ప్రభుత్వ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది మాజీ సర్పంచ్ బత్తిని శ్రీహరి గౌడ్

ప్రభుత్వ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది మాజీ సర్పంచ్ బత్తిని శ్రీహరి గౌడ్

మొగుళ్లపల్లి నేటి దాత్రి

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగుల తలపెట్టిన సమ్మెలో విషాదం నెలకొందని మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ బత్తిని శ్రీహరి గౌడ్ తెలిపారు వారు విలేకరుల సమావేశంలోమాట్లాడుతూ వరంగల్(D) నర్సంపేటలో గురువారం మధ్యాహ్నం ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు వేచించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ చనిపోయారు డ్రైవర్ పట్ల మాజీ సర్పంచ్ బత్తిని శ్రీహరి గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తిగతం చేశారు శంకర్ గౌడ్ ముమ్మాటికి ఆత్మహత్య కాదని ప్రభుత్వ మొండి వైఖరి వల్ల జరిగిన ఘటనగా తెలిపారు కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి విషాదాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ఈ సమయంలో మనోధైర్యం కలగాలని కోరుకున్నారు ఆర్టీసీ కార్మికులు ఎవరు ఆందోళన చెడ్డవద్దని క్షణక ఆవేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మిక సంఘాలను చర్చలకు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు మృతుడి కుటుంబానికి ఐదు కోట్లు ఆర్థిక సాయం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు
– శంకర్ గౌడ్‌కు ఘన నివాళులు
– బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి

సిరిసిల్ల ప్రతినిధి(నేటి ధాత్రి):

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బిఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు.ఈ నేపథ్యంలో నర్సాపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, అనంతరం మరణించడంతో కార్మికుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతిపై చింతిస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు ఆర్టీసీ కార్మికులు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, నాయకులు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవేనని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు బిఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, బిఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు, ఇతర బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు మరియు కార్మికులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version