కాలనీవాసులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న.

*కాలనీవాసులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఎమ్మెల్యే సంజయ్ మల్లాపూర్

మే 22 నేటి ధాత్రి

 

:- గెలిచిన మొదటి పర్యటనలో మార్నింగ్ వాక్ చేసి కాలనీ సమస్యలు తెలుసుకున్న సంజయ్.
ఇచ్చిన మాట ప్రకారం కాలనీకి ప్రత్యేక నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే సంజయ్.
మల్లాపూర్ మండల కేంద్రంలోని దుర్గమ్మ కాలనీలో ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మంజూరైన ఐదు లక్షల రూపాయల విలువగల సిసి రోడ్ డ్రైనేజ్ పనులు ప్రారంభమయ్యాయి. దీనిని స్తానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారము పరిశీలించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ నూతనంగా గెలుపొందిన తర్వాత మార్నింగ్ వాక్ లో భాగంగా మల్లాపూర్ మండల కేంద్రంలోని దుర్గమ్మ కాలనీలో మొదట మార్నింగ్ ప్రారంభించి కాలనీలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం సిసి రోడ్డు, డ్రైనేజీ పనులు, ఎమ్మెల్యేగా గెలిచిన 16 నెలల్లోనే మంజూరు చేసారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అధికారం ఉన్న లేకున్నా ప్రజల సమస్యలే ఎజెండగా కల్వకుంట్ల సంజయ్ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తూ తనదైన శైలిలో ప్రజల బాగోగులు సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఏమి అవసరమో అవి గుర్తించి సమస్యలను పరిష్కరించడమే ఎమ్మెల్యే సంజయ్ లక్ష్యమని అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదని ప్రజల సమస్యని ప్రధాన ఎజెండగా ప్రజల్లో నిత్యం తిరుగుతూ సమస్యల పరిష్కరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, మల్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు లింగస్వామి గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దిరెడ్డి లక్ష్మణ్, నాయకులు బద్దినపల్లి ప్రేమ్, డబ్బా రమేష్ రెడ్డి, కొమ్ముల జీవన్ రెడ్డి, కోడూరి బిక్షపతి, నల్ల రాజేశ్వర్, దళిత రాజు, బిట్టు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version