ఏప్రిల్ నుండి సన్న బియ్యం పంపిణీ డీలర్లు ప్రజలకు.!

Ration

ఏప్రిల్ నుండి సన్న బియ్యం పంపిణీ డీలర్లు ప్రజలకు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే డీలర్ షిప్ సస్పెండ్
వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి జిల్లాలో వనపర్తి పట్టణంలో ఏప్రిల్ నుండి ప్రభుత్వం రేషన్ షాప్ ల ద్వారా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయుటకు రంగం సిద్ధం చేసిందని జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు బచ్చిరాం ఒక ప్రకటనలో తెలిపారు కుటుంబంలో ఒకరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు . జాయింట్ కలెక్టర్ డి ఎస్ ఓ సన్న బియ్యం పంపిణీ పై డీలర్ల సమావేశం నిర్వహించారని అధికారులు దిశా నిర్దాశము చేశారని తెలిపారు . వనపర్తి జిల్లా పట్టణంలో ప్రజలకు రేషన్ డీలర్లు ఎవరైనా దొడ్డు బియ్యం సరఫరా చేస్తే కలెక్టర్ కార్యాలయం డీఎస్ఓ కు ఫిర్యాదులు చేయాలని అధికారులు చెప్పారని బచ్చురాం తెలిపారు . ప్రభుత్వం అధికారులు ఆదేశాల ను అమలు చేసి ప్రజలకు సన్న బియ్యం పంపిణీ విషయంలో రేషన్ డీలర్లు సహకరించాలని కోరారు . జిల్లాలోని ప్రతి గ్రామంలో వనపర్తి పట్టణంలో రేషన్ డీలర్లు సన్న బియ్యం తీసుకోవాలని ఆయన కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!