రైతులకు బయోచార్ మరియు పత్తి సాగుపై శిక్షణ.!

రైతులకు బయోచార్ మరియు హెచ్ డి పి సి పత్తి సాగుపై శిక్షణ కార్యక్రమానికి పాల్గొన్న జిల్లా వ్యవసాయ అధికారి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం రైతు వేదికలో ఆరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్ ద్వారా నిర్వహించబడిన రైతులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం స్థిరమైన వ్యవసాయ పద్ధతులు మరియు పత్తి సాగులో తాజా మార్పులపై దృష్టి సారించాలన్నారు..
ఈ సందర్భంగా అరణ్య సీఈఓ శ్రీమతి పద్మ కోప్పుల మాట్లాడుతూ, వ్యవసాయ వ్యర్థాలతో తయారయ్యే కార్బన్ అధికంగా ఉండే బయోచార్ ప్రయోజనాలను వివరించారు. “బియోచార్ మట్టిలో పోషకాలు మరియు నీటిని నిలిపే సామర్థ్యాన్ని పెంచుతుంది, సూక్ష్మజీవుల కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది, రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గిస్తుంది,” అని ఆమె చెప్పారు. “ఇది మట్టిలో కార్బన్ను వందల సంవత్సరాలపాటు నిలుపుతుంది. ఇది వాతావరణానికి మేలు చేసే పరిష్కారం.” రైతులు బయోచార్తో కంపోస్టింగ్ ప్రారంభించాలని ఆమె సూచించారు. “మీ మట్టి, మొక్కలు మరియు భూమి మిమ్మల్ని ధన్యవాదాలు చెబుతాయి,” అని ఆమె అన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి (డి ఏ ఓ ) శ్రీ కె. శివప్రసాద్ హెచ్ డి పి సి పత్తి సాగుపై వివరాలు పూర్తి వివరాలు తెలియచేశారు.
“ఎకరాకు ఎక్కువ విత్తనాలు వేసి, తక్కువ దూరంతో సాగు చేస్తే దిగుబడి బాగా పెరుగుతుంది,” అని ఆయన అన్నారు. “దేశంలో పెరుగుతున్న పత్తి డిమాండ్ను తీర్చడానికి, తక్కువ దిగుబడిని అధిగమించడానికి హెచ్ డి పి సి సరైన మార్గం” అని ఆయన పేర్కొన్నారు.
సహాయ సంచాలకులు బిక్షపతి మాట్లాడుతూ పాత పద్ధతి వ్యవసాయం నూతన పద్ధతిలో వ్యవసాయం గురించి తేడాలను రైతులకు వివరించడం జరిగింది.
మండల వ్యవసాయ అధికారి వెంకటేశం మాట్లాడుతూ గత ఏడాది అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు గురించి గత ఏడాది వచ్చిన సమస్యల గురించి వాటికి ఏ విధంగా అధిగమించాలని రైతులకు సూచించడం జరిగింది, అలాగే ఫార్మర్ రిజిస్ట్రీ సోమవారం నుండి చేయడం జరుగుతుంది అని తెల్పడం జరిగింది,
రైతులకు ఉచితంగా బయోచార్ను అందిస్తూ, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కంపెనీ పనిచేస్తోందని తెలిపారు.
నూజీవీడు సీడ్స్ ప్రతినిధి మాట్లాడుతూ, హెచ్ డి పి సి పత్తి సాగు రైతుల్లో మంచి ఆదరణ పొందుతోందన్నారు.
ఈ పద్ధతిలో సంప్రదాయ సాగుతో పోల్చితే ఎకరాకు 3 నుండి 5 క్వింటాళ్ల ఎక్కువ పత్తి దిగుతుంది. ఈ సీజన్లోనే 59 జిల్లాల్లో 35,000 ఎకరాల్లో హెచ్ డి పి సి పత్తి నమోదు చేయడం దీనికి నిదర్శనం అన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమం గ్రామీణ భారతదేశంలో వ్యవసాయ దిగుబడులు మరియు పర్యావరణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స్థిరమైన సాగు పద్ధతులను ప్రోత్సహించేందుకు కీలకమైన అడుగు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు బిక్షపతి మరియు మండల వ్యవసాయ అధికారి వెంకటేశం ఆరణ్య ఎన్జీవో సీఈవో పద్మ నూజివీడు సీడ్స్ నరసింహారెడ్డి, ప్రతినిధులు, వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు రైతులు పాల్గొనడం జరిగింది..

రాష్ట్ర స్థాయి శిక్షణ పొందిన విద్యార్థులకు సన్మానం

నర్సంపేట,నేటిధాత్రి

నర్సంపేట ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎల్ గౌతం, బి.అనసూయ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యవేక్షణలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన “ఇంపార్టింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ట్రైబల్ స్టూడెంట్స్ ఫర్ తెలంగాణ” శిక్షణ కార్యక్రమంలో భాగంగా హాజరై నెల రోజుల రెసిడెన్షియల్ కోర్సు విజయవంతంగా ముగించుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్ డాక్టర్ ప్రొఫెసర్ మల్లం నవీన్ అభినందించారు.అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇంగ్లీషు విశ్వభాషగా మారిందని ఆంగ్ల భాష నైపుణ్యాలు సంపాదించడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు పొందుతారని చెప్పారు.ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయని వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని విద్యార్థులు అంచెలంచెలుగా ఎదగాలని సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలలోని డిగ్రీ కళాశాలల గిరిజన విద్యార్థులకు తొలిసారిగా నిర్వహించిన ఇంగ్లీష్ భాష నైపుణ్య శిక్షణ కార్యక్రమానికి వరంగల్ జిల్లా నుంచి నర్సంపేట ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికై విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చినందుకు టి ఎస్ కే సి కోఆర్డినేటర్ ఇంగ్లీష్ విభాగం అధిపతి ఎంఎంకె రహిముద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బైరి సత్యనారాయణ, అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్ కమలాకర్,అధ్యాపకులు అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version