జిల్లాలో గ్యాస్, పెట్రోల్ డీజిల్ సమృద్ధిగా నిల్వలు…

జిల్లాలో గ్యాస్, పెట్రోల్ డీజిల్ సమృద్ధిగా నిల్వలు

గ్యాస్, పెట్రోల్, డీజిల్ పై పటిష్ట పర్యవేక్షణ

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లాలో గ్యాస్, పెట్రోల్ డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
తెలిపారు.
శనివారం ఐడిఓసి కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఎస్పి సంకీర్త్ తో కలిసి జిల్లా ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ పై పటిష్ట పర్యవేక్షణ కొనసాగాలని ఆదేశించారు. గృహ అవసరాలకు విమియోగించే సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు.
జిల్లాలో మొత్తం లక్షా 20 వేల మంది గ్యాస్ వినియోగిస్తున్నారని తెలిపారు. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, ఆసుపత్రులకు యధావిధిగా గ్యాస్ సరఫరా జరుగుతుందని, ఆయా శాఖల అధికారులు. పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ అత్యవసర సేవలకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలాల్లో డిటీలు, ఎస్ ఐ.లు పర్యవేక్షణ చేస్తున్నారని, వాహనాలు తనిఖీ చేసి కేసులు నమోదు చేయాలని ఆర్టిఓ కు సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల బుకింగ్ సైకిల్ అమలులో ఉందని, బుకింగ్ క్రమం ప్రకారమే సిలిండర్ సరఫరా జరుగుతోందని తెలిపారు. సిలిండర్ డెలివరీ సమయంలో ఓటిపి విధానం తప్పనిసరిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల అమాంతం బుకింగ్‌లు పెరగడం వల్ల డిమాండ్ అధికమవుతోందని గుర్తించిన కమిటీ, ప్రజలు అవసరానికి మించి బుకింగ్ చేయకుండా, నిల్వలు చేయకుండా ఉండాలని సూచించారు. పాఠశాలలు, హాస్టళ్లలో ఎల్పీజీ వినియోగంపై వెల్ఫేర్ అధికారి, డీఈఓ పర్యవేక్షణ చేయాలని, వార్డెన్లు, హెడ్‌మాస్టర్లు సరైన వినియోగం చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడైనా కొరత ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు.
జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్, అనధికార రీఫిల్లింగ్ సెంటర్లు, అక్రమ నిల్వలు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్యాస్, పెట్రోల్, డిజిల్ నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ, పోలీస్ శాఖతో కట్టుదిట్టమైన అమలు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగించడం, మళ్లింపు, నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి మొత్తం 19 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. హోటళ్లు, ధాబాలలో అక్రమంగా వినియోగిస్తున్న సిలిండర్లను స్వాధీనం చేసుకుని, సంబంధితులపై నిత్యావసర వస్తువులు చట్టం 1955 సెక్షన్ 6A కింద కేసులు నమోదు చేశామన్నారు.
కమిటీ కఠినంగా వ్యవహరించాలని నిరంతర తనిఖీలు, అప్రమత్తత ప ద్వారా అక్రమాలను పూర్తిగా అరికట్టాలని సూచించారు. అధికారులు పారదర్శక సరఫరా, సమర్థవంతమైన పర్యవేక్షణ, సమయానుకూల నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
ఎస్పి సంకీర్త్ మాట్లాడుతూ జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ డీలర్లు తో సమావేశం నిర్వహించామని తెలిపారు. ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మి ఆందోళన చెందొద్దని సూచించారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. అసత్య ప్రచారాలపై పర్యవేక్షణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి రద్దీ లేకుండా పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడోన్లు వద్ద పటిష్ట నిఘా.కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ డీఈఓ రాజేందర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, సంక్షేమ శాఖల అధికారులు, హెచ్పీసీఎల్ సేల్స్ ఆఫీసర్ అమర్త్యదాస్ తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి లో లారీ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన

లారీ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన సదస్సు

భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్త్

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరివి అలైవ్ క్యాంపెనింగ్
2026” కార్యక్రమంలో భాగంగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మీడియా అవుట్‌రీచ్ డే కార్యక్రమాన్ని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్, భూపాలపల్లి నందు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో నిర్వహించబడగా, లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, బొగ్గు లారీ డ్రైవర్లతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే అవుట్‌రీచ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,
మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, అందులో దాదాపు 50 వేల మంది సకాలంలో వైద్య సహాయం అందకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాల మేరకు జనవరి మాసం మొత్తం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సూచనలతో “ 2026” పేరిట ఈ కార్యక్రమాన్ని రూపొందించామని, ఇది 13 జనవరి 2026 నుండి 24 జనవరి 2026 వరకు నిర్వహించబడుతున్నదని తెలిపారు. మీడియా అవుట్‌రీచ్ డే కార్యక్రమంలో ముఖ్యంగా “రహవీర్ – గుడ్ సమరిటన్” పథకం గురించి వివరించారు.
రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించకపోవడం వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రమాద స్థలంలో ఉన్న పాదచారులు లేదా వాహనదారులు, పోలీసులు ప్రశ్నిస్తారు, కోర్టులకు పిలుస్తారు అనే భయంతో సహాయం చేయడం లేదని పేర్కొన్నారు.
ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్టం – సెక్షన్ 134(A) ద్వారా గుడ్ సమరిటన్‌లకు పూర్తి రక్షణ కల్పించిందని, ప్రమాద బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారి వివరాలను పోలీసులు అడగరాదని, కోర్టులకు హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
గోల్డెన్ అవర్‌లో స్వచ్ఛందంగా రోడ్డు ప్రమాద బాధితులను ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి “గుడ్ సమరిటన్” బిరుదుతో పాటు రూ.25,000 నగదు బహుమతి అందజేస్తారని తెలిపారు. ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో గరిష్టంగా ఐదు సార్లు ఈ బహుమతిని పొందవచ్చని అన్నారు. అలాగే రాష్ట్రస్థాయిలో ఎంపికైన గుడ్ సమరిటన్‌లలో నుంచి మూడు పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయగా, ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.1 లక్ష నగదు బహుమతి మరియు జాతీయ అవార్డు అందజేస్తుందని తెలిపారు.
అదేవిధంగా, జిల్లా ఎస్పీ లారీ, ఆటో, బొగ్గు లారీ డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడుతూ,
రోడ్డు ప్రమాదం ఒక్క డ్రైవర్‌కే కాకుండా ఆయనపై ఆధారపడి ఉన్న మొత్తం కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అన్నారు. ప్రమాదాల్లో గాయాలు లేదా మరణాలు సంభవిస్తే, కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు, ఉపాధి కోల్పోవడం, కుటుంబ పోషణలో సమస్యలు, పిల్లల చదువు దెబ్బతినడం, మానసిక వేదన వంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ రోడ్డు రవాణా జిల్లా అధికారి ఎండి సంధాని ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందు. సీఐ నరేష్ కుమార్ ఎస్సై సాంబమూర్తి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version