సమస్యల వలయంలో నర్సంపేట గర్ల్స్ హై స్కూల్
ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో గర్ల్స్ హైస్కూల్ సందర్శన
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని గర్ల్స్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమస్యల సుడిగుండంలో విలయతాండవం చేస్తుందని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య వరంగల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆరోపించారు.ఈ సందర్భంగా సోమవారం పట్టణంలో గల గర్ల్స్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఏఐఎఫ్డిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జన్ను రమేష్, చుక్క ప్రశాంత్ లు సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకన్నారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఆరవ తరగతి విద్యార్థులకు కనీసం క్లాసు రూమ్ లేకపోవడం వలన ఇప్పటికే వారు చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నారని అన్నారు. క్లాస్ రూములు, టాయిలెట్స్ లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఉన్నవరకు టాయిలెట్స్ శుభ్రం లేకపోవడం వాటికి డోర్లు కూడా లేని పరిస్థితి నెలకొన్నది తెలిపారు.నీళ్లు వృధాగా పోవడం వలన ఆటస్థలం మొత్తం బురదమయంగా ఉన్నది పేర్కొన్నారు. విద్యార్థులకు సరిపడా ఫ్యాన్లు లేవని, ఏడో తరగతి విద్యార్థులకు డిజిటల్ ప్రొజెక్టర్ ఉన్నా కూడా అది ఉపయోగంలో లేదని ఇప్పటికైన సమస్యలు పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్, తరుణ్,చరణ్, జాన్, వర్షిత్, పల్లవి,సుగుణ,మానస, అఖిల తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
