రాచన్న స్వామి ఆలయంలో సీనీయర్ సివిల్ జడ్జి ప్రత్యేక పూజలు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం బడంపేటరాచన్న స్వామి ఆలయంలో జహీరాబాద్ సినియర్ సివిల్ జడ్జి కవిత దేవి శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మ వారికి కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వేదాశీర్వాదం చేయడం జరిగింది.