ధాన్యం కొను గోలు సెంటర్ లో గన్ని సంచుల ‘గోల్ మాల్ .

Farmers

ధాన్యం కొను గోలు సెంటర్ లో గన్ని సంచుల ‘గోల్ మాల్

గన్నీ సంచుల కొరతతో అమ్ముకుంటున్న నిర్వాహకు డు
చిన్నాల ధనుంజయ్

అధికారుల నిర్లక్ష్యం

తొర్రూర్ (డివిజన్) నేటి ధాత్రి :

 

 

ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులకు ధాన్యాన్ని అమ్ముకునేందుకు అష్ట కష్టాలు తప్పడం లేదు. మద్దతు ధర కల్పించే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసిన వాటిని ఆసరా చేసుకుని నిర్వాహకులు కొందరిని నియమించుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. డివిజన్ పరధిలోని మండలంలోని హరిపిరాల, గ్రామం వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు కన్నెత్తి చూడడం లేదు.

గన్ని బ్యాగులను అమ్ముకున్న సెంటర్ నిర్వాహకుడు

Farmers
Farmers

కొనుగోలు కేంద్రంలో గన్ని బ్యాగుల కొరతతో మండలంలోని అరిపిరాల గ్రామ పిఎసిఎస్ సెంటర్ లో చీకటాయపాలెం గ్రామానికి చెందిన రైతుకు గన్ని బ్యాగులను అమ్ముకోవడంతో పిఎసిఎస్ సెంటర్ నిర్వాకుడు ధనుంజయ్ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల అనుమతి లేకుండా రైతులు అనుమతి లేకుండా బస్తాలను వేరే గ్రామానికి చెందిన రైతులకు అమ్ముకోవడం ఏంటి అని నిలదీశారు, హరిపిరాల గ్రామానికి వచ్చిన బస్తాలను చీకటాయపాలెం గ్రామానికి ఎలా అమ్ముతారు అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల చేతివాటంతోటి బస్తాలను అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల ఆందోళనతో గ్రామాలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి గన్ని బ్యాగుల కొరత లేకుండా చూసి సెంటర్ నిర్వాహకుని పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!