సహాయం అందించిన సందర్భంగా వాటిని ఉపయోగించుకుని ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు తమ భవిష్యత్ కోసం ఉన్నతస్థాయికి ఎదగాలని ఆయన కోరారు. యూత్ ఫర్ స్వచ్చ దుగ్గొండి ఎప్పటికి అందుబాటులో ఉంటుందని, త్వరలో ప్రభుత్వం నిర్వహించే బడిబాట కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన అధ్యాపక బందాలకు కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొగాకు బాలకష్ణ, మోడెం విద్యాసాగర్గౌడ్, శివ, ప్రతాప్, రమేష్, కిషోర్, రాజేందర్, వేణు, యాదగిరి సుధాకర్తోపాటు పలువురు పాల్గొన్నారు.