అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీలు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలి…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి:
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కి. వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మండల బిజెపి పార్టీ అధ్యక్షులు వెన్ననేని. శ్రీధర్ రావు మాట్లాడుతూ పాకిస్తానీయులను గుర్తించి వారి దేశం విడిచి వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తంగళ్ళపల్లి ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా మసీదులో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లిములు గుర్తించి వెంటనే వారిని పాకిస్తాన్ కి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ పాకిస్తాన్ మద్దతుతో దేశంలో ఉండిపోతున్న పాకిస్తాన్ పౌరులను గుర్తించి అలాగే మే 22వ తేదీన కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో ఏక్తాయాత్ర. నిర్వహించడం జరుగుతుందని . ఈ కార్యక్రమానికి మండలం నుండి పెద్ద ఎత్తున ప్రజల తరలిరావాలని పిలుపునిచ్చారు ఇట్టి కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు వినయ్ ఓబీసీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ జీవన్ మధుసూదన్ పోకల శ్రీనివాస్. రాజు. అనిల్. గణేష్. తదితరులు పాల్గొన్నారు