సీఎం కప్ కిక్ బాక్సింగ్ లో పతకం సాధించిన విద్యార్థిని.

సీఎం కప్ కిక్ బాక్సింగ్ లో పతకం సాధించిన విద్యార్థిని

పతకం సాధించిన విద్యార్థిని, మాస్టర్ ను అభినందించిన ప్రిన్సిపాల్, పీడి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని టీజిటి డబ్ల్యూ ఆర్ జే సి కి చెందిన విద్యార్థిని బానోత్ చార్మి ఇటీవల నిర్వహించిన సీఎం కప్ క్రీడలలో కిక్ బాక్సింగ్ విభాగంలో జిల్లా తరుపున పాల్గొని రజిత పతకం సాధించడం జరిగింది. ఈ సందర్భముగా గురువారం పతకం సాధించిన విద్యార్థిని చార్మితో పాటు మాస్టర్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి శ్రీనివాస్ ( కరాటే ) లను ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, పీడి బి గౌతమి ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మాస్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరిన్ని పతకాలు సాధించాలని ఈ సందర్భముగా వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

షాట్ పుట్ లో సంపత్ కు పతకం.

బెల్లంపల్లి నేటిధాత్రి :

బెల్లంపల్లి లో ఈ నెల 18 వ తేదీ నుండి 19 వ తేదివరకు వరకు ఉస్మానియా యూనివర్సిటీ క్రీడా మైదానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యూత్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలలో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నాగంపేట గ్రామానికి చెందిన ఈర్ల సంపత్ రాష్ట్రస్థాయిలో సత్తా చాటి పురుషుల విభాగంలో పతకం సాధించాడని కోచ్ సల్పాల సంతోష్ యాదవ్ తెలిపారు. షాట్ పుట్ లో సంపత్ కంచు పతకం సాధించాడని అయన తెలిపారు. మంచిర్యాల జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి ఈ. మారయ్య మాట్లాడుతూ యువతకు క్రీడలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ రానున్న కాలం లో క్రీడల పట్ల మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అన్నారు. కోచ్ సంతోష్ యాదవ్ ను, అథ్లెట్ సంపత్ ను అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version