20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి.

Bike rally Bike rally

20 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి

ఆల్ ట్రేడ్ యూనియన్ లు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

కార్మిక చట్టాలను అమలు చేయాలని కార్మికులకు, గుదిబండగా మారిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక జయప్రదం చేయాలని కోరుతూ గురువారం నర్సంపేట పట్టణంలో వరంగల్ రోడ్డు కూడాలీ నుండి జయలక్ష్మి సెంటర్ వరకు సీఐటీయూ,బిఆర్టిటి, ఏఐటీయూసీ ఏఐఎఫ్టీయు న్యూ,ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐఎఫ్టీయు న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడెం మల్లేశం గౌడ్,బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు బానోత్ సాగర్, ఏఐటిసి జిల్లా నాయకులు గుంపల్లి మునీశ్వర్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ లు మాట్లాడుతూ కార్పొరేట్లకు కార్మికులను కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్ల రద్దుకై కార్మిక వర్గం ఐక్యంగా పోరాటం చేయాలని కోరారు. దశాబ్ద కాలంగా పోరాడి సాధించుకున్న హక్కులను చట్టాలను కార్పొరేట్ సంస్థలకు పణంగా పెట్టి శ్రామిక వర్గ శ్రమశక్తిని కారు చౌకగా దోచుకోవడానికి మరిన్ని అదనపు లాభాలను పోగు చేసుకోవడానికి పని గంటల భారాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని దీనికి వ్యతిరేకంగా కార్మికులు ఇరువైన దేశవ్యాప్తంగా సంఘటితమై సమ్మె చేస్తున్నారని అన్నారు సమ్మెలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు హనుమకొండ శ్రీధర్, పట్టణ కార్యదర్శి రాజు, బిఆర్టియు జిల్లా నాయకులు పెరమండ్ల రవి, నాయిని వేణు చంద్ ,బొల్లం ప్రసాద్ ,అన్నం రాజు ,అనిల్, ఏఐఎఫ్టియు న్యూ నాయకులు అశోక్ ,రవి, పైడి ,ఆనంద్, ఐ ఎఫ్ టి యు నాయకులు కుమార్, ప్రదీప్ ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!