హసన్ పర్తి / నేటి ధాత్రి
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం అర్వపల్లి గ్రామం లో ఆకుల భారతి పెద్ద కుమారుడైన ఆకుల రంజిత్ వయసు 30 సం.. గత 2, 3 సం.. ల నుండి 3 సార్లు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కి అప్లై చేసి పరీక్షలు రాయగా ఉత్తీర్ణత సాధించక పోవడంతో ఉద్యోగం రావట్లేదని గత 4 రోజుల నుండి మనస్థాపం చెందుతూ ఇంట్లో ఎవరు లేని సమయం లో లుంగీ తో ఉరి వేసుకున్నాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు క్రిందికి దించి 108 అంబులెన్స్ కి కాల్ చేయగా వారు వచ్చి అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు రోదించారు.