నా పాక ఆలయ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు.

నా పాక ఆలయ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలో గల అతి ప్రాచీన గల నాపాక దేవాలయ ప్రాంగణంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ యాదడ్ల రాజయ్య తెలిపారు ఈ కార్యక్రమానికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పలువురు రాజకీయ నాయకులు హాజరవుతారని తెలిపారు, ఈ ప్రాచీన ఆలయం రాష్ట్రంలో ఎక్కడ లేని విధానం ఒకే శిలపై నాలుగు ద్వారాలకు నాలుగు విగ్రహాలను రూపొందించి ఏకశిలపై గుడిని ప్రాచీన కట్టడాలతో నిర్మించి ఉన్న విశిష్ట గల దేవాలయం అని తెలిపారు ఈ ఆలయంలో రానున్న రోజుల్లో భూపాలపల్లి శాసనసభ్యుడు సహకారంతో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి జరిగేలా ఆలయ అభివృద్ధికి తోడ్పడతామని అన్నారు సీతారాముల కళ్యాణం అనంతరం నృత్య రవళి కళాక్షేత్రం హనుమకొండ 40 మంది కళాకారులచే కూచిపూడి భరతనాట్యం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లాలోని మండలాల్లోని వివిధ గ్రామాల భక్తుల ప్రజలు సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు కృతజ్ఞతలు కాగలరని తెలిపారు.

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన దేవాలయం.

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన దేవాలయం

ఆలయ అభివృద్ధికి నగదు అందజేత

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయం లో.,ఏప్రిల్ 6వ, తారీకు నిర్వహించనున్న శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాని, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ముస్తాబ్ చేయటం జరిగింది, అదేవిధంగా ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ ఆదివారం నిర్వహించబోనున్న సీతారాముల కల్యాణ మహోత్సవాలో భాగంగా మొదటిగా ఆలయంలో వేద పండితులు చేత తొలక్కం పారాయణం జరుగుతుంది ఏప్రిల్ ఆరో తారీకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది . తదుపరి హోమాలు అదేవిధంగా గ్రామ పర్యటనలో భాగ ంగా రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఏప్రిల్ 11 వ తారీకు నాగబెల్లి తో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి అని తెలిపారు
రామాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు ముసునూరి నరేష్, శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది . అదేవిధంగా గణపురం చెందిన కీర్తిశేషులు అమరాజి మొగిలి జ్ఞాపకార్థం కుమారుడు అమరాజి సతీష్, ఆలయ అభివృద్ధి కొరకు 10, వేల 116 రూపాయలను ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన గౌడ్ కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూలా శ్రీనివాస్ గౌడ్ బటిక స్వామి బూర రాజగోపాల్ మాదాసు అర్జున్ మాదాసు మొగిలి దయ్యాల భద్రయ్య పాండవుల భద్రయ్య మోటపోతుల రాజన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు

గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విరాళం.

గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విరాళం

మరిపెడ  నేటిధాత్రి.

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామంలో యాదవ సంఘం కమిటీ ఆధ్వర్వంలో శ్రీగంగమ్మ తల్లి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ నూతన ఆలయ నిర్మాణానికి మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ను బుధవారం మరిపెడ మండలం బీచ్ రాజుపల్లి గ్రామంలో యాదవ సంఘం కమిటీ సభ్యులు కలిసి సహాయ సహకారాలు అందించాలని కోరారు. దీంతో వెంటనే స్పందించిన గుడిపూడి నవీన్ రావు గుడి నిర్మాణానికి రూ.30 వేలు ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా గుడిపూడి నవీన్ రావుని యాదవ సంఘం కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసీ కొమ్ము నరేష్,కొమ్ము చంద్రశేఖర్,కోడి శ్రీకాంత్,వల్లపు లింగయ్య, కొమ్ము లింగయ్య,కొమ్ము ఉప్పలయ్య, కొమ్ము ఐలయ్య,కోడి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

భక్తాంజనేయ స్వామి ఆలయకమిటీ చైర్మన్ గా.!

భక్తాంజనేయ స్వామి ఆలయకమిటీ చైర్మన్ గా అంబీరు మహేందర్ ప్రమాణ స్వీకారం

 

పరకాల నేటిధాత్రి

మండల పరిధిలోని మల్లక్కపేట గ్రామంలో బుధవారం రోజున ఉదయం 9:45 నిమిషాలకు శ్రీ భక్తాంజనేయ స్వామి పాలకవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.మల్లక్కపేట గ్రామానికి చెందిన అంబీరు మహేందర్ ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పరకాల మండల మరియు పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు,జడ్పిటిసిలు,ఎంపీపీలు,ఎంపీటీసీలు సర్పంచులు,వార్డ్ మెంబర్లు మరియు పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్,డైరెక్టర్స్, పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్,కౌన్సిలర్స్ పరకాల మండల మరియు పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు,కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ మహిళా కాంగ్రెస్ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావలని అంబీరు మహేందర్ కోరారు.

శ్రీ మత్స్యగిరిస్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం.

శ్రీ మత్స్యగిరిస్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరిస్వామి దేవాలయం లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం దేవాలయంలో అర్చకులు ఆరుట్ల కృష్ణమా చారి పంచాంగశ్రవణం చేసినారు. ఈ సంవత్సరము సూర్యుడు రాజు అగుట వలన నాయకుల మధ్య పరస్పర విరోధము తీవ్రంగా ఉంటుం దని మంత్రి చంద్రుడు ఆగుటచే పంటలు మామూలుగా పండు తాయని ఆహారధాన్యాల కొరత ఉండదని అన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ సామల బిక్షపతి వినుకొండ శంకరాచారి, ఏంశెట్టి ప్రభాకర్ నల్లెల్లవిజేందర్ ,గాదే రాజేందర్, బాసని చంద్రమౌళి దిండిగాల వంశీ, బెరుగు రాజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రాచన్న స్వామి ఆలయంలో అభిషేకాలు.

రాచన్న స్వామి ఆలయంలో అభిషేకాలు.

 

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

కోహిర్ మండలం బడంపేటలోని రాచన్న స్వామి దేవాలయంలో సోమవారం ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. స్వామివారికి బిల్వదళాలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలను చేశారు. రాచన్న స్వామిని దర్శించుకునేందుకు సంగారెడ్డి తో పాటు మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

శనీశ్వర ఆలయంలో మంత్రి దామోదర్ ప్రత్యేక పూజలు.

శనీశ్వర ఆలయంలో మంత్రి దామోదర్ ప్రత్యేక పూజలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

శని అమావాస్య సందర్భంగా ఝరాసంగం మండలం బర్దిపూర్ లోని శనీశ్వర ఆలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనీశ్వర విగ్రహానికి తైలాభిషేకాలను చేశారు. అనంతరం ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖామని 1008 అవధూత గిరి మహారాజ్ ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

రాచన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.

రాచన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ ర్ మండలం బడంపేటరాచన్న స్వామి ఆలయంలో శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈకార్యక్రమంలోభక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు జగదీశ్వర్ స్వామి, బుచ్చయ్య స్వామి, చిన్న వీరయ్య స్వామి, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

దేవాలయం అభివృద్ధి కొరకు కృషి.

దేవాలయం అభివృద్ధి కొరకు కృషి

మందమర్రి నీటి ధాత్రి

పట్టణంలోని మారుతి నగర్ అభయాంజనేయ స్వామి ఆలయ ఛైర్మెన్ శ్రీ బండి సదానందం యాదవ్ ఆదేశం మేరకు అలయకమిటి సభ్యులు మరియు వివిధ వార్డు లకు సంబంధించిన అభయ ఆంజనేయ స్వామి భక్తులకు తెలియజేయునది ఏమనగా.

తేదీ 6/4/2025 రోజున శ్రీరామ నవమి ఉన్నందున శ్రీరామ నవమి కార్యక్రమాన్ని జరుపుకోవడం తో పాటు ఆలయ కమిటీ ని సవరిస్తూ భవిష్యత్తు లో ఆలయాన్ని పెద్ద మొత్తము లో గుడి అభివృద్ధి మరియు ఇతర కొన్ని సమస్య లపై చర్చించుకునేందుకు ఎల్లుండి ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు గుడి ప్రాంగణంలోని ఛైర్మెన్ ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది..

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.

ఆలయ కమిటీ.
మందమర్రి అభయాంజనేయ స్వామి దేవాలయం

ఆలయ ధర్మకర్త కొండా లక్ష్మణ్ స్వామి మృతి.

ఆలయ ధర్మకర్త కొండా లక్ష్మణ్ స్వామి మృతి.

#నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల కేంద్రానికి చెందిన సీతారామస్వామి దేవాలయం ధర్మకర్త గ్రామ అభివృద్ధి కమిటీ ముఖ్య సలహాదారుడు కొండా లక్ష్మణ్ స్వామి గుండెపోటుతో మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది ఆలయ ధర్మకర్త మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతుని స్వగృహానికి చేరుకొని లక్ష్మణ్ స్వామి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి ఆలయాలు లేని సందర్భంలో తన సొంత స్థలం ఇచ్చి గ్రామస్తుల సహకారంతో రామాలయాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తి లక్ష్మణ స్వామి. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరం అలాగే గ్రామానికి తీరని లోటు అని అన్నారు పరామర్శలో బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్., మాజీ సర్పంచ్ నాన్న బోయిన రాజారాం యాదవ్, వేల్పుల రవి, గుమ్మడి వేణు, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నాగేల్లి శ్రీనివాస్ తో పాటు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు నివాళులర్పించారు.

రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ.

*ప్రణీత్ ఫౌండేషన్ ఫౌండర్, ఎడిఫై స్కూల్ డైరెక్టర్ కు స్వాగతం పలికిన..

*రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ..

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 05:

తిరుపతి పట్నాలు
వీధిలో స్థానికంగా గల శ్రీ రేణుక పరమేశ్వరి అమ్మవారి వార్షిక మహోత్సవం -2025 మార్చి 14 నుండి మార్చి 16 వరకు జరగనున్నాయి .ఈ నేపద్యంలో ప్రణీత్ ఫౌండేషన్ ఫౌండర్,ఎడిఫై స్కూల్ డైరెక్టర్ ప్రణీత్ ను వార్షిక మహోత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొనవలసిందిగా బుధవారం ఆలయ కమిటీ సభ్యులు దిలీప్ అధ్యక్షతన ప్రణీత్ ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ప్రణీత్ మాట్లాడుతూ శ్రీ రేణుక పరమేశ్వరి వారి మహోత్సవాలలో పాల్గొనడానికి ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తన శక్తి మేర మహోత్సవాలలో జరిగే అన్నదానానికి ఆలయ అలంకరణకు కావాల్సిన నిధులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏడిఫై స్కూల్ సిబ్బంది ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆలయ చైర్మన్..

శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆలయ చైర్మన్
చిల్పూర్( జనగామ)నేటి ధాత్రి

చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం దిన దినాభివృద్ధి చెందుతూ భక్తుల కోరిన కోరికలను తీర్చుతూ విరాజిల్లుతున్న శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఈ నెలలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి.ఇందులో భాగంగా కళ్యాణ మహోత్సవానికి విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా
శ్రీ బుగ్గులు వెంకటేశ్వర దేవస్థాన కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు తోపాటు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగాచార్యులు మరియు
ఆలయ ధర్మకర్తల మండల సభ్యులు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు మాట్లాడుతూ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.దీనిలో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్లతో పాటు వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం ఇతర ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోరిన కోరికలు తీర్చే శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని చైర్మన్ శ్రీధర్ రావు కోరారు.

హనుమాన్ ఆలయ చైర్మన్ పరామర్శించిన రాము, రమేష్ యాదవ్..

హనుమాన్ ఆలయ చైర్మన్ పరామర్శించిన రాము, రమేష్ యాదవ్

నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ బెజ్జంకి వెంకటేశ్వర్లు తల్లి లక్ష్మీ అనారోగ్యంతో మృతిచెందగా నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము, కొమ్ము రమేష్ యాదవ్ లక్ష్మీ మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటేశ్వర్లుకు మారం రాము రమేష్ యాదవ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ ఈదునూరి యాకయ్య, నెక్కొండ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బిక్షపతి, నెక్కొండ మాజీ ఉపసర్పంచ్ వీర భద్రయ్య, బి ఆర్ ఎస్ నాయకులు వెంకన్న, శ్రీనివాస్, శ్రీనాథ్, బొడ్డుపల్లి రాజు, తదితరులు పాల్గొన్నారు.

శివాలయాన్ని సందర్శించిన మంత్రి సీతక్క..

మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని..

గుండం శివాలయాన్ని సందర్శించిన మంత్రి సీతక్క

కొత్తగూడ, నేటిధాత్రి :

అఖిలాండకోటి బ్రహ్మాండ లోకాల అధిపతి అయినటువంటి ఆ పరమశివుడి మహాశివరాత్రి పండుగ ను పురస్కరించుకొని కొత్తగూడ మండల లోని గుండంపల్లి గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన గుండం రామక్క గా పేరుగాంచిన గుండం శివాలయంలో శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు
ధనసరి సీతక్క ఆలయ నిర్వాహకులు అర్చకులు కాంగ్రెస్ పార్టీ కొత్తగూడ మండల నాయకులు సీతక్క రాకను డప్పు చప్పులతో మంగళ వాయిద్యాలతో అభిమాన నృత్యాలతో స్వాగతం చెబుతూ గుండం శివాలయంలోకి ఆహ్వానం తెలిపారు ముందుగా అర్చకులు మంత్రివర్యులు సీతక్క గారికి పూర్ణకుంభంతో స్వాగతం తెలిపారు గుండం శివాలయం లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివలింగం నీకి ప్రధాన అర్చకులు చే ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సీతక్క మాట్లాడుతూ..కాకతీయుల కళా సంపద భావ్య ప్రపంచానికి తెలియాల్సి ఉందని శివరాత్రి పండుగ సమీపిస్తున్నదని అభివృద్ధి పనుల కొరకు స్థానిక నాయకులు తనను కలిశారని తన సొంత నిధులతో తో 25 లక్షల రూపాయలను గుండం శివాలయానికి ఇచ్చినట్టు ఈ సందర్భంగా మంత్రిగారు అన్నారు రానున్న రోజుల్లో గుండంపల్లి నుంచి నల్లబెల్లి మెయిన్ రోడ్డు వరకు డబల్ రోడ్ చేసుకుందామని గుండం శివాలయాన్ని మరింత అభివృద్ధి చేసుకొని నిత్య పూజలు చేసుకొనుటకు ప్రత్యేక అర్చకుని నియమిస్తామని ఈ సందర్భంగా అన్నారు,..

ఘాట్ లను సందర్శన

గుండం శివాలయానికి వచ్చే భక్తులు గుండం చెరువులో స్నాననాలు ఆచరించి గుడిలోకి వెళ్తారు గత పాలకులు నిర్లక్ష్యంతో చెరువులో దిగడానికి ఇబ్బందికరంగా ఉండేది . స్థానిక నాయకులు మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లగా 25 లక్షల రూపాయలను అభివృద్ధి పనులకు మంజూరు చేశారు.. భక్తులు స్తనాలు చేయడం కోసం చెరువు కట్ట నుంచి చెరువులో దిగడానికి ఘాట్లు మెట్లు నిర్మించారు సీతక్క ఘాట్లను పరిశీలించి భక్తులను పలకరించారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల కమిటీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమాన సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో.!

కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో ఉన్న శివలింగానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయం లో ప్రత్యేక పూజలు.

శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన జహిరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ సాయి చరణ్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహిరాబాద్ పట్టణం: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా జహిరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ సాయి చరణ్ గారు పట్టణంలోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శివలింగానికి అభిషేకం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, పూజారులు స్వాగతం పలికి, తీర్థప్రసాదాలను అందించి సన్మానించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో , ఉపవాస దీక్షలు అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయని అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా శివరాత్రి పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆ మహా శివుని కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కండెం నర్సింహులు, ఎయంసి డైరెక్టర్ శేఖర్, రాజు, తదితర నాయకులు పాల్గొన్నారు.

శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు.

శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలో దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు శ్రీ కొనింటీ మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,మోగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,ఝరసంఘం మాజి ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ మాజి చైర్మన్ నర్సింహ గౌడ్,పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా,నాయకులు ప్రభు పటేల్ ,ప్రవీణ్ పాటిల్ ,విజయ్ రాథోడ్ శివశంకర్ ,తదితరులు పాల్గొన్నారు .

జోరుగా మద్యం దందా…

జోరుగా మద్యం దందా…

వాహనాలతో మద్యం తరలిస్తూ పెద్ద మొత్తంలో మద్యం విక్రయాలు…

బెల్ట్ షాపులని ప్రోత్సహిస్తున్న వైన్స్ యజమాన్యం.

అక్రమ మద్యం తరలింపు పై మౌనం పాటిస్తున్న అధికార యంత్రాంగం…

అనేక విమర్శలు వస్తున్న అధికారుల నిర్లక్ష్యం వెనక కారణం ఏమిటి.?

నూగూర్ వెంకటాపురం/నేటిధాత్రి

alcohol

(ఫిబ్రవరి26) వెంకటాపురం మండలంలో అక్రమ మద్యం దందా సాగుతున్న అధికారులు మౌనం వెనుక కారణం ఏమిటి.?వైన్ షాపుల తంతు చూస్తే ఆదాయం రెట్టింపు చేయడం కోసం వాహనాల ద్వారా మధ్యాన్ని తరలిస్తూ, ఎమ్మార్పీకి మించి వసూలుకు పాల్పడుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గుడి,బడి అని తేడా లేకుండా బెల్ షాపులు ఉండడంతో మద్యానికి బానిసలు అవుతున్నారు.దీంతో పేద కుటుంబాల మధ్య గొడవలు కలహాలు నిత్యకృతమవుతున్నాయి,చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మద్యానికి బానిసలు అవుతూ వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.బెల్స్ షాపుల్లో మద్యం విక్రయాలను తమ ఇష్టానుసారంగా కొనసాగిస్తూ,పేద కుటుంబాల వినాశనానికి కారణమైన బెల్ట్ షాపులను రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు.రెట్టింపు ఆదాయం కోసం బెల్ట్ షాపులను వైన్స్ యజమాన్యమే ప్రోత్సహిస్తుందని పలు విమర్శలు వెళ్లి వెతుకుతున్నాయి.వైన్ షాపుల్లో దొరకని బ్రాండ్లు బెల్ట్ షాపులకు తరలిస్తూ గ్రామీణ ప్రాంతంలో విక్రయాలు అధిక ధరలకు అమ్మకాలు జరుగుతున్నరు.
వాహనాలతో మద్యం తరలిస్తూ పెద్ద మొత్తంలో మద్యం విక్రయాలు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో సిండికేటుగా మారిన అక్రమ మద్యం వ్యాపారులు సాగిస్తున్నారు మండలంలో రెండు వైన్ షాపులు ఉన్నప్పటికీ ఒకటి మండల కేంద్రంలో రెండవది చోక్కాల గ్రామంలో ఉంది ఈ రెండు వైన్ షాపుల నుండి మద్యం రోజు ఉదయం 8 గంటల సమయంలో రెండు వాహనాల ద్వారా వెంకటాపురం మీదుగా పాత్రపురం,వీరభద్రారం,ఆలుబాక,సురవీడు,ఏదిరా,ఏకన్న గూడెం మీదుగా మద్యం తరలిస్తూ పెద్ద మొత్తంలో విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తోందితదితర గ్రామాలకు చట్ట విరుద్ధంగా వాహనాల ద్వారా అక్రమ రవాణా జరుపుతున్నారు. ఇది వైన్స్ యజమాన్యమే అధిక ధరలకు విక్రయించేందుకు చేస్తూ ఒక సీసా పై 20 నుండి 30 రూపాయలు వసూలు చేస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నారు.
బెల్ట్ షాపులని ప్రోత్సహిస్తున్న వైన్స్ యజమాన్యం

alcohol

సిండికేట్ గా మారి మద్యం వాహనాల ద్వారా రవాణా చేస్తూ ప్రతి బెల్ట్ షాపులకు డోర్ డెలివరీ చేస్తూ,వైన్స్ యజమాన్యమే గ్రామాల్లో గుడి బడి అని తేడా లేకుండా బెల్ట్ షాపుల నిర్వాహకులను వైన్ షాప్ యాజమాన్యమే ప్రోత్సహిస్తుందని పలు అనుమానాలు వెళ్ళుతున్నాయి.
అక్రమ మద్యం తరలింపు పై మౌనం పాటిస్తున్న అధికార యంత్రాంగం…
అక్రమ మద్యం రవాణాపై ఇంతవరకు సంధిత అధికారులు చర్యలు తీసుకుపోవడం పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రం నుండే ఈ తథంగం జరుగుతున్నప్పటికీ ఏ అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో, అక్రమ మద్యం రవాణా ఇంకా జోరందుకున్నదని చెప్పుకోవాలి.గతంలో అమ్మకాల కంటే ఈసారి నేరుగా గ్రామాల్లోకి మద్యం తరలిపోవడంతో అమ్మకాలు ఇంకా జోరు సాగుతుంది. ఇకనైనా కళ్ళు తెరిచి ఉన్నతాధికారులు సంబంధిత శాఖ అధికారులు అడ్డదిడ్డంగా వెలుస్తున్న వందలాది బెల్ట్ షాపులపై అలాగే అక్రమ రవాణా చేస్తున్న వైన్ యాజమాన్యంపై చర్యలు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
అనేక విమర్శలు వస్తున్న అధికారుల నిర్లక్ష్యం వెనక కారణం ఏమిటి.?
మద్యం వ్యాపారం అదుపు తప్పడంతో ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్న అధికారులను తాము చెప్పిందే చేయాలంటూ ఖద్దరు నేతల అడుగు జాడలో నడుస్తుందని తెలుస్తోంది. మండలంలో మద్యం దుకాణాలను దక్కించుకున్న వారిలో ఎక్కువ మంది రాజకీయ నాయకులే ఉన్నారు. కొంత మంది నేతలు గ్రూపులుగా ఏర్పడి తలోకొంత పెట్టుబడులు పెట్టి మద్యం దందాను నడుపుతున్నారు. నేతలు తమ రాజకీయ పలుకుబడితో అధికారులను తమ దారికి తెచ్చుకుంటున్నారు. కొన్ని విషయాలను చూసీ చూడనట్లుగానే వదిలేయాలంటూ అధికారులను సైతం తమ దారికి తెచ్చుకుంటున్నారని ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా మద్యం వ్యాపారం చేస్తున్న ఎక్సైజ్‌ శాఖ అధికారులకు ఇవన్నీ తెలిసిన మౌనం పాటిస్తారు తప్ప, చర్యలు ఏమాత్రం తీసుకోరని జోరుగా ప్రజల్లో ప్రచారం జరుగుతోంది.నెలవారీగా మాముళ్లను ముట్టజెప్పడంతో సైలెంట్‌ అయిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా క్షేత్ర స్థాయిలో అక్రమ మద్యం దందాపై ఉన్నతాధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

కేసీఆర్ పుట్టినరోజున ఆలయంలో ప్రత్యేక పూజలు

నేటిధాత్రి మొగుళ్లపల్లి:
జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో. గ్రామ కమిటీ అధ్యక్షుడు కత్తిరాజు ఆధ్వర్యంలో. ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బలుగూరు తిరుపతిరావు పాల్గొనగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, జన్మదిన సందర్బంగా. రంగాపురం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో కెసిఆర్ పేరున అర్చన అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ ఆయురారోగ్యంతో నిండు నూరేళ్లు ఉండాలని, మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి గా రావాలని ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది.వారి వెంట గ్రామ పార్టీ అధ్యక్షులు కత్తి రాజు మాజీ సర్పంచ్ సూరినినే రవీందర్ రావు, కత్తి రాజయ్య, నాయకులు లక్ష్మణ్ రావు, రాజేశ్వర్ రావు, సదయ్య, నరేష్, సునీల్, రమేష్, రవి, రాజు పాల్గొన్నారు.

20 లక్షల నిధులను మంజూరు….

గుండం శివాలయం కు 20 లక్షల రూ..నిధులను మంజూరు చేసిన రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క

కృతజ్ఞతలు తెలిపిన బిట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి

కొత్తగూడ,నేటిధాత్రి:

ములుగు అసెంబ్లీ, మహబూబాబాద్ జిల్లా
కొత్తగూడ మండలం లోని గుండం పల్లి లో శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయం గుండం జాతర ఈనెల 24 నుండి 30వ తేదీ వరకు జరుగు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా… భక్తులు సేధా తీర్చుట మరియు సౌకర్యాల కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క కి కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్ విన్నపాన్ని తెలియజేశారు వెంటనే సానుకూలంగా స్పందించి రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క గారు.
10 లక్షల రూ.. గల నూతన రేకుల షెడ్డు నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం మరియు 10 లక్షల రూ.. గల గుండం చెరువుకు స్నాన ఘట్టాలు మెట్లు భక్తుల వసతి కోసం మొత్తం 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ అనసూయ సీతక్క..
ఏజెన్సీ ప్రాంతంలో అటు పాకాల సరస్సు ఇటు గుండం సరస్సు పచ్చని ప్రకృతి నడుమ అందమైన కాకతీయులనాటి క్రీస్తుపూర్వం దేవాలయం శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయం ప్రతి మహాశివరాత్రి సందర్భంగా.. ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేస్తారు కళ్యాణ ఘట్టంలో భక్తులు చుట్టూ నలుమూలల కొత్తగూడ , పోగుళ్లపల్లి ఓటాయి రాంపూర్ ఎదులపల్లి, వేలుబెల్లి, కోనాపూర్ సాదిరెడ్డిపల్లి ఎంచగూడా, మండలంలోని అన్ని గ్రామాలతో పాటు… నర్సంపేట , ఖానాపూర్, చెన్నారావుపేట, నల్లబెల్లి, మల్లంపల్లి, ములుగు, దుగ్గొండి, వరంగల్, మండలాల నుండి భక్తులు పోటెత్తుతారు స్వామి వారి కళ్యాణ ఘట్టంలో భాగంగా… సంకీర్తనలు భజనలు శివనామ నామంతో ఓం నమశ్శివాయ అంటూ ఆలయం శివనామ స్మరణతో మార్మోగుతుంది భక్తుల సౌకర్యం కోసం ముందుగాk మన మంత్రిగారు 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క కి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు గుండం దేవాలయ కమిటీ సభ్యులు. మంత్రి ఆదేశాల మేరకుపండితులు భాను శాస్త్రి వేద మంత్రోచ్ఛారణ నడుమ వారి దివ్య కరకరములచే భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లా నారాయణరెడ్డి,
వజ్జ సారయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు,సుంకరబోయిన మొగిలి కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, వీరనేని వెంకటేశ్వరరావు జిల్లా నాయకులు,
భానోత్ విజయ రూప్సింగ్ మాజీ ఎంపీపీ & జిల్లా ప్రధాన కార్యదర్శి,
పులుసం పుష్పలత సరోజన మాజీ జెడ్పిటిసి,
బొల్లు రమేష్ నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్
ఇరుప రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి
గట్టి బాబు మాజీ సర్పంచ్, గట్టి రమేష్, గుల్లపల్లి శ్రీనివాస్, లక్కాకుల రాజు, వద్ది సోమయ్య, బిట్ల నరసయ్య తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version