కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ.

కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ

బాలానగర్ /నేటి ధాత్రి:

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరతపై ఆరా తీశారు. సిబ్బంది సమయపాలన పాటించి ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించి రోగులకు ఉచిత వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యురాలు నేహా ఫరీద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

రాచన్న స్వామి జాతరకు సర్వం సిద్ధం..

రాచన్న స్వామి జాతరకు సర్వం సిద్ధం

జహీరాబాద్:నేటి ధాత్రి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలో కొనసాగుతున్న బడంపేట రాచన్న స్వామి 3 రోజుల జాతర కోసం సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి విభూతి శివ రుద్రప్ప మంగళవారం ఉదయం తెలిపారు. మార్చి 4, 5, 6 మూడు రోజుల పాటు రాచన్న స్వామి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు, ఇఓ శివరుద్రప్ప వివరించారు.

గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర…

జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాల ఏర్పాటు…

భక్తులు ప్రశాంత వాతావరణంలో మొక్కులు తీర్చుకోవాలి…

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

డప్పు చప్పుళ్ళు, గిరిజన సంప్రదాయాల మధ్య శుక్రవారం గాంధారి మైసమ్మ జాతర ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న జాతరకు తెలంగాణాతో పాటు మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ తదితర ప్రాంతాల నుంచి ఆదివాసీ, నాయక్‌ పోడులు,గిరిజనులు, తరలివస్తున్నారు. బొక్కల గుట్ట గాంధారి ఆలయం నుంచి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న సదర్ల భీమ న్న విగ్రహాల వద్ద పూజా కార్యక్రమాలను చేపట్టారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సదర్ల భీమన్న విగ్రహాల వద్దకు చేరుకొని తప్పెటగుళ్లను ఎత్తుకుని దేవతామూర్తులను గోదావరి నదికి సాగనంపారు. గిరిజన సంప్రదాయబద్దంగా సదర్ల భీమన్న విగ్రహాల వద్ద పట్నాలు నిర్వహించారు. అనంతరం తప్పెటగుల్ల, పిల్లనగ్రోవుల ఆటాపాటలతో ఆది వాసీలు గోదావరి నదికి తరలి వెళ్ళారు. తిరిగి నది జలాలతో ఖిల్లాకు చేరుకున్నారు. జాతర జరిగే ఖిల్లా ప్రాంతానికి కలెక్టర్ కుమార్ దీపక్ చేరుకొని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. జాతర సజావుగా జరిగేలా అధికారులు, నాయకులు సమన్వయంతో పని చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. జాతరకు వచ్చే భక్తులు సైతం భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకోవాలని అధికారులకు సహకరించాలని కోరారు.జాతర ప్రాంగణంలో మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి నేతృత్వంలో రామకృష్ణాపూర్‌ ఎస్సై రాజశేఖర్ భారీ బందోబస్తు చేప ట్టారు. క్యాతన్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్ గద్దె రాజు ఆధ్వర్యంలో జాతర ఏర్పా ట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గిరిజన, ఆది వాసీ నాయక్‌పోడుల ఆరాధ్య దైవమైన మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటే పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో అమ్మవారు రక్షిస్తారని గిరిజ నుల నమ్మకం. ఆదివాసీ నాయక్‌పోడ్‌ సేవా సంఘం ఆధ్వర్యంలో జాతరకు తరలి వచ్చే భక్తులకు సేవా కార్యక్ర మాలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. జాతర కార్యక్రమంలో మందమర్రి ఎమ్మార్వో సతీష్, ఆదివాసి నాయకపోడ్ సంఘం జిల్లా అధ్యక్షులు పెద్ది భార్గవ్, ప్రధాన కార్యదర్శి డి లక్ష్మణ్, గౌరవ అధ్యక్షులు ఎల్ రాజ్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ రోడ్డ రమేష్ ,రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి రాజన్న, ఆదివాసి హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు గంజి రాజన్న, ఆదివాసి నాయకపోడ్ పెద్దలు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

జతర ఏర్పాట్లను పరిశీలించిన ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజ్..

 

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి..

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..

వనదేవతల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజ్ అన్నారు. సోమవారం జతర ఏర్పాట్లను పరిశీలించి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆలయ కమిటీ సమన్వయంతో అన్ని శాఖల అధికారులు జాతర ఏర్పాట్లు పూర్తి చేశారని ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఐటీడీఏ పీవో ఆదేశాలతో ఏర్పాట్లు అనుకున్న స్థాయిలో పూర్తయ్యాయని ఆయన తెలిపారు. మూడు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, త్రాగునీరు, పారిశుద్ధ్యం విద్యుత్ లైన్లో ఏర్పాటుచేసి ఆలయాన్ని విద్యుత్ కాంతులతో నింపామని ఆయన తెలిపారు. ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం, ఆర్డబ్ల్యూఎస్ విభాగం, ఎంపీడీవో కార్యాలయం, పోలీస్ శాఖ, వైద్యశాఖ, ఆలయ కమిటీ, సమన్వయంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కోరారు. సమస్యలు ఉంటే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని పిఓ గారితో చర్చించి సమస్యల త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. గుడికి బోర్వెల్, కాంపౌండ్ వాల్, స్నానాల ఘట్టాలు, త్రాగునీరు, షెడ్లు, సత్తర్ నిర్మించాలని మాజీ శాసనసభ్యులు మాజీ జడ్పీ చైర్మన్ చందా లింగయ్య కోరారు, ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన జాతరకు ఈ సంవత్సరం ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తాత్కాలిక ఏర్పాట్లు పూర్తయ్యాయని, గుడికి సంబంధించిన శాశ్వత పనులు గురించి, చందా లింగయ్య తెలిపిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన తెలిపారు.అధికారులందరూ జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దేవ వర కుమార్, తహసిల్దార్ నాగప్రసాద్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజేందర్, ఐ టి డి ఎ డి ఈ మధుకర్, ఏఈ యోగేశ్వరావు, జూనియర్ అసిస్టెంట్లు వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ తిరుమలేష్, డి ఈ బ్రహ్మదేవ్, ఏఈ విజయ్ కృష్ణ, కార్యదర్శులు, రామకృష్ణ, రవి, మారుతి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version