మండనున్న ఎండలు.. అప్రమత్తంగా ఉండాలి
మొగులపల్లి కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము నేటిధాత్రి మొగుళ్లపల్లి
జిల్లాల్లో రానున్న రోజుల్లో ఈనెల 29 వరకు తీవ్ర ఎండలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్కు చేరే ప్రమాదం ఉందని మొగుళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము పేర్కొంది.ఇప్పటికే గత రెండు రోజులుగా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రానున్న వారం రోజుల పాటు భానుడు మరింత ప్రతాపం చూపనున్నాడని తెలిపారు. .ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దని . బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు, వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం, టోపీ, గొడుగు వినియోగించడం, తరచూ నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం తీసుకోవాలని సూచించారు.ఉపాధి హామీ, భవన నిర్మాణ పనులను ఉదయం 7 గంటల నుంచి 10:30 గంటల లోపే ముగించాలని తెలిపారు. తీవ్ర తలనొప్పి, వాంతులు, కళ్లు తిరగడం, చర్మం పొడిబారడం వంటి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే బాధితుడిని నీడలోకి తీసుకెళ్లి తడి గుడ్డతో శరీరం తుడిచి సమీప ఆసుపత్రికి తరలించాలని సూచించారు.ఈ నెల 29 వరకు వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అని తెలిపారుa
