జైపూర్ మండలంలో మీసేవ కేంద్రాల పనితీరుపై తహసీల్దార్ సమీక్ష

జైపూర్ మండలంలో మీసేవ కేంద్రాల పనితీరుపై తహసీల్దార్ సమీక్ష

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మీసేవ కేంద్రాల ఆపరేటర్లతో తహసీల్దార్ వనజ రెడ్డి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం మాత్రమే దరఖాస్తుదారుల నుండి రుసుములు వసూలు చేయాలని స్పష్టం చేశారు.దరఖాస్తులను ఎలాంటి తప్పులు లేకుండా సమర్పించి,సంబంధిత పత్రాలను సక్రమంగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు.అలాగే ప్రతి మీసేవ కేంద్రంలో సిటిజెన్ చార్టర్ బోర్డును తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, కేంద్రానికి వచ్చే పౌరులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు.ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్,గిర్దావర్‌లు,గ్రామ పాలనా అధికారులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం….

బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

బెల్లంపల్లి,నేటి ధాత్రి:

జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి అందరం సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య,బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్,బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్,మున్సిపల్ కమిషనర్ సంపత్,చైర్ పర్సన్ దావ స్వాతి, వైస్ చైర్ పర్సన్ సత్యనారాయణ లతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని తెలిపారు.మున్సిపల్ పరిధిలో వివిధ విభాగాలలో పని చేస్తున్న సిబ్బందికి సకాలంలో వేతనాలు అందించాలని,ఈ మేరకు మున్సిపల్ పరిధిలోని ఇంటి పన్ను, ఇతర పన్నులను 100 శాతం వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించేందుకు డి ఎం ఎఫ్ టి నిధుల నుండి ఆటోలు అందించడం జరిగిందని తెలిపారు.బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సి.ఎస్.ఆర్. నిధుల నుండి 2 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.మున్సిపల్ పరిధిలోని అంతర్గత రహదారులు,మురుగు కాలువల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని,విద్యుత్ బిల్లులు తగ్గించే ఆలోచనలో భాగంగా సోలార్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో నిరంతరం త్రాగునీటిని సరఫరా చేసేందుకు పనులు కొనసాగుతున్నాయని, ముల్కల్ల నుండి నీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని,శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో సమృద్ధిగా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.మున్సిపల్ పరిధిలోని వార్డులలో సిబ్బంది కొరత ఉన్నట్లయితే సమకూర్చుకునేందుకు పాలకవర్గం సమన్వయంతో చర్యలు తీసుకోవచ్చని,ప్లాస్టిక్ వ్యర్ధాలను నిబంధనల ప్రకారం విక్రయించి మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చడం జరుగుతుందని తెలిపారు.మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లలో షాపులు తీసుకున్న వారి వద్ద నుండి అద్దె క్రమం తప్పకుండా వసూలు చేయాలని, ఖర్చులు తగ్గించి ఆదాయం పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.2026-27 సంవత్సరానికి గాను అంచనా బడ్జెట్ 32 కోట్ల 42 లక్షల రూపాయల అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారని, ఇందులో 4 కోట్ల 77 లక్షల రూపాయలు సాధారణ ఆదాయం ( గ్రాంట్లు కాకుండా), 26 కోట్ల 28 లక్షల రూపాయల గ్రాంట్లు, 81 లక్షల రూపాయల డిపాజిట్లు, అడ్వాన్సులు, 55 లక్షల రూపాయల నిలువ ఉంటుందని తెలిపారు.
అన్ని రంగాల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపు – ఎమ్మెల్యే వినోద్

బెల్లంపల్లి శాసనసభ్యులు మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 34 వార్డులలో 1 సంవత్సర కాలంలో మురికివాడలను పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా అందరి సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.మున్సిపల్ అభివృద్ధి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని,మున్సిపల్ పరిధిలోని పారిశుద్ధ్యం,ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ,ప్రజా సమస్యల పరిష్కారంపై పాలకవర్గ సభ్యులు జవాబుతారీతనంతో వ్యవహరించాలని తెలిపారు.మున్సిపల్ పరిధిలోని అన్ని రంగాలను అభివృద్ధి చేసే విధంగా బడ్జెట్ కేటాయించడం జరుగుతుందని,ఆయా కేటాయింపుల ప్రకారంగా నిధులను వినియోగించి అభివృద్ధి చర్యలు చేపట్టాలని తెలిపారు.నియోజకవర్గ పరిధిలోని అర్హత గల ప్రతి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డుల కౌన్సిలర్లు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఏపీ వృద్ధిరేటు పెంపునకు ప్రభుత్వం చర్యలు..

ఏపీ వృద్ధిరేటు పెంపునకు ప్రభుత్వం చర్యలు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వృద్ధిరేటు పెంపునకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) రాష్ట్ర వృద్ధిరేటు పెంపునకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో ఇవాళ(బుధవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీ వృద్ధిరేటు అమలుపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వృద్ధిరేటు పెంపునకు రానున్న నాలుగు నెలల్లో తీసుకోవాల్సిన అంశాలు, అమలు చేయాల్సిన ప్రణాళికపై సూచనలు చేశారు సీఎం చంద్రబాబు.

ఈ ఆర్థిక సంవత్సరంలో 17.11 శాతం మేర వృద్ధి రేటు సాధించేలా లక్ష్యం పెట్టుకున్నామని వివరించారు. 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్థిక ఫలితాలపై ఈ సమావేశంలో చర్చించారు. మూడు, నాలుగు త్రైమాసికాల్లో సాధించాల్సిన లక్ష్యాలపై అధికారులకు సీఎం మార్గనిర్దేశం చేశారు. జీఎస్డీపీ, కేపీఐ, పబ్లిక్ పాజిటివ్ పర్‌సెప్షన్, డేటా డ్రివెన్ గవర్నెన్స్, తదితర అంశాలపై సూచనలు చేశారు సీఎం చంద్రబాబు.సూపర్ సిక్స్ పథకాలు, పౌరసేవలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షిస్తున్నారు. ఫైళ్ల క్లియరెన్స్, ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక, అవేర్, డేటాలేక్, ఐటీ అప్లికేషన్లపై సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదులు వాటి పరిష్కారంపై హెచ్ఓడీలకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు వాటి ఫలితాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న రుణాలు, వాటి రీస్ట్రక్చరింగ్ అంశంపై శాఖల వారీగా మాట్లాడుతున్నారు సీఎం చంద్రబాబు.

నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి….

నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రభుత్వం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో నిర్మితమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలకు మరింత వేగవంతమైన వైద్య సేవలను అందించడం కోసం వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంపొందించేందుకు ప్రభుత్వ  వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 216 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని,నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. అనంతరం హాజీపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని తహసిల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే తో కలిసి సందర్శించారు.భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జాతీయ రహదారి 63 నిర్మాణంలో భాగంగా భూసేకరణ కార్యక్రమానికి సంబంధించి అవార్డుల జారీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.వివిధ రకాల ధ్రువపత్రాల కొరకు కార్యాలయానికి వచ్చే ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి నిర్ణీత గడువులోగా ధ్రువపత్రాలు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖ డి.ఈ.సజ్జత్ భాషా, ఈ.ఈ.లక్ష్మీనారాయణ, ఎ.ఈ.ఈ.అనూష,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version