తెలంగాణ గుండె బలం తన్నీరు హరీష్ అన్న పాట ఆవిష్కరణ.

” తెలంగాణ గుండె బలం తన్నీరు హరీష్ అన్న పాట ఆవిష్కరణ …

జహీరాబాద్ నేటి ధాత్రి:

మాజి మంత్రివర్యులు ,సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి పుట్టినరోజు శుభసందర్భంగా పాక్స్ చైర్మన్ స్రవంతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించినటువంటి తెలంగాణ గుండె తన్నీరు హరీష్ అన్న అనే పాటను సంగారెడ్డి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు , సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, మాజీ టి ఎన్ జి ఓ ఎస్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, & జిల్లా నాయకులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సంధర్బంగా ఎమ్మెల్యేలు మాణిక్ రావు గారు, చింతా ప్రభాకర్ మాట్లాడుతూ మాజి మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు జన హృదయ నేత నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే పని చేసే నాయకుడు అని, సంపూర్ణ ఆరోగ్యం తో ప్రజలకు తన సేవలను అందించాలని కోరుకుంటున్నాం అన్నారు.అనంతరం ఇట్టి కార్యక్రమానికి ముఖ్యలు పాక్స్ చైర్మన్ స్రవంతి అరవింద్ రెడ్డి గారిని మరియు వారి తనయుడు సాయి ప్రణీత్ రెడ్డి గార్లను అభినందించారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు నారాయణ ,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , సీనియర్ నాయకులు నామ రవికిరణ్, కలిమ్ , మ్యతరి ఆనంద్ , యువ నాయకులు మిథున్ రాజ్,దీపక్,సందీప్ , దినకర్, తదితరులు.

తెలంగాణ నూతన సమాచార కమీషనర్.

తెలంగాణ నూతన సమాచార కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గడ్డం నర్సయ్య

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

ఈరోజు ఇటీవల తెలంగాణ నూతన సమాచార కమీషనర్ గా నియమితులైన సీనియర్ జర్నలిస్టు పి.వి. శ్రీనివాస్ ని హైదరాబాద్ లోని వారి కార్యాలయములో టీ.పి.సి.సి మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య మర్యాదపూర్వకంగా కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రసాదం అందించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.

పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగం.

పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగం

ఉద్యమ పార్టీకి 25ఏళ్ళు పూర్తి.

తెలంగాణా ప్రజల గుండెల్లో కేసీఆర్

తెలంగాణలో భవిష్యత్ బిఆర్ఎస్ పార్టీదే

రజతోత్సవ సభ సంబురాలు అంబారాన్ని అంటాలి.

బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను విజయవంతం చేయండి.

నర్సంపేట నియోజకవర్గo నుండి 25000 మంది కార్యకర్తలు తరలి రావాలి

బిఆర్ఎస్ నాయకులతో కలసి రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆవిర్భవించిన టిఆర్ఎస్ ఉద్యమ పార్టీకి 25 యేండ్లు పూర్తి కానున్నదని తెలంగాణ ఉద్యమనేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సాధన అనంతరం కెసిఆర్ పాలన స్వర్ణయుగంగా ఉన్న తరుణంలో నేడు కాంగ్రెస్ పాలన రాక్షస పాలనగా మారిందని ఆరోపించారు. గత 15 నెలల కాంగ్రెస్ పాలన సాగుతున్న క్రమంలో ప్రజల గుండెల్లో నేటికీ కేసీఆరే ఉన్నారని తెలిపారు. రజతోత్సవ సభ సంబురాలు అంబారాన్ని అంటాలని పిలుపునిచ్చారు.తెలంగాణలో రాబోయే భవిష్యత్తు బిఆర్ఎస్ పార్టీదే అని తేల్చి చెప్పారు. ఈనెల 27న వరంగల్ జిల్లాలో చేపట్టబోయే భారత రాష్ట్ర సమితి రజితోత్సవాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజితోత్సవ సంబరాల గోడ పత్రికలను పెద్ది ఆవిష్కరించారు.ఈ సంధర్భంగా మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే సభలు నిర్వహించిన సత్తా బిఆర్ఎస్ పార్టీదే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పనితీరును గత కేసిఆర్ ప్రభుత్వ పనితీరు పట్ల గ్రామాల స్థాయి నుండి మండలాల వరకు ప్రజలతో చర్చ మొదలు పెట్టాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పట్ల విసుకు చెందుతున్న ప్రజలు కేసీఆర్ నాయకత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని గుర్తుకు చేసుకుంటున్నారని తెలిపారు. పార్టీ కోసం గత ఎన్నికల్లో కష్టపడ్డ వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించి మెజారిటీ స్థానాలను గెలిపించే బాధ్యత నాది అని పెద్ది హామీ ఇచ్చారు. రాజకీయంలో గెలిచినా ఓడిన ప్రజల మధ్యలో బతికేవాడే నిజమైన నాయకుడని అదే స్థాయిలో నిత్యం ప్రజల్లో ఉంటున్నానని గుర్తుకు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే కంటే నా హాయంలోనే అన్ని గ్రామాల్లో 10 రేట్ల పనులు ఎక్కువ పనిచేశామని అధికార పార్టీ వాళ్లు అంటున్నారని పేర్కొన్నారు. 27 న సభ విజయవంతం చేసే క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గం నుండి 25 వేల మంది కార్యకర్తలను తరలించి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్ద నర్సంపేట పౌరుషం చూపించాలని,రజతోత్సవ సభ సంబురాలు అంబారాన్ని అంటాలని ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఎండల తీవ్రత ఎక్కువగా ఉందడం వలన అధిక సంఖ్యలో పురుషులు హాజరవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటనారాయణ గౌడ్,అన్ని మండల పార్టీ అధ్యక్షులు, మాజీ సొసైటీ చైర్మన్ లు , మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు, నియోజకవర్గ నాయకులు, క్లస్టర్ బాధ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version