ప్రతీ ఉద్యోగి ఉద్యోగ విరమణ తప్పనిసరి…

ప్రతీ ఉద్యోగి ఉద్యోగ విరమణ తప్పనిసరి…

డివైసీఎంఓ డాక్టర్ ప్రసన్నకుమార్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ప్రతి ఉద్యోగి తన జీవితంలో ఉద్యోగ విరమణ తప్పనిసరి అని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ ప్రసన్నకుమార్ అన్నారు. గురువారం సింగరేణి ఏరియా ఆసుపత్రిలో డివైసిఎంఓ గా విధులు నిర్వహించే డాక్టర్ జక్కుల ప్రభాకర్, స్వీపర్ గా విధులు నిర్వహించే గూడెపు పూలమ్మ లు ఉద్యోగ విరమణ పొందారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సన్మాన సభ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా డివైసిఎంఓ డాక్టర్ ప్రసన్నకుమార్ మాట్లాడారు. డాక్టర్ ప్రభాకర్ ఉద్యోగరీత్యా 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని ఉద్యోగ విరమణ పొందుతున్నారని, వారు వారి కుటుంబంతో శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను అన్నారు. స్వీపర్గా విధులు నిర్వహించే గూడెం పూలమ్మ 34 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నారని ఉద్యోగ విరమణ అనంతరం వారి జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీకాంత్, సంక్షేమ అధికారి ఎండి మాధార్ సాహెబ్, సూపరిండెంట్ కృష్ణమూర్తి , మ్యాట్రిన్ విజయలక్ష్మి, ఏఐటియుసి ఫిక్స్ సెక్రటరీ నాగేంద్ర భట్టు, వార్డ్ బాయ్స్, నర్సులు, ఉద్యోగులు, డాక్టర్లు పాల్గొన్నారు.

ఉద్యోగికి పదవీ విరమణ తప్పదు..

https://youtu.be/MeA4Sc-IO2k?si=TOtS
ఉద్యోగికి పదవీ విరమణ తప్పదు

మరిపెడ మండల విద్యాశాఖ అధికారిని శ్రీమతి అనిత దేవి.

మరిపెడ నేటిధాత్రి.

మరిపెడ మండలంలోని రాంపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు గువ్వాడి లక్ష్మయ్య అభినందన ఆత్మీయ వీడ్కోలు సభ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రం వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిఆర్టీయూ మరిపెడ మండల విద్యాశాఖ అధికారిని అనితా దేవి మాట్లాడుతు లక్ష్మయ్య మంచి సమయపాలన పాటించి నిబద్ధతతో,క్రమ శిక్షణతో పాఠశాల విద్యార్థులకు పాఠాలు బోధించడం జరిగిందని అన్నారు.ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పదవి విరమణ తప్పదని అన్నారు.వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. పదవీ విరమణ పొందిన లక్ష్మయ్య ను పాఠశాల పక్షాన ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు జయ, స్టేషన్ ఘన్పూర్ మండలం విద్యాశాఖ అధికారి జి కొమురయ్య, జనగాం జిల్లా సీఎమ్ఓ నాగరాజు,పిఆర్టీయూ మరిపెడ అధ్యక్షులు కేసరి రమేష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు లింగాల మహేష్ గౌడ్,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గండి కరుణాకర్ పాఠశాల ఉపాధ్యాయులు రాజేశ్వరి, గణేష్,శ్రీధర్,సంపత్,వెంకట్ రెడ్డి,సంతోషి,సిఆర్పి దోమల సత్య శ్రీనివాస్,లక్ష్మయ్య బంధుమిత్రులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version