గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దివాకర…

గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దివాకర

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని పలు విభాగాలను పరిశీలించి, విద్యార్థులతో నేరుగా ముచ్చటించారు. తనిఖీలో భాగంగా ఆయన పరిశీలించిన
తరగతి గదులకు వెళ్లిన కలెక్టర్, విద్యార్థుల బోధనాంశాలను అడిగి తెలుసుకున్నారు. గణితం, సైన్స్ వంటి విషయాల్లో విద్యార్థుల నైపుణ్యాన్ని పరీక్షించారు.
ఉపాధ్యాయులు సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని సూచించారు. గోడపై ఉన్న మ్యాథ్స్ చార్టులను
గమనించి, ఉన్నత విద్యా ప్రమాణాలపై చర్చించారు.
విద్యార్థులకు అందిస్తున్న భోజనం, తాగునీరు మరియు హాస్టల్ వసతులపై కలెక్టర్ ఆరా తీశారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని వార్డెన్‌ను ఆదేశించారు.
పాఠశాల ఆవరణను, తరగతి గదులను శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం, నాణ్యతపై సంతృప్తి…

సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం, నాణ్యతపై సంతృప్తి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలంలోని రామతీర్థం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల విద్యార్థుల చదువు స్థాయి, క్రమశిక్షణ, లక్ష్య సాధనపై ఉపాధ్యాయులతో చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని, పరిశుభ్రత, పోషకాహారం, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మాధవి, యువ నాయకులు సందీప్, శ్రీకాంత్, గ్రామస్తులు గోరేమియా, సంజీవులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్….

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

భూపాలపల్లి నేటిధాత్రి

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు తీరును సమగ్రంగా పరిశీలించారు. వంటగది పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానం, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను స్వయంగా తనిఖీ చేసి, అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. పోషకాహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. వంట సిబ్బంది పరిశుభ్రతను పాటించడంతో పాటు, ఆహార పదార్థాలు తాజావిగా ఉండేలా చూడాలని, గడువు ముగిసిన పదార్థాలను వినియోగించొద్దని ఆదేశించారు. భోజనం బావుంది ప్రతి రోజు ఇలానే చేయాలని వంట సిబ్బందిని అభినందించారు..
పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పోషకాహారం అందించడంతో పాటు, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తరచుగా పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేలా సమతుల ఆహారం అందించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని,
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని, విద్యార్థులు మంచి అలవాట్లు అలవరచుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.
అనంతరం హాస్టల్ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, భద్రతా పరమైన చర్యలపై దృష్టి సారించాలని, సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు, ప్రహరీ గోడ పైభాగంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, పాఠశాల ప్రిన్సిపాల్ జీవరత్నం, పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సమస్యల వలయంలో నర్సంపేట గర్ల్స్ హై స్కూల్..

సమస్యల వలయంలో నర్సంపేట గర్ల్స్ హై స్కూల్

ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో గర్ల్స్ హైస్కూల్ సందర్శన

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని గర్ల్స్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమస్యల సుడిగుండంలో విలయతాండవం చేస్తుందని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య వరంగల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆరోపించారు.ఈ సందర్భంగా సోమవారం పట్టణంలో గల గర్ల్స్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఏఐఎఫ్డిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జన్ను రమేష్, చుక్క ప్రశాంత్ లు సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకన్నారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఆరవ తరగతి విద్యార్థులకు కనీసం క్లాసు రూమ్ లేకపోవడం వలన ఇప్పటికే వారు చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నారని అన్నారు. క్లాస్ రూములు, టాయిలెట్స్ లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఉన్నవరకు టాయిలెట్స్ శుభ్రం లేకపోవడం వాటికి డోర్లు కూడా లేని పరిస్థితి నెలకొన్నది తెలిపారు.నీళ్లు వృధాగా పోవడం వలన ఆటస్థలం మొత్తం బురదమయంగా ఉన్నది పేర్కొన్నారు. విద్యార్థులకు సరిపడా ఫ్యాన్లు లేవని, ఏడో తరగతి విద్యార్థులకు డిజిటల్ ప్రొజెక్టర్ ఉన్నా కూడా అది ఉపయోగంలో లేదని ఇప్పటికైన సమస్యలు పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్, తరుణ్,చరణ్, జాన్, వర్షిత్, పల్లవి,సుగుణ,మానస, అఖిల తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version