పదేళ్ల నా తెలంగాణ… ప్రగతి చిరునామా

ఉద్యమ కాలం యాదిలో, తెచ్చిన తెలంగాణ వెలుగులో యుగపురుషుడు కేసిఆర్‌ ప్రస్థానం గురించి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే.

`కాలాన్ని మదించి, తెలంగాణ కోసం తెగించి,

`కల నిజం చేసి, తెలంగాణ సాధించి!!

`పద్నాలుగేళ్లు అలుపెరగని పోరు సలిపి.

`ఎత్తిన పిడికిలి దించని యోధుడు. 

`తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిన విజయుడు.

`పల్లె కన్నీటిని తూడ్చిన కరుణామయుడు.

`గోదారి పరుగు ఎదురునిలిచిన కాళేశ్వరుడు.

`గోదారి నీటిని తెలంగాణ పల్లెకు మళ్లించిన భగీరధుడు.

`నీటికి నడక నేర్పిన గొప్ప ధీరోదాత్తుడు.

`సమాజానికి దారి చూపిన దార్శనికుడు.

`తెలంగాణ ప్రగతి నిర్ధేశకుడు.

`తెలంగాణకు వెలుగులు పంచిన వీరుడు.

`సమస్యల మీద సమరం జరిపిన కార్యోన్ముకుడు.

`తెలంగాణ కోసం జీవితం ధారపోస్తున్న త్యాగధనుడు.

హైదరబాద్‌,నేటిధాత్రి:                 

పదేళ్ల నా తెలంగాణ…కోటి కోటి కాంతుల నజరానా…కోటి ఎకరాల మాగాణ. ప్రగతికి చిరునామా. ఒక్కసారి పదేళ్ల ముందుకు వెళ్తే..ఆనాటి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలన్నీ పటాంపచలు చేసి, తెలంగాణ వెనోళ్ల కొనియాడుతున్నది. కోటి కాంతులతో వెలుగుతున్నది. తెలంగాణ వస్తే ఇక చిమ్మ చీకట్లే అన్నారు. ఈ మాత్రం కరంటు కూడా వుండదన్నారు. తెలంగాణలో రైతులు ఆగమౌతారని అన్నారు. తెలంగాణ వ్యవసాయమంతా కరంటు మీదే ఆధారపడి సాగుతుంది. కరంటు రాకపోతే ఒక్క గింజ కూడా పండదన్నారు. కాని ఏం జరిగింది. ఉద్యమ కారుడైన ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే ఇరవై నాలుగు గంటల కరంటు తెచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క రోజు కూడా నిరంతర కరంటు తెలంగాణలో చూసింది లేదు. కాని తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే రెప్పపాటు కూడా పోని కరంటును ముఖ్యమంత్రి కేసిఆర్‌ అందించారు. విద్యుత్‌ ఉత్పాదనంతా ఆంధ్రప్రదేశ్‌లో వుంది. తెలంగాణ ఆగమౌతుందన్నారు. కాని ఎక్కడైతే కరంటు ఉత్పత్తి అవుతుందన్నారో అక్కడ కరంటు కోతలున్నాయి. తెలంగాణ వస్తే కరంటు రాకపోతే పారిశ్రామిక రంగం మొత్తం కుదేలౌతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కోతలతో విసిగిపోయిన పారిశ్రామిక వేత్తలు ఇందిరాపార్కు దగ్గర ధర్నాలు చేశారు. పవర్‌ హలీడేస్‌ ప్రకటించేవారు. కాని తెలంగాణ వచ్చాక నిరంతరం విద్యుత్‌ అందుబాటులోకి వచ్చింది. పవర్‌ హాలీడేస్‌ కాదు, తెలంగాణకు కొన్ని వేల పరిశ్రమలు వచ్చాయి. తెలంగాణ వస్తే రైతుకు అన్నం మెతుకు వుండదన్నారు. కాని ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క రోజు కూడా పట్టుమని మూడు గంటలపాటు నిరంతరం విద్యుత్‌ వ్యవసాయానికి అందింది లేదు. కరంటు బిల్లులు వసూలు చేస్తూ, రైతు మోటార్లు ఎత్తుకుపోతూ అందించిన కరంటుతో పంటలు పండిరదిలేదు. రైతు బాగు పడిరది లేదు. పైగా నాణ్యత లేని కరంటు మూలంగా ఎప్పుడూ మోటార్లు కాలిపోయేవి. రైతులను అప్పుల పాలు చేసేవి. కాని తెలంగాణ వచ్చాక కరంటు మోటార్లు కాలిపోయిన చరిత్ర ఎక్కడా లేదు. తెలంగాణ రాకముందు వ్యాపార సంస్ధలే కాదు, ఇళ్లలో కూడా జనరేటర్లు ఏర్పాటు చేసుకునేవారు. అప్పులు చేసి సోలార్‌ విద్యుత్‌ పరికాలు ఏర్పాటు చేసుకునేవారు. కాని ఇప్పుడు ఏ వ్యాపార సంస్ధలోనూ జనరేటర్‌కు అవకాశంలేదు. అవసరం కూడ లేదు. అదీ తెలంగాణ అంటే అంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో కలిసి పంచుకున్న పదేళ్లకిందటి తెలంగాణ కన్నీటి గాధలు.

తెలంగాణ వస్తే నీటి చుక్కకు గోస పడాల్సి వస్తుందని భయపెట్టారు.

కాని ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కావని అనుకున్న ప్రాజెక్టులు తెలంగాణలో నిర్మాణం చేసి చూపిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌ది. తెలంగాణ రాకుంటే ఇప్పటికీ అవే కరంటు కష్టాలు..నీటి కష్టాలు వుండేవి. నిరంతర కరంటు ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవు. పల్లెల వలస ఆగకపోవు. ఎంత పెద్ద మోతుబరి రైతైనా సరే హైదరాబాద్‌లో సెక్యూరిటి గార్డుగా పనిచేయాల్సివచ్చు. కాని ఇప్పుడు ఎకరం వున్న రైతు కూడా రాజులాగా మారిపోయాడు. ఎకరంలో తిండిగింజలు పండిరచుకోగలుగుతున్నారు. పాడి, పంటతో కుటుంబం పోషించుకుంటున్నాడు. సొంత ఊరులో హాయిగా జీవనం సాగిస్తున్నాడు. సాగుకోసం రైతు బంధు అందుకుంటున్నాడు. ఎకరం భూమి కూడ లక్షలు ధర పలుకుతుండడంతో భరోసాతో జీవిస్తున్నాడు. గతంలో ఎంత కాలం వలసపోయినా, తిండికి తప్ప మిగిలిందిలేదు. సంతోషంగా బతికిందిలేదు. ఊరు నొదిలి పోలేక, అక్కడ బతకలేక నరకం అనుభవించిన సగటు తెలంగాణ వ్యక్తి నేడు సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంటిని, పొలాన్ని చూసుకొని మురిసిపోతున్నాడు. ఇది కదా! తెలంగాణ జీవనం అంటే కాలు మీద కాలేసుకొని దర్జా కనబర్చుతున్నాడు. 

తెలంగాణ వస్తే హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ మాయమౌతుందని భయపెట్టారు. 

కాని ఏమైంది. హైదరాబాద్‌ బ్రాండ్‌ మరింత పెరిగింది. ఎవరూ ఊహించనంత ఎదగింది. ఇప్పుడు హైదరాబాద్‌ను చూస్తుంటే అమెరికాలో వున్నామా? లండన్‌లో వున్నామా? అన్న అనుమానం కలుగుతుందని సాక్ష్యాత్తు తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ అన్నారు. ఇటీవల సినీ నటి లయ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. పదేళ్ల కింద హైదరాబాద్‌, ఇప్పటి హైదరాబాద్‌ చూస్తే మతిపోతుంది. తెలంగాణ వస్తే హైదరాబాద్‌లో మత కల్లోలాలు రేగుతాయంటూ కూడా భయపెట్టారు. ఒకనాడు ఏడాదిలో కనీసం పది రోజులైనా పాతబస్తీలో కర్ఫ్యూ విధించేవారు. అంతకు ముందు నెలల తరబడి కూడా వుండేది. కాని తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడ అలాంటి పరిస్దితి ఎదురుకాలేదు. శాంతిభద్రతల సమస్య అసలే లేదు. ప్రశాంతమైన నగరంగా హైదరాబాద్‌ దేశంలోనే గొప్ప నగరంగా కీర్తినందుకుంటుంది. కాని తెలంగాణకు వ్యతిరేకశక్తులు కొన్ని అప్పట్లో శ్రీకృష్ణకమిటికీ హైదరాబాద్‌లో మత కల్లోలు రేగుతాయంటూ నివేదికలు ఇచ్చాయి. అంతే కాదు తెలంగాణ వస్తే ఐటి రంగమంతా తరలిపోతుందన్నారు. కాని ఏం జరిగింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన, మంత్రి కేటిఆర్‌ చొరవతో దేశంలో ఐటికి హైదరాబాద్‌ చిరునామా చేశాడు. దేశమంతా ఐటి అంటే హైదారాబాద్‌ వైపు చూసేలా చేస్తున్నాడు. 

తెలంగాణ వస్తే నక్కలైట్ల పెరుగుతారు.

 తెలంగాణ అల్లకల్లోలమౌతుంది. ఆగమౌతుంది. చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి నిరోధకాలు అంటూ చెప్పినవారి మాటలన్నీ అబద్దాలయ్యాయి. తెలంగాణ ప్రశాంతంగా మారింది. పల్లెలు వికసిస్తున్నాయి. తెలంగాణలో విద్య, వైద్యం ఎంతగా అభివృద్ది చెందింతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణలోని అన్ని నియోకవర్గాలలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఏర్పాటు చేసిన బిసి గురుకులాలతో తెలంగాణలో వైద్య విప్లవం మొదలైంది. ఇక ఒకనాడు ప్రభుత్వ వైద్యం అంటే తెలంగాణ ప్రజలు భయపడేవారు. కాని నేడు ప్రభుత్వ వైద్యం ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వాసుపత్రులకు ధైర్యంగా వెళ్తున్నారు. పెద్దపెద్ద ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే వైద్యమంతా ఉచితంగా అందుకుంటున్నారు. ఇక ప్రతి జిల్లాలో ఒక మెడికల్‌ వల్ల హైదారాబాద్‌లో అందే వైద్యమంతా జిల్లాల్లోనే అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్యవంతమైన తెలంగాణ సమాజనిర్మాణం జరగుతోంది. పల్లెలో పల్లె దవఖానాలు, బస్తీలలో బస్తీ దవఖానాలు, వరంగల్‌ లాంటి నగరంలో ఇప్పుడున్న ప్రభుత్వాసు పత్రులకు తోడుగా మరో 2వేల పడకల ఆసుపత్రి, హైదరాబాద్‌ చుట్టూ నాలుగు పెద్ద ఆసుపత్రులు, నిమ్స్‌ మరింత ఆధునీకరణ జరుగుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ అన్ని రంగాల్లో బెస్టు…ఫస్ట్‌ అన్నది పదేళ్లలో సాధించింది. 

నిర్మాణాల పరంగా చూసుకుంటే హైదరాబాద్‌లో మెట్రో పూర్తి చేయడమేకాకుండా, మరో దశ కూడా మొదలుకాబోతోంది.

 ఇక నగరంలో ఎక్కడా ట్రాపిక్‌ సమస్య రాకుండా వుండేందుకు ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్లుతో హైదరాబాద్‌ రూపురేఖలే మారిపోయాయి. హుస్సేన్‌ సాగర్‌కు ఆనుకొని వున్న కొత్తగా దవళకాంతిలో మెరస్తున్న కొత్త డాక్టర్‌. బిఆర్‌. అంబెద్కర్‌ నూతన సచివాలయం, అటు పక్కన 125 అడుగుల ఎత్తైన అంబెద్కర్‌ విగ్రహం, సెక్రటేయట్‌కుముందు అమరవీరుల స్మృతి చిహ్నం… ఎన్ని అందాలు..ఎంత గొప్ప కట్టడాలు..ఇదంతా మన తెలంగాణ. మన ముఖ్యమంత్రి కేసిఆర్‌ కలలు గన్న తెలంగాణ..ఆయన ఆలోచనలనుంచి రూపుదిద్దుకున్న తెలంగాణ. సిరుల తెలంగాణ. కొత్తగా సింగారించుకున్న తెలంగాణ. బంగారు తెలంగాణ. దశాబ్ధి కలలో మిలమిల మెరుస్తున్న తెలంగాణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *