సీసీఐ కేంద్రాల్లోనే రైతులు పండించిన పత్తికి మద్దతుధర.

సీసీఐ కేంద్రాల్లోనే రైతులు పండించిన పత్తికి మద్దతుధర.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

చిట్యాల, నేటిదాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని బాలమురుగన్ పత్తి మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని
రైతులెవరూ ప్రైవేటు వ్యక్తులకు పత్తిని అమ్ముకుని నష్టపోవద్దని, సీసీఐ కేంద్రాల్లోనే రైతులు పండించిన పత్తికి కనీస మద్దతు ధర లభిస్తుందని అన్నారు.శ్రీ బాలమురుగన్ ఇండస్ట్రీస్ కాట‌న్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రంలో ప్రైవేట్ వ్యాపారులను ప్రోత్సాహించవద్దని, బయ్యర్ మాత్రమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని సూచించారు. రైతులు పండించిన పత్తిని సీసీఐ కేంద్రాలకు తెచ్చే ముందు తేమ లేకుండా ఉండేలా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించాలంటే తప్పనిసరిగా కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. సీసీఐ కేంద్రాల్లో రైతులకు సరిపడ వసతులు కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిసిఐ అధికారులు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మధు వంశీ, టౌన్ అధ్యక్షులు బుర లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, చిలకల రాయకొమురు, చిలుమల రాజమౌళి, బుర్ర శ్రీనివాస్, మార్కండేయ, నరసయ్య కిషన్, సదయ, పుల్ల సమ్మయ్య,,

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు…

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు…వర్ధన్నపేట ఎఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య.
వర్దన్నపేట (నేటిధాత్రి):

 

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట నియోజక వర్గం, వర్ధన్నపేట మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ.పత్తి రైతు సోదరులకు
విజ్ఞప్తి.2025- 26 సంవత్సరమునకు గాను ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ. 8110 /- లుగా నిర్ణయించనైనది.రైతు సోదరులు తమ పత్తి సరుకును ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ వారికి అమ్ముటకు గాను జిన్నింగ్ మిల్లుకు తీసుకు వచ్చే ముందే వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా పత్తి పంట వేసినట్లు నమోదు తప్పని సరిగా చేసుకోవలెను. తర్వాత సీసీఐ వారి కిసాన్ యాప్ నందు రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని రాగలరు.స్లాట్ బుక్ చేసుకొని వచ్చిన వారి కాటన్ మాత్రమే సీసీఐ వారు కొనుగోలు చేయడం జరుగుతుంది.అలాగే పత్తిని బాగా అరబెట్టి తేమ శాతం 12 % లోపు ఉండే విధంగా చెత్త చెదారం లేకుండా శుభ్రం చేసుకుని తీసుకురాగలరు. ఇలా తీసుకువొచ్చిన వారికి సరైన మద్దతు ధర లభిస్తుంది. పత్తి తేమ శాతం 8 నుండి 12 % లోపు ఉండవలెను. 8 శాతం కన్నా ఎక్కువగా ఉంటే ఒక్కో శాతం పెరిగే కొద్దీ క్వింటాలుకు రూ. 81 రూపాయలు తగ్గును. 12 శాతం కన్నా ఎక్కువగా ఉన్న పత్తిని సీసీఐ వారు కొనుగోలు చెయ్యరు. తదుపరి జిన్నింగ్ మిల్లుకు వచ్చేటపుడు రైతు వెంట ఆధార్ కార్డ్ జీరాక్స్ , పట్టాదారు పాస్ బుక్ జీరాక్స్ మరియు ఆధార్ కార్డుకు లింక్ అయిన సెల్ నంబర్ వెంట తెచ్చుకోగలరు. ఆధారుతో అనుసందానం అయిన బ్యాంకు నందు మాత్రమే మీ యొక్క పత్తి అమ్మిన డబ్బులు జమచేయబడును కావున రైతులు గమనించగలరు.
రైతుల సౌకర్యార్థం పత్తి కొనుగోళ్ల సంబంధిత సేవలకై ఫోన్ నెంబర్ 18005995779 మరియు వాట్సప్ చాట్ సేవలకై 8897281111 లను వినియోగించుకోగలరని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాము.
రైతులు తాము ఆరు కాలం కష్టపడి పండించిన పత్తిని మధ్యధళారులకు అమ్ముకొని మోసపోకుండా సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద మాత్రమే అమ్ముకొని మద్దతు ధర పొందగలరని కోరనైనది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version