దివ్యాంగత శరీరానికె పరిమితం… సంకల్పానికి కాదు…

దివ్యాంగత శరీరానికె పరిమితం… సంకల్పానికి కాదు

దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మురళి నాయక్

పట్టుదల ,క్రమ శిక్షణ,ఆత్మవిశ్వాసం ఉంటే ఏ లక్ష్యమైన సాధ్యమే….

మహబూబాబాద్/ నేటి ధాత్రి

 

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీపీఎస్ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమం ఎంతో స్పూర్తి దాయకమైనది…భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ( ఏ ఎల్ ఐ ఎం సి ఓ) సహకారంతో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల చేపట్టిన ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే డా” భూక్య మురళి నాయక్ పాల్గొని దివ్యాంగులకు అవసరమైన పరికరాలను స్వయంగా వారి చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మేల్యే మురళి నాయక్ మాట్లాడుతూ, దివ్యాంగుల జీవితం సులభతరం కావడానికి అవసరమైన ట్రై సైకిళ్ళు, వీల్ చైర్లు,వాకింగ్ స్టిక్స్,మరియు శ్రావణ యంత్రాలు లబ్ధిదారులకు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ప్రభుత్వ సంక్షేమ పథకాలను దివ్యాంగులకు మరియు అణగారినా వర్గాలకు చేరవేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు…వారికి సమాజంలో సమాన అవకాశాలు కల్పించడంలో ఇటువంటి పరికరాలు ఎంతో దోహదపడుతుందని ఆయన అన్నారు.అంతేకాకుండా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, నాయకత్వంలో విద్య మరియు సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని నిరుపేదలకు,దివ్యాంగులకు అందుబాటులో ఉండడమే తమ ప్రధాన బాధ్యత అని అన్నారు. అంతేకాకుండా దివ్యాంగులు తమ దివ్యాంగతను జయించి ఐఏఎస్, ఐ.పి.ఎస్, స్థాయికి ఎదిగిన ప్రముఖులు చాలా మందికి స్పూర్తి దయకమని ముఖ్యంగా దివ్యాంగులు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే దివ్యాంగత శరీరానికే పరిమితం కానీ తమ సంకల్పానికి కాదని పట్టుదల ,క్రమశిక్షణ , ఆత్మవిశ్వాసం ఉంటే ఏ లక్ష్యమైన సాధించవచ్చు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ గూగులోత్ జ్యోతి రమేష్ వీరితో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ సత్యనారాయణ,స్థానిక వార్డు కౌన్సిలర్ కాటా భాస్కర్, అంతేకాకుండా వివిధ వార్డుల కౌన్సిలర్ లు జిల్లా నాయకులు , పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version