పొరపాటుల్లేని తుది ఓటరు జాబితా జిల్లా కలెక్టర్..

పొరపాటుల్లేని తుది ఓటరు జాబితా జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

పొరపాటుల్లేని తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో పురపాలక తుది ఓటరు జాబితా రూపకల్పనపై అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా స్వచ్ఛత ఖచ్చితత్వం ప్రజాస్వామ్యానికి కీలకమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా, అర్హత లేని పేర్లు తొలగించే ప్రక్రియలో రాజకీయ పార్టీలు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని కోరారు. ఓటరు నమోదు, మార్పులు, తొలగింపులపై అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులో సమర్పించాలని, ఫీల్డ్ స్థాయిలో విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, టీపీఓ సునీల్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ ఎన్నికలకు సహకరించాలి: తహసిల్దార్..

మున్సిపాలిటీ ఎన్నికలకు సహకరించాలి: తహసిల్దార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని తహసిల్దార్ దశరథ్ కోరారు.రాజకీయ పార్టీల నాయకులతో జరిగిన సమావేశంలో, వార్డుల సంఖ్య పెరగడంతో ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సన్నద్ధమైనట్లు తెలిపారు. పట్టణంలో 1000 మందికి ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ప్రజలు తమ సమస్యలను నేరుగా కౌన్సిలర్లకు చెప్పుకోవచ్చని, ప్రజాస్వామ్యబద్ధంగా కౌన్సిలర్లను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version