అంబేద్కర్ ఆశయా సాధనకై నరేంద్ర మోదీ పాలన.

అంబేద్కర్ ఆశయా సాధనకై నరేంద్ర మోదీ పాలన.

#భాజపా మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగుతుందని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు.భారతరత్న డాక్టర్ భీంరావు రాంజీ అంబేద్కర్135వ జయంతిని పురస్కరించుకొని బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి పండ్ల పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వినయ్ గౌడ్ మాట్లాడుతూ. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా ఈ దేశాన్ని ప్రధాని మోదీ మరింతగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.సమాజంలో అసమానతలను తొలగించి,సకల జనులకు సమన్యాయం చేకూర్చాలన్న బాబాసాహెబ్ ఆశయాలను నిజం చేస్తూ.. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ స్ఫూర్తితో ముందుకు సాగుతోందని,సామాజిక సాధికారత దిశగా మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రక అడుగులే ఆ మహనీయునికి మనం అర్పించే నిజమైన నివాళులు అన్నారు.బీజేపీ ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్ కు అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని ప్రధానం చేసిందని,భారతదేశపు సామాజిక నిర్మాణాన్ని అద్వితీయ పాత్రను పోషించిన అత్యున్నత పురస్కారమిచ్చి గౌరవించుకుంది బిజెపి పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు బత్తిని కుమారస్వామి, గుర్రపు నరేష్, మండల కార్యదర్శులు ఓదెల అశోక్,పున్నం కృష్ణమూర్తి,పార్టీ సీనియర్ నాయకులు పెరుమాండ్ల కోటి, వల్లే పర్వతాలు,ఎస్సీ మోర్చా మండల నాయకుడు జన్ను మధు, యువ మోర్చా మండల అధ్యక్షుడు తిమ్మాపురం శివ, నాయకులు ములుక రాజేష్, ధర్మారం క్రాంతి కుమార్,కొనకటి సుధాకర్,బల్ల రాజు,ఈర్ల రవి, మార్తా రవీందర్,దొమ్మటి బచ్చలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version