Demand to Complete Tendu Leaf Tenders Immediately
తునికకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలి
తునికాకు సేకరణకు సంబంధించిన పనులు ప్రారంభించాలి
కట్ట రేటు ₹10 కు పెంచాలి.
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్
భూపాలపల్లి నేటిధాత్రి
తునికి ఆకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి తునికాకు శాఖకు సంబంధించిన పనులు వెంటనే ప్రారంభించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వారు మాట్లాడుతూ వరి పంట తర్వాత పోనికాకు రెండవ అతిపెద్ద పంటగా ఉందని అట్లాంటిది ఫిబ్రవరి నెల పూర్తి కావస్తున్న టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి కొమ్మ కొట్టే పనులు పూర్తి చేయకపోవడం చూస్తుంటే పేదలకు ఉపాధి కల్పించడంలో ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్య వైఖరి కనపడుతుందని వారు విమర్శించారు. ఇప్పటివరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు డివిజన్లో 30 యూనిట్లుకు గాను 188 కల్లాలు ఉండగా అందులో ఇప్పటివరకు ఐదు యూనిట్లు 34కల్లాలకు మాత్రమే టెండర్లు అయ్యాయని, ఇంకా 25 యూనిట్లు ఎక్కువగాను 150 కల్లాలు సేల్ కావాల్సి ఉందని ఈనెల చివరి వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోతే ప్రభుత్వమే తునికకు సేకరణకు సంబంధించిన పనులు ప్రారంభించాలని, అదేవిధంగా కట్టకు పది రూపాయలు నిర్ణయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, లేనియెడల మార్చి ఫస్ట్ నుండి ఆందోళన పోరాటాలకు పూనుకుంటామని హెచ్చరించారు.
