జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికైన వారిని సన్మానించిన.

జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికైన వారిని సన్మానించిన ఇరు బార్ అసోసియేషన్ల:-

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

 

 

బుధవారం రోజున ఇటీవల జరిగిన జూనియర్ సివిల్ జడ్జి అర్హత పోటీ పరీక్షల్లో ఎంపికైన వారిని హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సత్యనారాయణ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలస సుదీర్ ఆధ్వర్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ హాల్లో ఘనంగా సన్మానించడం జరిగింది. ఇట్టి నియామకాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ముగ్గురు మహిళా న్యాయవాదులు గంగిశెట్టి ప్రసీద, అంబటి ప్రణయ, దార సాయి మేఘన మరియు న్యాయశాఖ ఉద్యోగిి లడే రాజుల ఎంపికయ్యారు. వీరి ఎంపిక పట్ల హన్మకొండ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
ఇట్టి సందర్భంగా పలువురు సీనియర్
న్యాయవాదులు మాట్లాడుతూ మన ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి నల్గురు జడ్జిలుగా ఎంపిక కావడం చాలా సంతోషకరం అన్నారు. గతంలో కూడా చాలా మంది ఈ బార్ అసోసియేషన్ల నుండి జడ్జిలుగా ఎంపికై వివిధ న్యాయస్థానాలలో జడ్జిలుగా విధులు నిర్వహిస్తున్నారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో హన్మకొండ మరియు వరంగల్ ప్రధాన కార్యదర్శులు కె.రవి, డి.రమాకాంత్ మరియు ఇరు కమిటీ సబ్యులు మరియు సీనియర్, జూనియర్ న్యాయవాదులు,మరియు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

సంగమేశ్వర స్వామి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తుల.

సంగమేశ్వర స్వామి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తుల ప్రత్యేక పూజలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

ఝరాసంఘంలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుధా, అనిల్ కుమార్ లు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ అర్చకులు వీరికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఈవో శివ రుద్రప్ప హైకోర్టు న్యాయమూర్తులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version