ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గం.

ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గం

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ నాగయ్య.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ.నాగయ్య అన్నారు.
సిపిఎం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు రెండో రోజు పట్టణంలోని గ్రీన్ రిసార్ట్ లో సిపిఎం జిల్లా కార్యదర్శి సీ హెచ్ రంగయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ నాగయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పోరాటాలే మార్గం అని అన్నారు. కేంద్రం లోని మోడీ నాయకత్వం లోని బిజెపి ప్రభుత్వం ప్రజల మధ్య కులాలు మతాల మధ్య చీలిక తీసుకువచ్చి విద్వేషాలు రెచ్చగొట్టి పాలన సాగిస్తున్నదని, దేశంలో ప్రజల ప్రజాస్వామిక హక్కులు కాలరాసి నియంతృత్వ పాలన తీసుక రావడానికి బిజెపి నాయకత్వం లోని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలను సాగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం లో అధికారం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయడంలో కాలయాపన చేస్తుందని , ప్రధానంగా రైతు రుణమాఫీ, రాజీవ్ యువ వికాసం, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అమలు చేయడం లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.బిజెపి దేశంలో మూడవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదం విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మనిషి ఏం తినాలో, ఏ బట్టలు వేసుకోవాలో బిజెపి నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వారు అన్నారు. హిందువులు పేరుతో మత రాజకీయాలు చేస్తూ హిందువులపై అదనపు ఆర్థిక భారాలు మోపడం ఏమిటి అని ప్రశ్నించారు. ప్రతి ఎన్నికల సమయంలో భావోద్వేగాలను రెచ్చగొట్టే పనిలో బిజెపి నేతలు వున్నారని విమర్శించారు. నూతన ఆర్థిక విధానాలతో దేశంలో సంక్షోభం ఏర్పడింది అని, మరోవైపు ప్రజలు ఉద్యమాల్లోకీ రాకుండా మతాన్ని ముందుకు తెచ్చి దేశ ప్రజలతో బిజెపి నేతలు ఆటలు ఆడుతున్నారని వారు ధ్వజమెత్తారు. హామీల అమలుకు ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో పార్టి జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెళ్లి బాబు, నలిగంటి రత్నమాల సింగారపు బాబు,భూక్య సమ్మయ్య, కోరబోయిన కుమారస్వామి, నమిండ్ల స్వామి ముంజాల సాయిలు ఆరూరి కుమార్, హన్మకొండ శ్రీధర్, బోళ్ల సాంబయ్య, ఎండి బషీర్, వి దుర్గయ్య, యారా ప్రశాంత్, పట్టణ కమిటీ సభ్యులు మండల, ఏరియా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలు ప్రజా ప్రతినిధులు పరిష్కరించాలి.

ప్రజా సమస్యలు ప్రజా ప్రతినిధులు పరిష్కరించాలి

లేనిచో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి అభ్యర్థులను పోటీ చేయిస్తాం

వనపర్తి బి సి ల జన బేరి బహిరంగ సభలో రాచాల యుగేందర్ గౌడ్
వనపర్తి నేటిధాత్రి:

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అన్యాయం జరిగిందని జిల్ల లో అవినీతిపై బీసీల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని బీసీ పొలిటికల్ జే ఏ సీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ వనపర్తి లో రాజావారి పాలిటెక్నిక్ కళాశాల మైదానం బి సి జన బేరి బహిరంగ సభలో బీ సీ లను ఉద్దేశించి ప్రసంగించారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రజల సమస్యలు పట్టించుకోకుంటే అధికారపార్టీపై బీసీల మద్దతుతో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల లో మున్సిపాలిటీ జెడ్పిటిసి సర్పంచ్ ఎన్నికలలో బీ సీ ల అభ్యర్థులను పోటీ చేయిస్తామని రాచాల పేర్కొన్నారు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బీసీలు భారీ ఎత్తున పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేసినందుకు రాచాల కృతజ్ఞతలు తెలిపారు

ప్రజావాణి అర్జీలు పెండింగ్లో పెట్టవద్దు.

ప్రజావాణి అర్జీలు పెండింగ్లో పెట్టవద్దు

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్( నేటి ధాత్రి ):

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో వచ్చే అర్జీలు పెండింగ్లో పెట్టవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.మొత్తం 182 దరఖాస్తులు వచ్చాయి.రెవెన్యూ శాఖకు 75, హౌసింగ్ శాఖకు 36, ఎస్డీసీకి 12, డీఆర్డీఓ, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్కు తొమ్మిది చొప్పున, ఎస్పీ కార్యాలయానికి 6, జిల్లా ఉపాధి కల్పన అధికారి, నీటి పారుదల శాఖ కు 5 చొప్పున, జిల్లా సంక్షేమ అధికారికి 4, వ్యవసాయ శాఖ,  జిల్లా విద్యాశాఖ అధికారి, ఏడీ టెక్స్టైల్స్, సబ్ రిజిస్టర్, ఏడీ ఎస్ఎల్ఏ కు రెండు చొప్పున తదితర శాఖలకు దరఖాస్తులు వచ్చాయి. అలాగే వైద్యానికిి రూ. రెండు లక్షల ఆర్థిక సహాయం అందించిన కలెక్టర్ ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన బొల్లె శ్రీనివాస్ పక్షవాతంతో ఇబ్బంది పడుతున్నాడు. సాయం అందించాలని శ్రీనివాస్ భార్య శంకరవ్వ కలెక్టర్ కు విన్నవించారు. దీంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందించి, శ్రీనివాస్ వైద్యానికి రూ. రెండు లక్షల చెక్కును అందజేశారు. వైద్యానికి సహాయం అందించిన కలెక్టర్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

నిర్బంధాలు ఎందుకు ఇదేనా ప్రజాపాలన.

నిర్బంధాలు ఎందుకు ఇదేనా ప్రజాపాలన హరీశ్ రావు హాట్ కామెంట్స్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సీఎం రేవంత్ రెడ్డి జహీరాబాద్ పర్యటన సదర్భంగా రైతులతో పాటు, బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడంపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘x’ (ట్విట్టర్) వేదిక ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జహీరాబాద్ పర్యటన సందర్భంగా రైతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సీఎం పర్యటన ఉన్న ప్రతిసారి ఇలా ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు. ఇదేనా ప్రజాపాలన అంటూ ఫైర్ అయ్యారు. మొన్న నాగర్‌కర్నూల్‌ పర్యటనలో చెంచు సోదరులను ఇలానే అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.నేడు జహీరాబాద్‌లో రైతులను, రైతు నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని కామెంట్ చేశారు. జహీరాబాద్ నిమ్స్ చుట్టూ ఉన్న గ్రామాలను అష్ట దిగ్బంధనం చేసి, రైతు నాయకులను నిర్బంధించడం అది ఎలా ప్రజాపాలన అవుతుందని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను పీడించే పాలన అంటూ ఆక్షేపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికీ తన ఆవేదనను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉందని అన్నారు. ఆ హక్కును హరించడం దుర్మార్గమని.. నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు, అరెస్టులు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జరిగే పరిస్థితులు లేవని తెలిపారు. అక్రమంగా అరెస్టు చేసిన రైతులను, రైతు నాయకులను వెంటనే విడుదల చేయాలంటూ హరీశ్ రావు, డీజీపీ తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

చైతన్యం ద్వారానే అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ .

ప్రజల్లో చైతన్యం ద్వారానే అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ

అటవీ అభివృద్ధి సంస్థ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ప్రజల్లో చైతన్యం,అవగాహన ద్వారానే అడవులు, ప్లాంటేషన్లలో అగ్ని ప్రమాదాల నివారణ పూర్తిగా సాధ్యమవుతుందని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీ ఎఫ్ డీసీ) మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ అన్నారు.అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం జైపూర్ మండలంలోని ముదిగుంట శివారులో ఉన్న నీలగిరి ప్లాంటేషన్ లో అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వేసవిలో ప్లాంటేషన్ లలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించినప్పుడు మంటలు ఎలా ఆర్పాలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

Forest fires

సంస్థ పరంగా బ్లోయర్ లతో మంటలు ఎలా నియంత్రిస్తారో వివరించడం జరిగింది. ప్లాంటేషన్లు,అటవీ ప్రాంతాల మీదుగా వెళ్లేవారు బీడీలు సిగరెట్లు తాగి నిర్లక్ష్యంగా పడేయవద్దని చెప్పారు. అడవులు,ప్లాంటేషన్లు కాలడం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందన్నారు.వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ తో పాటు కాగజ్ నగర్,బెల్లంపల్లి రేంజ్ ల ప్లాంటేషన్ మేనేజర్లు లక్ష్మణ్, సునీత,ఫీల్డ్ సూపర్వైజర్లు రాజేష్,శ్రీనివాస్,వాచర్లు, సిబ్బంది శంకర్,సాయికిరణ్, లచ్చన్న,రాకేష్,ఓదెలు, సంజీవ్ లు పాల్గొన్నారు.

ప్రజా అవసరాలకు అనుమతులు ఇవ్వాలి.!

ప్రజా అవసరాలకు అనుమతులు ఇవ్వాలి…

 తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. ఇసుక టాక్స్ పాలసీ తీసుకురావాలని పెద్దపెల్లి జిల్లాలో అమలవుతున్న ఇసుక టాక్స్ పాలసీ సిరిసిల్లలో కూడా అమలు చేయాలని సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఇసుక పాలసిని. తీసుకోవాలని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలతో అక్రమాలు జరిగాయని ఇసుక రవాణా విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజా ప్రభుత్వంలో సామాన్యులకు సైతం ఇసుక అందుబాటులో ఉండేరా నిర్ణయం తీసుకోవాలని దూరాన్ని బట్టి ఇసుక రవాణాలకు చాలాను.కట్టే విధంగా ఇసుకపాలసిని .అమలు చేయాలని అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ సామాన్యులకు ఇసుక సరఫరా లో ఇబ్బందులు కలగకుండా చూడాలని. దీనిపై జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆది శ్రీనివాస్. కేకే మహేందర్ రెడ్డి లు. ఈ విషయంలో చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల భూపతి. గుగ్గిళ్ళ భరత్ కొత్త రవి.సత్తు శ్రీనివాస్ రెడ్డి. మీరాల శ్రీనివాస్. పొన్నాల లక్ష్మణ్. మునిగల రాజు. శ్రీకాంత్ గౌడ్. వాసు. చంద్రారెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ప్రజా అవసరాలకు అనుమతులు ఇవ్వాలి.!

ప్రజా అవసరాలకు అనుమతులు ఇవ్వాలి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. ఇసుక టాక్స్ పాలసీ తీసుకురావాలని పెద్దపెల్లి జిల్లాలో అమలవుతున్న ఇసుక టాక్స్ పాలసీ సిరిసిల్లలో కూడా అమలు చేయాలని సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఇసుక పాలసిని. తీసుకోవాలని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలతో అక్రమాలు జరిగాయని ఇసుక రవాణా విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజా ప్రభుత్వంలో సామాన్యులకు సైతం ఇసుక అందుబాటులో ఉండేరా నిర్ణయం తీసుకోవాలని దూరాన్ని బట్టి ఇసుక రవాణాలకు చాలాను.కట్టే విధంగా ఇసుకపాలసిని .అమలు చేయాలని అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ సామాన్యులకు ఇసుక సరఫరా లో ఇబ్బందులు కలగకుండా చూడాలని. దీనిపై జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆది శ్రీనివాస్. కేకే మహేందర్ రెడ్డి లు. ఈ విషయంలో చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల భూపతి. గుగ్గిళ్ళ భరత్ కొత్త రవి.సత్తు శ్రీనివాస్ రెడ్డి. మీరాల శ్రీనివాస్. పొన్నాల లక్ష్మణ్. మునిగల రాజు. శ్రీకాంత్ గౌడ్. వాసు. చంద్రారెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ప్రజా అవసరాలకు అనుమతులు ఇవ్వాలి.!

ప్రజా అవసరాలకు అనుమతులు ఇవ్వాలి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి ;

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. ఇసుక టాక్స్ పాలసీ తీసుకురావాలని పెద్దపెల్లి జిల్లాలో అమలవుతున్న ఇసుక టాక్స్ పాలసీ సిరిసిల్లలో కూడా అమలు చేయాలని సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఇసుక పాలసిని. తీసుకోవాలని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలతో అక్రమాలు జరిగాయని ఇసుక రవాణా విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజా ప్రభుత్వంలో సామాన్యులకు సైతం ఇసుక అందుబాటులో ఉండేరా నిర్ణయం తీసుకోవాలని దూరాన్ని బట్టి ఇసుక రవాణాలకు చాలాను.కట్టే విధంగా ఇసుకపాలసిని .అమలు చేయాలని అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ సామాన్యులకు ఇసుక సరఫరా లో ఇబ్బందులు కలగకుండా చూడాలని. దీనిపై జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆది శ్రీనివాస్. కేకే మహేందర్ రెడ్డి లు. ఈ విషయంలో చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల భూపతి. గుగ్గిళ్ళ భరత్ కొత్త రవి.సత్తు శ్రీనివాస్ రెడ్డి. మీరాల శ్రీనివాస్. పొన్నాల లక్ష్మణ్. మునిగల రాజు. శ్రీకాంత్ గౌడ్. వాసు. చంద్రారెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట.

ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట.

నాగర్ కర్నూల్  నేటి దాత్రి:

నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో మండలానికి సంభందించిన రైతులకు శనివారం రోజున ప్రభుత్వ సబ్సిడీ కింద మంజూరు అయిన స్ప్రింక్లర్లను ఎమ్మేల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్ద పీట వేస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణమాఫీ కింద 24 వేల కోట్ల రూపాయలు వెచ్చించిందని, సన్న వడ్లకు బోనస్ ఇచ్చిందని, ఎలాంటి షరతులు లేకుండా రైతుల నుండి ధాన్యం కోనుగులు చేసిందని, వ్యవసాయ యాంత్రీకరణను రైతాంగానికి మరింత దగ్గర చేయడానికి ప్రయత్నిస్తుందని,. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రజా ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని ఎమ్మేల్యే అన్నారు.ఇట్టి కార్యక్రమంలో సంబధిత అధికారులు, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణ రావు, మండల ప్రెసిడెంట్ కోటయ్య,మాజీ కౌన్సిలర్స్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వినోద్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చదవండి.!

ప్రభుత్వ పాఠశాలలో చదవండి మీ భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోండి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం. స్థానిక సెస్. ఆధ్వర్యంలో. ప్రభుత్వ బాలికలు జూనియర్ కళాశాల సిరిసిల్ల అధ్యాపక బృందం. ప్రభుత్వ కళాశాలలో చేరండి మీ మంచి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి. అనే.నినాదంతో సారంపల్లి బద్దెనపల్లి గ్రామాల్లో 10వ తరగతి పాసైన విద్యార్థులు ఇంటింటికి వెళ్లి కళాశాలకు సంబంధించిన కరపత్రాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వ కళాశాలలోనే ఇంటర్మీడియట్ విద్యను చదవండి చదవడం వల్ల కలిగే లాభాలు వారి తల్లిదండ్రులకు వివరిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కళాశాల లెక్చరర్ సీతారాము శ్రీనివాస్ ప్రవీణ్ కుమార్ .నవీన్ రెడ్డి. జెబి ఉల్లా గంగరాజు తదితరులు పాల్గొన్నారు

అమరవీరుల ఆశయ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు.

అమరవీరుల ఆశయ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు

ఎంసీపిఐ( యు )రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి.

ఎర్ర వనంగా మారిన మాదన్నపేట అమరవీరుల సంస్మరణ సభ

ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ కవి గాయకుడు యోచన కళాబృందం ఆటపాటలు

నర్సంపేట,నేటిధాత్రి:


అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో వారి ఆశయసిద్ధికై దోపిడి వర్గ నిర్మూలన కోసం ప్రజా పోరాటాలను ఉదృతం చేస్తామని ఎంసిపిఐ (యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అన్నారు.వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలో ఎంసీపిఐ( యు ) అమరవీరుల సంస్మరణ బహిరంగ సభను గ్రామ పార్టీ కార్యదర్శి అనుమల రమేష్ అధ్యక్షతన నిర్వహించారు.ముందుగా అమరవీరుల స్మారకార్థం నిర్మించిన స్థూపం వద్ద పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.ఆనాడు కామ్రేడ్ ఓంకార్ నాయకత్వంలో వరంగల్ జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించబడ్డాయని,ప్రజా పోరాటాలను చూసి ఓర్వలేని దోపిడివర్గ పాలకులు ప్రజా ఉద్యమాలపై కక్షకట్టి ఆణిముత్యాలాంటి నాయకులను హత్యచేశారని ఆరోపించారు.వారు భౌతికంగా దూరమైనా వారి ఆశయాలు త్యాగాలు వృధా కాకుండా

Public struggles

చిరస్థాయిగా నిలుస్తాయన్నారు.రాష్ట్రంలో ప్రజా సమస్యలు తీవ్రంగా పెరిగిపోయాయని ఎన్నో ఆశలు,ఆకాంక్షలతో కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తే నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని విమర్శించారు .అమరవీరులు చూపిన బాటలో ప్రజా సమస్యలపై సమర శీల పోరాటాలు నిర్మిస్తామని ఆయన తెలిపారు.సభలో ప్రముఖ కవి,గాయకులు యోచన కళాబృందం,ఐక్య ప్రజానాట్యమండలి కళాబృందం నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.కాగా మాదన్నపేట గ్రామం మొత్తం జెండాలతో ఎర్రవంగా మారింది.ఈ సభలో పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పెద్దారపు రమేష్ , ప్రముఖ కవి గాయకులు ,యో చన , రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనె కుమారస్వామి ,ఎన్ రెడ్డి హంస రెడ్డి ,మంద రవి ,కన్న వెంకన్న ,మాస్ సావిత్రి , గడ్డం నాగార్జున , ఎండి రాజా సాహెబ్ , కొత్తకొండ రాజమౌళి ,కనకం సంధ్య ,కేశెట్టి సదానందం ,ఎండి మా షూక్ ,ఎల్లబోయిన రాజు ,కల కోట్ల యాదగిరి ,మార్త నాగరాజు ,సుధా , కర్నె సాంబయ్య ,గుర్రం రవి , ఆకుల రాజేందర్ ,వక్కల రాజమౌళి ,కొప్పుల సమ్మక్క ,వైనాల పద్మ ,కేశెట్టి శ్రీను , అల్లం నరసయ్య ,అమరవీరుల కుటుంబ సభ్యులు ,ప్రముఖ కళాకారులు తాళ్ల సునీల్ , గాదెపాక బాబు ,బరిగల రవీందర్ ,రావుల శంకర్ ,అనిల్ కర్ణ ,నరసింహ ,సింగన బోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

పేద కుటుంబాలకు అండగా ప్రజా ప్రభుత్వం.

పేద కుటుంబాలకు అండగా ప్రజా ప్రభుత్వం

సన్న బియ్యం పంపిణీ పేదలకు వరం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని

సన్నబియ్యం పంపిణీ నిరుపేదలకు వరంగల్ మారిందని

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన దారకొండ నాగరాజు నివాసంలో గ్రామానికి చెందిన నాయకులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ బడిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు

బిఆర్ఎస్ బహిరంగ సభ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ.

బిఆర్ఎస్ బహిరంగ సభ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ.

మిగిలిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలి

మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఈనెల 27 న వరంగల్ జిల్లా సమీప ఎల్కతుర్తిలో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ పట్ల నర్సంపేట రూరల్ మండలంలోని ఇటుకలపల్లి,ఆకుల తండా,ఏనుగుల తండా,ఇప్పల్ తండ గ్రామలలో బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఆయా గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు.అనంతరం గోడ పత్రికలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రుణ మాఫీ పట్ల ప్రకటన ప్రకారం మిగిలిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ రంగాల్లో విఫలమయ్యిందని అన్నారు.
ఈ కార్యక్రమం లో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరాములు,క్లస్టర్ ఇన్చార్జిలు మోటూరి రవి,కడారి కుమారస్వామి,మాజీ ఎంపీటీసీ భూక్యా వీరన్న,మండల పార్టీ ఉపధ్యక్షుడు అల్లి రవి,ఇటుకాపల్లి గ్రామకమిటీ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్,ఆకుల తండ గ్రామ పార్టి అధ్యక్షుడు కూకట్ల రవి,ఇప్పల్ తండ గ్రామ పార్టి అధ్యక్షుడు ధరావత్ బద్దు,ఏనుగుల తండ గ్రామ పార్టి అధ్యక్షుడు,మాజీ సర్పంచ్ బానోతు రవి,మాజీ సర్పంచ్ లు మండల రవీందర్,భానోత్ శంకర్ నాయక్,మాజీ ఉప సర్పంచ్ జమాల చంద్రమౌళి,వాడికారి గోపాల్,కుసుంబ కోటి,మండల రాజమౌళి,రాధరపు రాజు,నకినబొయిన సారంగం,జామచెట్ల చేరాలు, సాంబయ్య,గజ్జి బాబు, హరీష్, సుమన్,కిషన్ నాయక్,బోయిని సమ్మాలు,పాసికంటి శంకర్ లింగం,కన్నెబోయిన రాజు, కూకట్ల కుమార్ ఉప్పునూతల వీరాచారి,గోపు సాంబయ్య,బానోతు దశ్రు,కిషన్,ధరావత్ దసురు,జై కిసాన్ బద్రు,గ్రామ కమిటీ సభ్యులు,నాయకులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసేవకే కాకా కుటుంబం… ప్రజల కొరకే కాకా కుటుంబం.

ప్రజాసేవకే కాకా కుటుంబం… ప్రజల కొరకే కాకా కుటుంబం..

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రైల్వే బ్రిడ్జికి పునాది వేశాం… ప్రారంభించాం..!

ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

సన్నబియ్యం అక్రమ దందా చేస్తే కేసులు నమోదు చేస్తాం.

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి

క్యాతనపల్లి వద్ద రైల్వేగేటుపై నిర్మించిన ఫ్లైఓవర్‌ బ్రిడ్జికి పునాది వేసింది మేమే ప్రారంభించింది మేమేనని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంగళవారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజాసేవకే కాకా కుటుంబం అని ప్రజల కొరకే కాక కుటుంబం అని అన్నారు.

 

MP

రామకృష్ణాపూర్ పట్టణ ప్రజల చిరకాల కోరిక రైల్వే బ్రిడ్జి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, గతంలో కాంగ్రెస్ హయాంలో పెద్దపల్లి ఎంపీగా ఉన్న సమయంలో బ్రిడ్జి పునాది వేశామని, తిరిగి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పెద్దపల్లి ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యేలుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో బ్రిడ్జి నిర్మాణ పనులు ఆలస్యం అయ్యాయని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం త్వరితగతిన పూర్తిచేసి బ్రిడ్జి ప్రారంభించామని తెలిపారు.ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, ప్రజాసేవకే కాక కుటుంబం ఉందని అన్నారు. గత ప్రభుత్వం దాచుకోవడం దోచుకోవడం తోనే సరిపోయిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ..

 

MP

రైల్వే గేటు పడిన సమయంలో అనేక ప్రాణాలు పోయాయని, ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో ప్రాంత ప్రజల కష్టాలు తీరుతున్నాయని అన్నారు. పేద ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, సన్న బియ్యపు అక్రమ దందా చేస్తే కేసును నమోదు చేస్తామని హెచ్చరించారు. మున్సిపాలిటీలోని అన్ని ఏరియాలకు త్వరలోనే మంచినీరు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు, మాజీ చైర్ పర్సన్ జంగం కళ,మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి నాయకులు రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకుబ్ ఆలీ, గోపతి భానేష్, పాల రాజు,మహంకాళి శ్రీనివాస్,కుర్మ సురేందర్, సిపిఐ నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్, రామడుగు లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

ప్రజాసేవ ధ్యేయంగా దూసు కుపోతున్న తీన్మార్జయ్.

ప్రజాసేవ ధ్యేయంగా దూసు కుపోతున్న తీన్మార్ జయ్

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం సూర్య నాయక్ తండా గ్రామంలో రెండు రోజుల క్రితం గాలి దుమారం వల్ల గ్రామంలో మక్కా జొన్న పంట నేలకు వాలడంతో గ్రామంలో రైతులకు జరిగినటువంటి నష్టాన్ని తెలుసుకున్న తీన్మార్ జయ్ సమస్యను మండల వ్యవసాయ శాఖ అధికారు లకు వివరించి రైతులకు అధికారుల నుండి న్యాయం జరిగేలా కృషి చేశాడు తమ ఓటు వేసి గెలిపించుకున్న నాయకులు చేయవలసిన పని మంచి మనసుతో తమ గ్రామం లోని తీన్మార్ జయ్ రైతుల పక్షాన నిలవడం చాలా సంతోషంగా ఉందని రైతులు ప్రశంసించారు తండా గ్రామం లో 42 మందికి ఉచిత కంటి ఆపరేషన్ తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో చేయించి వారి మన్ననలను పొందాడు తన గ్రామంలో వారం అంగడి స్థాపించి చుట్టుపక్కల గ్రామా లకు కూడా తను ఒక ఆదర్శ వంతమైన వ్యక్తిగా నిలిచాడు అలాగే ఫ్లోరైడ్ నీటి వాటర్ ఉండకూడదని ఆ తండా గ్రామంలో ప్రతి ఒక్కరికి మినరల్ వాటర్ ఉచితంగా సరఫరా చేయాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ను కొంతమంది దాతల సహాయంతో కలిసి నిర్మిస్తున్నాడు తన పుట్టిన ఊరు తన కన్న తల్లితో సమాన మని తన గ్రామ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచు కోవడం లేనే నాకు ఆనందంగా ఉంది అని ఎవరో వస్తారు ఏమో చేస్తారు అని ఎదురు చూడటం చేతగాని తనం అవు తుందని అన్నారు రానున్న స్థానిక సంస్థల్లో ఆ సూర్య నాయక్ తండా గ్రామంలో తాను తప్పకుండా పోటీలో నిలిచి తన గ్రామాన్ని ఆదర్శ గ్రామం గా తీర్చిదిద్దాలని తీన్మార్ జయ్ అన్నారు. గ్రామంలోని ప్రజలు తీన్మార్ జయ్ చేస్తున్న మంచి పను లకు ఎప్పుడు తనకు అండగా ఉంటామని ప్రజలు తెలిపారు.

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ.

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ

మందమర్రి నేటి ధాత్రి

 

బొడ్డు రవి గారి వర్ధంతి సందర్భంగా నిరుపేదలైన అట్కపురం రాజాంరాజేశ్వరి దంపతులకుని నిత్యవసరకులు పంపిణీ.

బొడ్డు రవి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా
రామకృష్ణాపూర్ లో ఏరియా హాస్పిటల్ దగ్గర నివసిస్తున్న రాజం దంపతులకు నిత్యవసర సరుకులు అందించడం జరిగింది.

అనంతరం మందమర్రి పట్టణ అధ్యక్షుడు నంది పాట రాజకుమార్ మాట్లాడుతూ

మీ పెళ్లి రోజులు కానీ పుట్టిన రోజులు ఉన్నప్పుడు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీకి సంప్రదించినట్లయితే మీ వంతుగా పేద ప్రజలకు సహాయం చేస్తామని అని చెప్పడం జరిగింది
ఎంతోమంది ఆకలితో ఆలమటించిపోతున్నారు వారందరికీ మనమంతా కలిసి ఆహారం పెట్టి దేశంలోనే ఒక ఆకలి మరణం లేకుండా చేద్దాం అని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో. సొసైటీ సభ్యులు జావిద్ పాషా, ఖాజా భాయ్, ఈశ్వర్,తదితరులు పాల్గొన్నారు.

ప్రజా పాలనలోనే వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేస్తాం.

ప్రజా పాలనలోనే వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేస్తాం

రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క..

కొత్తగూడ, నేటిధాత్రి :

 

ప్రజా పాలన లోనే వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని, అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టుల యొక్క చిరకాల ఆకాంక్ష అయిన ఇళ్ల స్థలాల మంజూరు సమస్యను కూడా పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క పేర్కొన్నారు.

గురువారం నాడు టీయూడబ్ల్యూజే (ఐజేయు) కొత్తగూడ మండల కమిటీ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ స్థానిక శాసన సభ్యురాలు, రాష్ట్ర మంత్రివర్యులు సీతక్కకు ములుగు క్యాంప్ కార్యాలయంలో ఐజేయు సభ్యులు కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి వర్కింగ్ జర్నలిస్టులను అన్యాయాలకు గురి చేసినటువంటి దుస్థితి గత పాలకులదేనని, కెసిఆర్ కు వత్తాసు పలికే కొన్ని మీడియా యాజమాన్య సంస్థలతో కుమ్మక్కై మీడియా రంగాన్ని అనేక విభాగాలుగా విభజించి ఫోర్త్ ఎస్టేట్ అనే రంగాన్ని పూర్తిగా కనుమరుగు అయ్యే విధంగా వ్యవహరించిన తీరు నాటి పాలకుల పాపమేనని, కచ్చితంగా వర్కింగ్ జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం లోనే ఇళ్ల స్థలాల మంజూరు,ఆరోగ్యశ్రీ ,హెల్త్ కార్డుల మంజూరు, వర్కింగ్ జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించే విధంగా

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మరియు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సారథ్యంలో విధి విధానాలు చేపడుతున్నామని, కచ్చితంగా వర్కింగ్ జర్నలిస్టులకు చిరకాల ఆకాంక్ష కోరికైనా ఇళ్ల స్థలాల మంజూరుకు కచ్చితంగా తన వంతు కృషి ఉంటుందని అన్నారు..

ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) కొత్తగూడ మండల అధ్యక్షుడు ఎస్. కె .సల్మాన్ పాషా, జిల్లా నాయకులు శెట్టి పరశురాం, మహమ్మద్ అజ్మీర్, మండల ఉపాధ్యక్షులు గోగు విజయ్ కుమార్, దేశ వెంకటేశ్వర్లు, మండల ప్రచార కార్యదర్శిలు తీగల ప్రేమ్ సాగర్, ఈక నరేష్, ఉబ్బని శ్రీహరి, గంగిశెట్టి రాకేష్ వర్మ, ముఖ్య సలహాదారులు బొజ్జ సునీల్, యూనియన్ నాయకులు చాపల శ్రీనివాస్, నాంపల్లి రాజ్ కుమార్, తాటి సుదర్శన్, బిక్షపతి, గట్టి సుధాకర్, అశోక్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు…

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం….

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల్ అత్నూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం గురువారము మండల పరిధిలోని అత్నూర్ గ్రామంలో డీలర్ అబ్దుల్ రెహమాన్ రేషన్ షాపులో మండల కాంగ్రెస్ సీనియర్ యువ నాయకులు మొహమ్మద్ యూనుస్ లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొహమ్మద్ యూనుస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ కత్వంలో తెలంగాణలోని సబ్బండ వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ నెరవేరుస్తుం దని,ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేయడం వారు 10 ఏళ్లలో చేసింది ఏమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డీలర్ అబ్దుల్ రెహమాన్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాలందరికీ సన్నబియ్యం.

ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాలందరికీ సన్నబియ్యం
… సన్న బియ్యం పథకం నిరుపేదలకు ఒక వరం*

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకం నిరుపేదలకు ఒక వరం లాంటిదని
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తాసిల్దార్ సునీత డి ఎం ఎం ఓ డి సి ఎస్ ఓ తో కలిసి ప్రారంభించారు ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

MLA Gandra Satyanarayana Rao.

రేషన్ కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యునికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ను అందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సంవత్సరంన్నర కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపెట్టారని ఎమ్మెల్యే అన్నారు. గతంలో రేషన్ బియ్యం పంపిణీ మాఫియాలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామని తెలిపారు.అనంతరం మండలంలోని సిఎం రిలీఫ్ ఫండ్ 63 మంది లబ్దిదారులకు రూ.17,63,500/చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.ఆసుపత్రిలో వైద్యము చేయించుకొని డబ్బు లేక అవస్థలు పడుతున్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి కాంగ్రెస ప్రభుత్వం సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేస్తుందని ఎమ్మెల్యే గారు అన్నారు.ఈ కార్యక్రమములో సొసైటీ చైర్మన్ సంపెల్లి నర్సింగరావు చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ సీనియర్ నాయకులు మోటే ధర్మారావు తక్కలపల్లి రాజు క్యాథరాజు రమేష్ నీరటి మహేందర్ మండల కాంగ్రెస్ నేతలు, అధికారులు రేషన్ షాప్ డీలర్లు పాల్గొన్నారు

ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో జనసభ.

ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో జనసభ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

సిరిసిల్ల ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో జనసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహకార సంఘం తంగళ్ళపల్లి మండలరైతులకు అన్ని రకాలుగా వ్యవసాయ రుణాలు కానీ సంబంధిత పంటల అవసరాలకు రైతులకు సహకార సంఘం ఎంతో ఉపయోగపడుతుందని. మండలంలో ఉన్న రైతులందరూ సహకార సంఘం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేస్తూ ఇప్పటిదాకా జరిగిన వాటిని రైతులకు ప్రజలకు వాటి గురించి వివరంగా వివరించారు సహకార సంఘానికి ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఎన్ని డబ్బులు ఖర్చయితున్నాయి తదితర అంశాలపై చర్చించడం జరిగిందని అలాగే సహకార సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నడిపించడం జరుగుతుందని. దీనిలో వచ్చే ఆదాయం ఎంత దాని గురించి కూడా సంఘం అభివృద్ధిలో కలుపుతున్నామని దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులందరూ రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించి సహకార సంఘం అభివృద్ధిపై మండల రైతులు మీరు కూడా పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల స్వరూప తిరుపతి రెడ్డి పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణ రెడ్డి డైరెక్టర్లు బిజెపి మండల అధ్యక్షులు శ్రీధర్ రావు రైతులు సహకార సంఘం సభ్యులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version