సార్వత్రిక సమ్మెకు టీడబ్ల్యూజేఎఫ్ సంఘీభావం..
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
కార్మికుల హక్కుల కోసం చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. బుధవారం వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మహా ర్యాలీలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మచ్చిక వెంకటేశ్వర్లు, వరంగల్ జిల్లా అధ్యక్షులు పొడేటి అశోక్, ఉపాధ్యక్షులు ఈర్ల సురేందర్, కోశాధికారి గాయపు రాజురెడ్డి, చిలువేరు శ్రీకాంత్,గుర్రాల శ్రీనివాస్, సదిరం కుమార్,ఎండీ.అక్మల్ పాషా, మోడం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.