త్రివర్ణ పతాకాన్ని ఎగరావేసిన బీజేపీ శ్రేణులు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-44.wav?_=1

త్రివర్ణ పతాకాన్ని ఎగరావేసిన బీజేపీ శ్రేణులు

*అహింసా పదం మన మార్గం తగధనాల త్యాగాలతో సూర్యునిగా వెలుగొందుతున్న దేశం మన భారతదేశం

 

వర్ధన్నపేట (నేటిధాత్రి):
మండల కేంద్రంలోని వివేకానంద మండల అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ కొండేటి అనిత ఆధ్వర్యంలో బిజెపి నాయకులతో కలిసి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం బైక్ ర్యాలీ తో ముగించారు.

79th Independence Day.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొండేటి అనిత సత్యం , జిల్లా కౌన్సిల్ మెంబర్ మైస రాము, మాజీ మండల అధ్యక్షులు మండల కన్వీనర్ రాయపురం కుమారస్వామి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సిందం శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షులు పెద్దూరి రాజు, బిజెపి సీనియర్ నాయకులు చేపూరి వెంకటస్వామి, మండల కార్యదర్శి మల్లెపక అనిల్, బోయినపల్లి దేవేందర్ రావు, వెల్మకంటి గిరిప్రసాద్, ఎస్సీ సీ మోర్చా మండల అధ్యక్షులు, నక్క రవి ఓబీసీ మోర్చా, పెన్ తోటి మహంత్ యువమోర్చా, రాకేష్ వెలిశాల, నిమ్మాని సోమేశ్వరరావు, తక్కలపల్లి విష్ణు, వడ్లకొండ మణిదీప్, బొంత రవి, ఆలకుంట లక్ష్మణ్, కుసుమ రాంబాబు, వెలమ కంటి వేణు, తాళ్లపల్లి కృష్ణమూర్తి,అనపర్తి శ్రీకాంత్, కొండేటి శివ, తదితరులు పాల్గొన్నారు

ఎమర్జెన్సీ ప్లాన్లో భాగంగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-12T141549.362.wav?_=2


ఎమర్జెన్సీ ప్లాన్లో భాగంగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు

ఆపత్కాలంలో బల్దియా టోల్ ఫ్రీ నెంబర్ నెంబర్కు సమాచారం ఇవ్వాలన్న మున్సిపల్ కమిషనర్.

బల్దియా కమిషనర్తో కలిసి వరంగల్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలను సందర్శించిన వరంగల్ కలెక్టర్.

వరంగల్, నేటిధాత్రి

భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు జలమయమైన వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించి సమర్థవంతంగా చర్యలు చేపట్టుటకు అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిధి లోని నాలుగు మండలాలలైనా వరంగల్, సంగెం, ఖిలా వరంగల్, వర్ధన్నపేటలలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం జరిగిందని అత్యధికంగా సంగెం మండలంలో 24 సెంటీమీటర్ల వర్షపాతం,

ఖిలా వరంగల్ మండలం లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందని, జలమయమైన లోతట్టు ప్రాంతాలైన సాయి గణేష్ కాలనీ, గాంధీ నగర్, డి కే నగర్, లెనిన్ నగర్, అగర్తల చెరువు ప్రాంతం, మైసయ్య నగర్, గిరి ప్రసాద్ కాలనీ, పద్మ నగర్, శాకారాశికుంట తదితర ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో సందర్శించడం జరిగిందని, వర్షపు నీరు బయటకు వెళ్లే స్ట్రాం వాటర్ డ్రైన్ లు ఇరుకుగా ఉండడం వల్ల నీటి ప్రవాహంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఖిలావరంగల్ నుండి వరంగల్ వరకు జీడబ్ల్యూఎంసి తరపున అట్టి నాలాను విస్తరించడానికి పనులు కొనసాగుతున్నాయని, లోతట్టు ప్రాంతాలలో ఎమర్జెన్సీ ప్లాన్ కింద చర్యలు చేపట్టడం జరుగుతుందని మంగళవారం రాత్రి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని, లోతట్టు ప్రాంతాలలో ఉండే ప్రజల కోసం ఆహారంతో పాటు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మందులు అందుబాటులో ఉంచడం జరిగిందని, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో పిల్లలను పాఠశాలకు పంపించవద్దని, ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే క్రమంలో ప్రాణహాని ఉంటుందని, కావున పిల్లలను చెరువుల్లో చేపల వేటకు వెళ్లకుండా తల్లిదండ్రులు నియంత్రించాలని, విద్యుత్ సంబంధ వస్తువులను తాకకుండా ఉండాలని, వర్షాలు కురిసే క్రమంలో ఎర్తింగ్ వచ్చే అవకాశం ఉంటుందని, భారీగా నీరు నిలిచి ఉండే లోతట్టు ప్రాంతాలకు విద్యుత్తు నిలిపివేయడం జరిగిందని, ఒకరోజు పునరవస కేంద్రాలలో ఆవాసం పొందడం వల్ల కలిగే నష్టం ఏమీ లేదని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వారు అందజేసిన సాటిలైట్ ఇమేజ్ లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని సమాచారం అందిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు.

బల్దియా కమిషనర్ మాట్లాడుతూ….

జీడబ్ల్యూఎంసి తరపున డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని ప్రతి వార్డులో జవాన్తో పాటు ప్రత్యేక మాన్ సూన్ బృందాలు అందుబాటులో ఉన్నాయని అంతే కాకుండా ఇంజనీరింగ్ బృందాలు కూడా క్షేత్ర స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారని వర్షపు నీటిని వేగవంతంగా బయటకు పంపించడానికి కచ్చా కాలువల ద్వారా పంపించడం జరుగుతుందని, శాశ్వత పరిష్కారం కోసం నాలాను

విస్తరించడంతో పాటు డ్రైన్ ఆక్రమణలను తొలగించడం జరుగుతుందని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సమీప ప్రాంతాల్లో ఉన్న పునరావాస కేంద్రాల్లోకి వెళ్లాలని ప్రస్తుతం 6 పునరావాస కేంద్రాలు ఎస్ ఆర్ నగర్ లో శుభం గార్డెన్, గాంధీ నగర్, మైసయ్యనగర్ కమ్యూనిటీ హాల్లో, డి కే నగర్లో బీరన్నకుంట హై స్కూల్ , గిరి ప్రసాద్ నగర్లోని కమ్యూనిటీ హాల్, ఏం ఎన్ నగర్ లోని మార్వాడీ హాల్లలోను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం ఆయా కేంద్రాలలో ప్రజలు ఆవాసం పొందుతున్నారని ఉదయం సుమారు 1300 మందికి అల్పాహారం అందజేయడం జరిగిందని లంచ్ తో పాటు డిన్నర్ కూడా అందజేస్తామని ప్రజల అవసరాల కోసం వరంగల్, హన్మకొండ కలెక్టరేట్ లతో పాటు బల్దియా ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ : 18004251980, మొబైల్ నంబర్:

9701999676 అందుబాటు లోకి తెచ్చామని, ప్రజలు ఈ నంబర్లలో సంప్రదించాలని జీడబ్ల్యుఎంసి తరఫున 2 డిఆర్ఎఫ్ బృందాలు 24×7 మూడు షిఫ్టులలో పనిచేస్తున్నాయని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఏంహెచ్ఓ సాంబశివరావు ఆర్డిఓ సత్యపాల్ రెడ్డి, సిఏంహెచ్ఓ డా.రాజారెడ్డి, డి ఎఫ్ ఓ శ్రీధర్ రెడ్డి, ఏం హెచ్ ఓ డా.రాజేష్ ఇంచార్జి ఈ ఈ సంతోష్ బాబు, వరంగల్, ఖిలా వరంగల్ తహసీల్దార్ లు మహమ్మద్ ఇక్బాల్, నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికి బీజేపీ ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు కార్యక్రమం జోరుగా

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-31.wav?_=3

ఇంటింటికి బీజేపీ ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు కార్యక్రమం జోరుగా

వర్దన్నపేట నేటిధాత్రి :

భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల,కడారి గూడెం గ్రామం పరిధిలోని 227 228 229 బూత్ శక్తి కేంద్రం ఇంచార్జ్ నాంపల్లి కుమార్ ఆధ్వర్యంలో మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా “ఇంటింటికి బిజెపి ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు” పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి జడ సతీష్ అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని మోసాన్ని నరేంద్ర మోదీ గారి పథకాల గొప్పతనాన్ని నిబద్ధత గల సైనికులుగా పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరింత బలంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు చిక్కొండ రాజు , పింగిలి రాజేందర్ రెడ్డి. జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి పింగిలి సంపత్ రెడ్డి. బూత్ కమిటీ సభ్యులు చిర్రా కిరణ్. వంగాల రాజేందర్ రెడ్డి . పింగిలి ఇంద్రసేనారెడ్డి. సుదర్శన్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-05T113244.651.wav?_=4

వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో

*దేవాదుల నీటి కోసం రైతుల పోరాటం
*దేవాదుల నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను రక్షించాలి.

*భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఉండూరు మహేందర్ రెడ్డి.

వర్ధన్నపేట (నేటిధాత్రి):

వర్ధన్నపేట మండలం చెరువును దేవాదుల నీటితో నింపాలని జాతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కట్ర్యాల గ్రామం వద్ద వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఉండూరు మహేందర్ రెడ్డి. జిల్లా కార్యదర్శి జడ సతీష్.

Warangal-Khammam national highway

కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి పింగిలి సంపత్ రెడ్డి. బూత్ అధ్యక్షులు పింగిలి రాజేందర్ రెడ్డి . కడారి గూడెం మాజీ సర్పంచ్ మంద సతీష్. కంజర్ల రంజిత్ మరియు రైతులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం దేవాదుల నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి నీటి కోసం పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు.

అల్ఫోర్స్ హై స్కూల్ (సి బి ఎస్ ఈ) వర్ధన్నపేట లో ఘనంగా బోనాల జాతర.

అల్ఫోర్స్ హై స్కూల్ (సి బి ఎస్ ఈ) వర్ధన్నపేట లో ఘనంగా బోనాల జాతర.

వర్దన్నపేట (నేటిధాత్రి):

బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప ప్రతీక అని మరియు మతసామరస్యానికి నాంది పలికేటువంటి విశిష్టమైన పండుగ అని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత & విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వి. నరేందర్ రెడ్డి స్థానిక అల్ఫోర్స్ హై స్కూల్ వర్ధన్నపేట (సీబీఎస్ఈ) లో వేడుకగా నిర్వహించినటువంటి బోనాల ఉత్సవ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలో అందంగా అలంకరించినటువంటి అమ్మవారి విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి జ్యోతిని వెలిగించి పూజ కార్యక్రమాన్ని ఆచరించి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాడమాసంలో జరుపుకునేటువంటి ఈ బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలరోజుల పాటు దేదీప్యమానంగా వేడుకగా కుటుంబ సభ్యుల ఆనందోత్సవాల మధ్య చాలా ఘనంగా జరుపుకుంటారని గుర్తు చేశారు. ఈ పండుగ తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చే పండుగ అని ఈ పండుగ ద్వారా కుటుంబాలలో సుఖసంతోషాలతో పాటు ఆయురారోగ్యాలు వెళ్లి విరిస్తాయని అభిప్రాయపడ్డారు.మన రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులో నెల రోజుల పాటు వేడుకగా జరిగే ఈ సంబరాలు ఆకాశమే హద్దుగా అన్నట్టుగా జరుపుకుంటారని తెలిపారు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో సైతం ఈ సంప్రదాయాన్ని క్రమం తప్పకుండా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు విద్యాసంస్థల మీదనే కాకుండా విద్యార్థుల మీద వారి పరివారాల మీద ఎల్లప్పుడూ పుష్కలంగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుండడం చాలా హర్షించదగ్గ విషయమని చెప్పారు.వేడుకలలో భాగంగా విద్యార్థుల ప్రదేశించినటువంటి పలు అమ్మవారి నృత్యాలు పోతురాజు వేషాలు చాలా ఆకర్షణంగా నిలిచాయి
ముఖ్యంగా విద్యార్థులు ప్రదేశించినటువంటి గ్రామదేవతల వైభవం నృత్య ప్రదర్శన ఆలోచింపజేసింది.ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు వివిధ ఆకర్షణీయమైన సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి ప్రాంగణానికి వన్నె తెచ్చారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో.

వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు…

అసైన్డ్ భూమి సాగు చేసుకుంటున్నా దళిత గిరిజన రైతులు స్కూల్, ప్రభుత్వ కార్యాలయాల కోసం భూమి ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం.

వర్ధన్నపేట పట్టణ శివారు లోని గువ్వల బోడు 118 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే నాగరాజు

వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని గువ్వల బోడుకు చెందిన ప్రభుత్వ భూమిని నేడు స్వయంగా మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో గారితో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు

 

వర్ధన్నపేట( నేటిధాత్రి ):

shine junior college

నియోజకవర్గానికి ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇటీవల గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడంతో నేడు వర్ధన్నపేట పట్టణ కేంద్రం లోని గువ్వల బోడు కి చెందిన ప్రభుత్వ భూములను మంగళవారం రోజున ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలతో కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కోసం అనువైన స్థలాన్ని పరిశీలన చేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు
ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ ప్రభుత్వ కార్యాలయాలకు స్థల పరిశీలనకు ఎమ్మెల్యే నాగరాజు రావడం పట్ల గ్రామస్తులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూసుదీర్ఘ కాలంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గానికి పరిపాలన చేసిన కూడా వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదని, నియోజకవర్గంలో అనువైన స్థలం లేదని దాటవేసి ప్రభుత్వ విద్యాసంస్థలను ఇతర ప్రాంతాలకు తరలించుకొని పోయారు. దీంతో నియోజకవర్గ అభివృద్ధి కుంటపడిపోయిందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. నేను నాయకుడిని కాదు సేవకుని అని మరొకసారి నిరూపించుకోవడానికి సమయం ఆసన్నమైందని వర్ధన్నపేట పట్టణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్, ద్వారా నిజం కానుండటంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే నాగరాజుకు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా విద్యా రంగానికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు.

వర్ధన్నపేట నియోజకవర్గనికి ఇంటి గ్రేటెడ్ స్కూల్ మంజూరు.

వర్ధన్నపేట నియోజకవర్గనికి ఇంటి గ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిన సందర్భంగా

సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు చిత్రాపటాలకి క్షీరాభిషేకం చేసిన వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు

వర్ధన్నపేట( నేటిదాత్రి ):

పట్టణ కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తాలోపట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు,
వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో అత్యధిక నిధులతో సదుపాయాలతో కూడిన స్కూలును మన కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయడం గర్వకారణం అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధించడంల ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు కృషి ఫలితమే నిదర్శనం అన్నారు. అత్యధిక వసతులతో కూడిన ఈ ప్రాజెక్టు మన నియోజకవర్గానికి రావడం గర్వకారణం అన్నారు. ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి బంగారు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడంతోపాటు విద్యాభివృద్ధికి, తోడ్పాటును అందించడం జరుగుతుందన్నారు. చదువుకుంటేనే భవిష్యత్తులో ప్రతిది మనం సాధించుకోగలుగుతాం అన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి నిరుపేద కుటుంబానికి అందించడంలో ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య,
కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు, మైస సురేష్, ఎద్దు సత్యనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోశాల వెంకన్న, మహమ్మద్ అప్సర్ కర్ర మాలతి రెడ్డి,
వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు,పార్టీ యూత్, మరియు ,
కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version