వంద శాతం పన్నులు వసూళ్ళు చేయాలి.

One hundred percent taxes

వంద శాతం పన్నులు వసూళ్ళు చేయాలి.
డివిజనల్ పంచాయతీ అధికారి రాజీవ్ కుమార్.

నర్సంపేట,నేటిధాత్రి:

గ్రామాల్లోని అన్ని రకాల పన్నులను ఈ నెల పదిలోపు వంద శాతం వసూళ్లు చేయాలని డివిజనల్ పంచాయతీ అధికారి రాజీవ్ కుమార్ ఆదేశించారు.
దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామపంచాయతీ కార్యాలయంలో మండలం పరిదిలో గల పంచాయతీ కార్యదర్శులతో డివిజనల్ పంచాయతీ అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు.మండల పంచాయతీ అధికారి శ్రీధర్ గౌడ్ అధ్యక్షతన జరుగగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఇంటి పన్నులు,నల్లా పన్నులు వసూల్ చేయాలని అన్నారు. డంపింగ్ యార్డ్ లలో వర్మికాంపోస్ట్ ప్రిపరేషన్ ప్రాపర్ గా చేయాలని పేర్కొన్నారు.ఎండాకాలంలో గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!