గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దివాకర…

గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దివాకర

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని పలు విభాగాలను పరిశీలించి, విద్యార్థులతో నేరుగా ముచ్చటించారు. తనిఖీలో భాగంగా ఆయన పరిశీలించిన
తరగతి గదులకు వెళ్లిన కలెక్టర్, విద్యార్థుల బోధనాంశాలను అడిగి తెలుసుకున్నారు. గణితం, సైన్స్ వంటి విషయాల్లో విద్యార్థుల నైపుణ్యాన్ని పరీక్షించారు.
ఉపాధ్యాయులు సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని సూచించారు. గోడపై ఉన్న మ్యాథ్స్ చార్టులను
గమనించి, ఉన్నత విద్యా ప్రమాణాలపై చర్చించారు.
విద్యార్థులకు అందిస్తున్న భోజనం, తాగునీరు మరియు హాస్టల్ వసతులపై కలెక్టర్ ఆరా తీశారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని వార్డెన్‌ను ఆదేశించారు.
పాఠశాల ఆవరణను, తరగతి గదులను శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version