జన గణన లో సెల్ఫ్ ఎన్యుమరేషన్…

జన గణన లో సెల్ఫ్ ఎన్యుమరేషన్…

మీ ఫోన్ ద్వారా జన గణన లో మీ కుటుంబ వివరాల మీరే పొందుపరచుకోవచ్చు

మహబూబాబాద్/ నేటి ధాత్రి

ఫీల్డ్ ట్రైనర్ ప్రవీణ్ కుమార్ పెనుగొండ ఆధ్వర్యంలో ( రేవ) జిల్లా అధ్యక్షులు సంకా బద్రినారాయణ కి సెల్ఫ్ ఎనమరేషన్ చేయనైనది, ప్రతి ఒక్కరు ఈ సెన్సెస్ కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జన గణన కార్యక్రమం లో మొదట సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానాన్ని మొదట ప్రారంభించేందుకు ప్రక్రియ మొదలైందని విద్యావంతులు ఎవరైనా మొబైల్ ఫోన్ ద్వారా తమ కుటుంబ సభ్యుల వివరాలు మరియు నివాసాల వివరాలు పొందుపరచవచ్చని ఈ విధానం వల్ల జన గణన సులభంగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయవచ్చని ఫీల్డ్ ట్రైనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో ఎన్యుమరేటర్ గా బాధ్యతలు చేపట్టి ప్రతి ఇంటింటికి తిరుగుతూ కుటుంబ సభ్యుల వివరాలు నివాసాల వివరాలు సేకరించి జనగణన చేస్తారని అన్నారు. ఈనెల 26న ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమం ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ముగిసిందని, ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విద్యావంతులు ఎవరికి వారు వారి కుటుంబాలను నివాస వివరాలను వారే పొందుపరచుకోవచ్చని ఈ విధానాన్ని అందరూ పాటించాలని సూచించారు. ఎన్యుమరేటర్ గా విధులు నిర్వహించే ప్రభుత్వ ఉపాధ్యాయులు మే 11 తేదీన ప్రతి ఇంటికి జన గణన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

జనగణనలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రారంభం

మహబూబాబాద్: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణన కార్యక్రమంలో భాగంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఫీల్డ్ ట్రైనర్ ప్రవీణ్ కుమార్ పెనుగొండ తెలిపారు.

జిల్లా అధ్యక్షులు సంకా బద్రినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విద్యావంతులు తమ మొబైల్ ఫోన్ ద్వారా తమ కుటుంబ సభ్యుల వివరాలు, నివాస వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించబడిందని చెప్పారు. ఈ విధానం ద్వారా జనగణన ప్రక్రియను సులభతరం చేసి వేగంగా పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్యుమరేటర్లుగా పనిచేస్తూ ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి జనగణన నిర్వహిస్తారని తెలిపారు. ఈ నెల 26న ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం పూర్తయ్యిందని, మే 11 నుంచి ఇంటింటికి జనగణన కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు.

ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని, అవసరమైతే తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని సూచించారు.

స్వీయ గణన నమోదు చేసుకున్న ఎమ్మెల్యే జి ఎస్ ఆర్…

స్వీయ గణన నమోదు చేసుకున్న ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

క్యాంపు కార్యాలయంలో ఆన్‌లైన్ ద్వారా జనగణనను స్వీయ నమోదు చేసుకున్న భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు.
ఈ నెల 26న జిల్లా వ్యాప్తంగా జనగణన స్వీయ గణన డిజిటల్ నమోదు కార్యక్రమం ప్రారంభమైన సందర్భంగా మంగళవారం శాసన సభ్యులు క్యాంపు కార్యాలయంలో స్వీయ గణన ప్రక్రియను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు స్వీయ గనణలో తమ వివరాలు నమోదు చేసుకోవడం వల్ల సమయం ఆదా అవుతుందని అన్నారు. సెల్ఫ్ ఎన్యూమ రేషన్ కొరకు https://se.census.gov.in లింక్ ఓపెన్ చేసి మొబైల్ నంబర్ నమోదు చేయాలని, ఓటిపి నమోదు చేసి జిల్లా, పట్టణం, గ్రామం, పిన్ కోడ్ నమోదు చేయాలని తెలిపారు. ఆన్లైన్ ద్వారా స్వీయ గనణలో ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. జిళ్లలో మే 10వ తేదీ వరకు స్వీయ గణన జరుగుతుందని తదుపరి మే 11వ తేదీ నుండి ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని, ఎన్యూమ రేటర్లుకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన సమయంలో వచ్చిన ఐడి నంబర్‌ తెలియచేయాలని సూచించారు. సెల్ఫ్ ఎన్యూమ రేషన్ చేసిన ప్రతి ఒక్కరూ ఐడి నంబర్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని తెలిపారు.
జిల్లా ప్రజలు అందరూ జనగణన కార్యక్రమంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో సీపీఓ జవహర్, డిప్యూటీ ఎస్ఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version