చెయ్యి గుర్తుకు ఓటు వేసి కౌన్సిలర్ గెలిపించండి….

చెయ్యి గుర్తుకు ఓటు వేసి కౌన్సిలర్ గెలిపించండి

కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సొత్కు రామ సమ్మయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

 

8వార్డు ప్రజలు ఆదరించి మున్సిపల్ కౌన్సిలర్గా చెయ్యి గుర్తుకు ఓటేవేసి గెలిపించండి పాలకుడిగా కాకుండా సేవకుడిగా పని చేస్తానని
కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి సొత్కు రామ సమ్మయ్య ఓటర్లను అభ్యర్థించారు. ప్రజల సమస్యలే ఎజెండాగా 8వార్డులోని అన్నికాలనీలను అన్ని రంగాల్లో ఎమ్మెల్యే సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ సహకారంతో నిధులు తీసుకువచ్చి కాలనీలను సుందరంగా తీర్చిదిద్ధి అభివృద్ధికి తోడ్పడుతానని తెలిపారు. జోహార్ నగర్ కాలనీల్లో మంచి నీరు అందేవిదంగా, డ్రైనేజి సమస్యలేకుండా, సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం, లేని వారికి రేషన్ కార్డుల అందించేవిధంగా, ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు, ఆలయాల అభివృద్ధికి, అర్హులందరికి ప్రభుత్వ సంక్షేమం అందేలా కృషి చేస్తానని తెలిపారు. కాలనీ ప్రజల కోరిక, సహకారం మేరకు అభివృద్ధే లక్ష్యంగా ఎలాంటి అవి. నీతి లేకుండా, నిజాయితీగా తోడ్పడుతానని తెలిపారు. చెయ్యి గుర్తకు ఓటేసి నాపై నమ్మకంతో ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండని ఓటర్లను అభ్యర్ధించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version