సీసీఐ కేంద్రాల్లోనే రైతులు పండించిన పత్తికి మద్దతుధర.

సీసీఐ కేంద్రాల్లోనే రైతులు పండించిన పత్తికి మద్దతుధర.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

చిట్యాల, నేటిదాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని బాలమురుగన్ పత్తి మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని
రైతులెవరూ ప్రైవేటు వ్యక్తులకు పత్తిని అమ్ముకుని నష్టపోవద్దని, సీసీఐ కేంద్రాల్లోనే రైతులు పండించిన పత్తికి కనీస మద్దతు ధర లభిస్తుందని అన్నారు.శ్రీ బాలమురుగన్ ఇండస్ట్రీస్ కాట‌న్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రంలో ప్రైవేట్ వ్యాపారులను ప్రోత్సాహించవద్దని, బయ్యర్ మాత్రమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని సూచించారు. రైతులు పండించిన పత్తిని సీసీఐ కేంద్రాలకు తెచ్చే ముందు తేమ లేకుండా ఉండేలా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించాలంటే తప్పనిసరిగా కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. సీసీఐ కేంద్రాల్లో రైతులకు సరిపడ వసతులు కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిసిఐ అధికారులు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మధు వంశీ, టౌన్ అధ్యక్షులు బుర లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, చిలకల రాయకొమురు, చిలుమల రాజమౌళి, బుర్ర శ్రీనివాస్, మార్కండేయ, నరసయ్య కిషన్, సదయ, పుల్ల సమ్మయ్య,,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version