బీసీల విద్యా స్థాయిని పెంచాలి
నేటిధాత్రి :
బలహీనవర్గాల విద్యా స్థాయిని పెంచడానికి తీసుకోవలసిన చర్యలపై తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి ఒక నివేదికను అందజేశామని బీసీ నాయకులు డాక్టర్ తిరునహరి శేషు, డాక్టర్ తండు నాగయ్య తెలియజేసినారు. శుక్రవారం హైదరాబాద్ ఎడ్యుకేషన్ కమిషన్ కార్యాలయంలో జరిగిన ఎడ్యుకేషనల్ స్టేటస్ ఆఫ్ బీసీస్ ఇన్ తెలంగాణ అనే అంశంపై జరిగిన వర్క్ షాప్ లో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి పాల్గొన్న డాక్టర్ శేషు డాక్టర్ నాగయ్య తెలంగాణ రాష్ట్రంలో బీసీల విద్యాస్థాయి, విద్యా విషయాలలో బిసిలు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యా స్థాయిని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య, ప్రొఫెషనల్, సాంకేతిక విద్యలలో బీసీల విద్యా స్థాయిని పెంచడానికి చెప్పటాల్సిన చర్యలపై కమిషన్ కి నివేదిక అందజేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి పథకాన్ని ఆంక్షలు లేకుండా అమలు చేయాలని, పూలే విదేశీ విద్యా జ్యోతి లాంటి పథకం ద్వారా లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్యను పెంచాలని ప్రాథమిక విద్యలో డ్రాప్ ఔట్ ని తగ్గించాలని కమిషన్ దృష్టికి తీసుకువెళ్లినారు. ఈ సందర్భంగా విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలను క్రోడీకరించి బలహీన వర్గాల విద్యా స్థాయిని పెంచటానికి కమిషన్ పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుందని తెలియజేసినారు.