ఉద్యోగికి పదవీ విరమణ తప్పదు..

https://youtu.be/MeA4Sc-IO2k?si=TOtS
ఉద్యోగికి పదవీ విరమణ తప్పదు

మరిపెడ మండల విద్యాశాఖ అధికారిని శ్రీమతి అనిత దేవి.

మరిపెడ నేటిధాత్రి.

మరిపెడ మండలంలోని రాంపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు గువ్వాడి లక్ష్మయ్య అభినందన ఆత్మీయ వీడ్కోలు సభ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రం వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిఆర్టీయూ మరిపెడ మండల విద్యాశాఖ అధికారిని అనితా దేవి మాట్లాడుతు లక్ష్మయ్య మంచి సమయపాలన పాటించి నిబద్ధతతో,క్రమ శిక్షణతో పాఠశాల విద్యార్థులకు పాఠాలు బోధించడం జరిగిందని అన్నారు.ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పదవి విరమణ తప్పదని అన్నారు.వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. పదవీ విరమణ పొందిన లక్ష్మయ్య ను పాఠశాల పక్షాన ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు జయ, స్టేషన్ ఘన్పూర్ మండలం విద్యాశాఖ అధికారి జి కొమురయ్య, జనగాం జిల్లా సీఎమ్ఓ నాగరాజు,పిఆర్టీయూ మరిపెడ అధ్యక్షులు కేసరి రమేష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు లింగాల మహేష్ గౌడ్,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గండి కరుణాకర్ పాఠశాల ఉపాధ్యాయులు రాజేశ్వరి, గణేష్,శ్రీధర్,సంపత్,వెంకట్ రెడ్డి,సంతోషి,సిఆర్పి దోమల సత్య శ్రీనివాస్,లక్ష్మయ్య బంధుమిత్రులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరం .

ఉచిత వైద్య శిబిరం ను సద్వినియోగం చేసుకోవాలి

మరిపెడ నేటిధాత్రి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో మూల మర్రి తండ గ్రామపంచాయతీ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరం లో మొత్తం 60మంది పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగింది.డాక్టర్ రవి మాట్లాడుతూ వర్ష కాలంలో దోమల ద్వారా వ్యాపించే, వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్య, మెదడు వాపు, బోధకాలు రాకుండా తీసుకోవలసిన జాగ్రత గురించి తండ వాసులకు వివరించారు. ఈ కార్యక్రమం లో తానంచెర్ల పల్లె దవాఖాన మిడ్ లెవెల్ హెల్త్ ప్రోవిడర్ ఝాన్సీ, హెల్త్ సూపెర్వైసోర్ కృష్ణ,లక్ష్మి కుమారి,హెల్త్ అసిస్టెంట్ వీరయ్య, ఏఎన్ఎం రోజమణి, ఆశాలు విజయ, అనిత తదితరులు పాల్గొన్నారు.

అ”పూర్వ” విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

అ”పూర్వ” విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మరిపెడ నేటిధాత్రి : 

 

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని ప్రజ్ఞ ఉన్నత పాఠశాలలో 1998 -99 విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యాభ్యసించిన పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం ప్రజ్ఞ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు 26 సంవత్సరాల కాలం తర్వాత కలవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పాఠశాల లో పూర్వ విద్యార్దినీ, విద్యార్థులు మాట్లాడుతూ గతంలో విద్యాబోధన చేసిన పూర్వ ఉపాధ్యాయులను గుర్తు చేసుకోని వాళ్ళు నేర్పినటువంటి విద్యా బుద్ధులను ఎన్నటికీ మరువలేమని వారి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయని కొనియాడారు,గత స్మృతులను గుర్తుతెచ్చుకుంటూ తమ గురువుల సేవలను త్యాగాలను ఎన్నడూ మరవలేమని తమ జీవితంలో వారు అందించిన విద్య బుద్ధులను స్ఫూర్తి గా తీసుకోవడం వలన జీవితంలో ఎంతగానో ఉపయోగపడిందని కొనియాడారు,అనంతరం పూర్వ విద్యార్థులు కలిసి చదువుకున్న స్నేహితురాలు గుండెపుడి గ్రామవాసి చంద్రకళ అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో వారికి శాంతి కలగాలని రెండు నిమిషాల మౌనం పాటించడం జరిగింది ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు 30 మంది కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమన్ని విద్యాబుద్ధులు నేర్పిన గురువులతో కలిసి ఎంతో ఘనంగా జరుపుకున్నారు, ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు మల్లు ఉపేందర్ రెడ్డి,రమా మేడం, రామచంద్రయ్య,రేపాల యాదయ్య,కుడితి ఉపేందర్ రెడ్డి,నాగార్జున, సరస్వతి మేడం,జానకి రాములు, పూర్వ విద్యార్థులు, ఆర్గనైజేషన్ టీం బూర్లే శివప్రసాద్,రాంపల్లి సురేష్ బాబు,ముదిరెడ్డి అనిత, కళ్యాణి,మంజుల,సంతోష్ అయ్యగారు,బుద్ధ శ్రీకాంత్, గుగులోత్ వీరన్న,మిగితా స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version