బోధనా ప్రణాళికలను రూపొందించుకొని.!

బోధనా ప్రణాళికలను రూపొందించుకొని పాఠ్య బోధన చేయాలి…

మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి…

కేసముద్రం/ నేటి ధాత్రి

ఉపాధ్యాయులు ప్రణాళికలు రూపొందించుకొని తదనుగుణంగా పాఠ్య బోధన చేయాలని కేసముద్రం మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి అన్నారు. కాంప్లెక్స్ సమావేశాలలో భాగంగా శనివారం తాళ్లపూసపల్లి జడ్పీ హైస్కూల్ నందు సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులకు, కేసముద్రం విలేజ్ జడ్పీ హైస్కూల్ నందు భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు.ఆయా కాంప్లెక్స్ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ కాలేరు యాదగిరి మాట్లాడుతూ…కాంప్లెక్స్ సమావేశాలలో నేర్చు కున్న విషయాలను పాఠశాలలో ఉపయోగించి విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలని అన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకే సమాజంలో చక్కని గుర్తింపు లభిస్తుందని ఎంఈఓ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు హాజరు పట్ల ఉపాధ్యాయులకు నిర్లక్ష్యం తగదని,ప్రతి ఉపాధ్యాయుడు విధిగా ఎఫ్ ఆర్ ఎస్ యాప్ లో ముఖ గుర్తింపు హాజరు వేయాలని మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం స్టేషన్ జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు చీకటి వెంకట్రాం నరసయ్య, తాళ్ళపూస పల్లి జడ్పీ హైస్కూల్ ఇంచార్జీ ప్రధానోపాధ్యా యులు దేశ బోయిన వెంకన్న, ఆర్పీలు సునీత, శ్రీనివాస్ రెడ్డి, మధుకర్ తో పాటు పలువురు ఉపాధ్యాయ, ఉపాధ్యాయినీలు పాల్గొన్నారు.

కల్లు గీత కార్మికుడి కుటుంబానికి గోపా డివిజన్.

కల్లు గీత కార్మికుడి కుటుంబానికి గోపా డివిజన్ అధ్యక్షులు సమ్మి గౌడ్ పరామర్శ

అనంతరం వారి కుటుంబానికి 1క్వింటా బియ్యం అందజేత

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలం అర్పణ పల్లి గ్రామానికి చెందిన బబ్బురు రవి భార్య యాక లక్ష్మి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఇటీవల మరణించగా మృతురాలి కుమారుడు కార్తీక్త్, కుమార్తె సుష్మలను శుక్రవారం
వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతురాలు యాక లక్ష్మి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఘన నివాళులర్పించారు గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్. అనంతరం వారి కుటుంబానికి 1 క్వింటా బియ్యం అందజేశారు.

ఈ కార్యక్రమంలో కే జి కే ఎస్ మండల అధ్యక్షులు బబ్బురు ఉప్పలయ్య, మాజీ సర్పంచ్ గంధసిరి సోమయ్య, మోడం రాజు,ఈర యాదమ్మ,సింగని మల్లేష్,షేక్ జానీ, గంగపురపు వెంకన్న, గంధం సంతోష్,షేక్ సైదులు,,వెంకన్న, విజేందర్,కృష్ణ, సాంబయ్య,,యాకన్న, సతీష్,రవి,హరీష్,రఫీ, ఆశూ,హర్షిత్,విజేందర్, రవి,కిషన్,అరవింద్, విజేందర్,సోమయ్య, ప్రణయ్,రంగయ్య, సద్దాం,మొగిలి,సత్యం, సుధాకర్,రాము,రమ, జ్యోతి,శ్రావణి, జయమ్మ,శోభ, ఫాతిమా,కొమురమ్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల హామీ ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి

సజ్జనపు సరస్వతి ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకురాలు

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి:

కేసముద్రం. మండల కేంద్రంలో వాల్ పోస్టర్లు ఆవిష్కరించడం. జరిగింది.
6 గ్యారంటీల అమలకై ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్ ఇందిరా పార్కులో జరిగే ధర్నా కు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని సజ్జనపు సరస్వతి మాట్లాడుతూ
సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈనెల 20వ తారీఖున హైదరాబాదులో జరుగు ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ మాట్లాడారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీఅమలుపరచటంలో పూర్తిగా విఫలమైందని రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ రైతుల ఖాతాలో వేస్తామన్న రైతుబంధు ఎకరంకు 15000 ఇస్తామన్నారు ప్రతి మహిళా ఖాతాలో 2500 రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు. భూమిలేని నిరుపేదలకు 12000 ఇస్తామన్నారు రేషన్ కార్డులు ప్రతి నెల 4000 రూపాయల పెన్షన్లు వివిధ రకాల పెన్షన్లుఆరు గ్యారంటీలు 420 వాగ్దానాలు చేసి అందరికీ అందిస్తామని మాయ మాటలుచెప్పి అరచేతిలో స్వర్గం చూపించి అన్ని వర్గాల ప్రజలందరినీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో వీరి కపట నీతిని ప్రజలందరూ అర్థం చేసుకొని తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరుతూ వీటి అమలుకై ఈనెల 20 తారీఖున హైదరాబాదులో జరుగు భారీ ప్రదర్శన బహిరంగ సభ ఇందిరా పార్క్ లో ధర్నాకు ప్రజలు పెద్దవేత్తుగా పాల్గొని జయప్రదం చేయాలని ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు అనుబంధ కూలీ యూనియన్ నాయకులు ఏమి, జాటోత్ మంజుల, వినోద్ విజయ, రజిత, రంగమ్మ ,లలిత, రుక్కమ్మ , ప్రమీల, రాధిక, లలిత, పార్వతి, శోభ, కమిలి, చిట్టి,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version