సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం…

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

కల్వకుర్తి/ నేటి దాత్రి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినం వైశాఖ శుద్ధ దశమి ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు జీవో జారీ చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ప్రాంగణంలో ఆలయ చైర్మన్ జూలూరు రమేష్ బాబు ఆధ్వర్యంలో పట్టణ, మండల,ఆర్యవైశ్య మహాసభ, వాసవి క్లబ్, అవోప అనుబంధ సంఘాల నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కులదైవం వాసవి మాత జన్మదిన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఆర్యవైశ్యులు అందరికీ ఇది ఎంతో గర్వకారణమని ముఖ్యమంత్రి కి ఆర్యవైశ్యుల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నట్లు జూలూరు రమేష్ బాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వాసా శేఖర్, కార్యదర్శి సంబు ముత్యాలు, కోశాధికారి అప్పయిపల్లి శ్రీనివాస్, ఆ వోప అధ్యక్షుడు కల్మిచర్ల రాఘవేందర్, వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చిగుల్లపల్లి శ్రీధర్, గుగ్గిల శంకర్, వాసవి క్లబ్ అధ్యక్షుడు బాదం హరీష్, జోన్ చైర్మన్ బాదం రఘు,కల్వ ఆంజనేయులు, కల్వ రమేష్, గంప వెంకటేష్, కంది ప్రవీణ్, పాపిశెట్టి శ్రీనివాస్, గుబ్బ కిషన్, గందే రవి, శివ రాఘవేందర్, కల్వ కిషోర్, పాపిశెట్టి ప్రసాద్, చెరుకు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

వాసవి మాత జయంతిని అధికారికంగా చేపట్టడానికి సీఎం ఆదేశాలు

వాసవి మాత జయంతిని అధికారికంగా చేపట్టడానికి సీఎం ఆదేశాలు

హర్షం వ్యక్తం చేసిన బాదం
,
వనపర్తి నేటిదాత్రి .

*వాసవి మాత జయంతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అధికారికంగా చేపట్టడానికి ఆదేశాలు జారీ చేయడం పట్ల కురుమూర్తి దేవస్థానం బోర్డ్ మెబర్ బాదం వెంకటేష్ ఒక ప్రకటన లో హర్షం వ్యక్తం చేశారు.”ఈసందర్భంగా బాదం మాట్లాడుతూ ,’వాసవి జయంతి పండుగ ‘మాత్రమే కాదని ఆర్యవైశ్యుల ప్రత్యేక ఆత్మగౌరవానికి” గుర్తింపు.వాసవి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం గర్వించదగ్గ విషయమని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం అభినందనీయం మని ఇంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ఆర్యవైశ్యుల నిమిత్తం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ నిరుపేద ఆర్యవైశ్యులు ఆన్లైన్లో దరఖాస్తు లు చేసుకున్నారని ఇప్పిటి వరకు ఆర్యవైశ్య కార్పొరేషన్ నుండి రుణాలు మంజూరు కాలేదని ఆయన పేర్కొన్నారు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ఆర్యవైశ్య కార్పొరేషన్ నుండి పేద ఆర్యవైశ్య లకు రుణాలు ఇప్పిం చి ఆదుకోవాలని బాదం వెంకటేష్ ఆర్యవైశ్యల తరుపున కోరారు విషయాన్ని గుర్తు చేస్తున్నాం.అదేవిధంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించడం. రాజకీయాలలో కూడా మంచి గుర్తింపు ఇస్తున్నందుకు కొత్తకోట దేవరకద్ర వనపర్తి జిల్లా ప్రజల ఆర్యవైశ్యుల తరుపున సీఎం రేవంత్ రెడ్డి దేవర్ కద్ర ఎమ్మెల్యే
జిఎంఆర్ కు బాదం ఒక ప్రకటన లో కృతజ్ఞతలు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version