టెన్త్ విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివి అత్యుత్తమ మార్కులు సాధించాలి.
జిల్లా విద్యాధికారి ముద్దమల్ల రాజేందర్.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల ఉన్నత పాఠశాలను మంగళవారం రోజున జిల్లా విద్యాధికారి ముద్దమల్ల రాజేందర్ సందర్శించారు, ఈ సందర్భంగా పాఠశాలలోని వివిధ రకాల రికార్డులను పరిశీలించారు, అనంతరం మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి కష్టపడి ప్రణాళిక బద్ధంగా చదివి విద్యార్థులందరూ అత్యుత్తమ మార్కులతో పాస్ కావాలని విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపారు సెక్టోరియల్ ఆఫీసర్ రాజగోపాల్ మాట్లాడుతూ విద్యార్థులను వివిధ సబ్జెక్టులలో ప్రశ్నలు అడిగి విద్యార్థుల నుండి జవాబులను తెలుసుకున్నారు ఈ సందర్భంగా అతని మాట్లాడుతూ విద్యార్థులలో విద్యా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆనందాన్ని వెలిబుచ్చాడు రానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో చిట్యాల ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాస్ కావాలని విద్యార్థులలో ప్రేరణ కల్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి పాఠశాల స్టాఫ్ సెక్రటరీ కూచనపల్లి శ్రీనివాస్ బొమ్మ రాజమౌళి నీలిమ రెడ్డి సుజాత విజయలక్ష్మి కల్పన ఉస్మానాలి మౌనిక పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సూధం సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.