చిన్న సినిమా బృందం కేతకి సంగమేశ్వర స్వామిని దర్శించుకుంది

చిన్న సినిమా బృందం కేతకి సంగమేశ్వర స్వామిని దర్శించుకుంది

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఝరాసంగం మండలం, శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం చిన్న సినిమా బృందం స్వామివారిని దర్శించుకుంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ మహమ్మద్ జాంగిర్, డైరెక్టర్ ఎస్కే శివలింగ్, కెమెరామెన్ డి.ఓ.పి శివ గౌడ్ ఎల్లంకి, ప్రదీప్, రవి తదితరులు పాల్గొన్నారు. సినిమా బృందాన్ని ఆలయ నిర్వాహకులు సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వినోద్ బాలరాజ్, మాజీ సర్పంచ్ జగదీశ్వర్ మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

గ్రామంలో స్తంభాలకు బిగిస్తున్న వీధి దీపాలు..

గ్రామంలో స్తంభాలకు బిగిస్తున్న వీధి దీపాలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం గ్రామంలోని విధి ప్రాంగణంలో గత కొన్ని రోజులుగా పనిచేయని వీధి దీపాలు నూతన సర్పంచ్ వినోద బలరాజ్ ఉప సర్పంచ్ గడ్డం మమత అనిల్ పటేల్ గారి చొరవతో మళ్లీ వెలుగులు నింపుతాయని.ఈ ప్రాంతం గ్రామానికి ముఖ్యమైన కేంద్రం కావడంతో వందలాది మంది భక్తులు ప్రయాణికులు, గ్రామస్తులు రాకపోకలు సాగిస్తుంటారు. కొన్ని వీధి దీపాలు వెలగకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వీధి దీపాలు బిగిస్తున్న పరిసరా ప్రాంతాల్లో ,రాత్రివేళ రాకపోకలు సులభ మవుతాయని. గ్రామ అభివృద్ధికి ఇది మంచి ఆరంభమని గ్రామస్తులు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లకు అభినందిస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version