పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
కలెక్టర్ స్నేహ శబరీష్
శాయంపేట నేటిధాత్రి:
మూడో విడత గ్రామపంచా యతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం శాయంపేట మం డల కేంద్రంలోని జెడ్పిహె చ్ఎస్ బాలికల పాఠశాల ఆవర ణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీ లించారు పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా యా, పోలింగ్ ప్రక్రియ సజావు గా సాగుతుందా! లేదా! అని పరిశీలించింది. మండలంలోని ప్రజలు ప్రతి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకో వాలని సూచించింది.ఈ సందర్భంగా మండలంలో పోలింగ్ ప్రశాంతంగా నిష్పక్షపా తంగా కొనసాగుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఫణి చంద్ర, ఎమ్మా ర్వో, గ్రామపంచాయతీ సిబ్బం ది ప్రభుత్వ రంగంలో పనిచేసే అధికారులు పాల్గొన్నారు.
