గండి లచ్చపేట గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ….

గండి లచ్చపేట గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపట గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను. గండి లచ్చపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్.సర్పంచ్.జంగిటి అంజయ్య ఉపసర్పంచ్ పుట్ట భాను చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రజలకు వైద్యం చేయించుకోలోని పరిస్థితిలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా ఉండి అత్యవసరసమయంలో అత్యవసర చికిత్సకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. గ్రామంలోని .బల్లెపు .సత్తయ్య కు 11.వేల రూపాయలు. పడిగనరసవ్వకు 35. వేల రూపాయల చెక్కులనుఅందజేయడం జరిగిందని. తెలియజేస్తూ ఇట్టి ముఖ్యమంత్రి సహాయ నిధి రావడానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. సిరిసిల్ల నియోజకవర్గ కేకే మహేందర్ రెడ్డి కి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ కి. లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి పంపిణీ కార్యక్రమంలో. ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు బొండ్ల శ్రీశైలం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. గ్రామ ప్రజలు. తదితరులు పాల్గొన్నారు

సిరిసిల్ల చిన్న బోనాలకు బాకీ ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్…

సిరిసిల్ల చిన్న బోనాలకు బాకీ ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పదవ10వ వార్డ్ చిన్న బోనాల లోని గ్రామ దేవత శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి పది లక్షలు ఇస్తాను అని, స్వయంగా నాతో, మా ప్రజలకు చెప్పమని మాట ఇచ్చారు. ఆ మాటను నమ్మి, మా ప్రజలు మీకు అఖండ మద్దతూ ఇచ్చారు లాస్ట్ టైం ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లలో చిన్న బోనాలకు మాటిచ్చాడని ఇప్పటివరకు ఆ మాటను నిలబెట్టుకోలేకపోయాడని మాజీ కౌన్సిలర్ బోల్గం నాగరాజుగౌడ్ విన్నవించాడు. అంతేకాకుండా
ముందు సిరిసిల్లలో ఉన్న 82 బూతుల్లో, నేను బాధ్యత వహించిన 3 బూతుల్లో 80% కంటే ఎక్కువ ఓట్లు బీజేపీ కీ వేసి, మీకు అత్యధిక మెజార్టీ అందించాము. మీరు గెలవడానికి మా వార్డ్ ప్రజలు తమ వంతు బాధ్యతను నెరవేర్చారు.కానీ మీరు
గెలిచిన తర్వాత రెండుసంవత్సరాలు
గడిచిపోయినా, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే చిత్తశుద్ధి కూడా చూపలేదు.హిందూ ధర్మం, హిందూ దేవతల పరిరక్షణ పేరుతో రాజకీయాలు చేసే మీరుఅదే హిందూ దేవత ఆలయ నిర్మాణానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారని , అది మీ వైఫల్యం కాదు అది మీ రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనం.మాటలు చెప్పడం సులువు…మాట నిలబెట్టుకోవడం,నాయకత్వం.ప్రజల ఓట్లతో గెలిచి, ప్రజల విశ్వాసాన్ని మర్చిపోవడం ప్రజాస్వామ్యానికి అవమానం దేవాలయం పేరుతో ఓట్లు తీసుకుని, దేవాలయం నిర్మాణాన్ని మర్చిపోవడం విశ్వాస గాతకం.కాబట్టి, మీరు ఇచ్చిన హామీ ప్రకారం ₹10 లక్షలను వెంటనే మంజూరు చేసి, పోచమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి సహకరించాలి.అని మాజీ చిన్నబోనాల కౌన్సిలర్ నాగరాజు గౌడ్ తెలిపారు అంతేకాకుండా చిన్న బోనాల గ్రామ ప్రజలు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version