మైసమ్మతల్లి గుడికి స్లాప్ ప్రారంభోత్సవం.

మైసమ్మతల్లి గుడికి స్లాప్ ప్రారంభోత్సవం

ఏనుమాముల నేటిధాత్రి:

 

నగరంలోని 14వ డివిజన్ ఏనుమాముల ముసలమ్మ కుంట ఫేస్ వన్ గ్రామంలో మైసమ్మ తల్లి గుడి స్లాప్ ప్రారంభోత్సవ సందర్భంగా ముసలమ్మ కుంట ఫేస్ వన్ డెవలప్ కమిటీ అధ్యక్షుడు కాశెట్టి కమలాకర్ పిలుపుమేరకు సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ అడుప మహేష్ వెళ్లి సందర్శించి వారికి డెవలప్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి చేరి రాధాకృష్ణ. సుందరయ్య నగర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు. త్రికోవెల శీను. కాలనీలో ఇంకా అభివృద్ధి పనులు ఎక్కువ చేయాలని అన్నారు. డెవలప్మెంట్ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శిలు, కోశాధికారి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర…

జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాల ఏర్పాటు…

భక్తులు ప్రశాంత వాతావరణంలో మొక్కులు తీర్చుకోవాలి…

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

డప్పు చప్పుళ్ళు, గిరిజన సంప్రదాయాల మధ్య శుక్రవారం గాంధారి మైసమ్మ జాతర ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న జాతరకు తెలంగాణాతో పాటు మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ తదితర ప్రాంతాల నుంచి ఆదివాసీ, నాయక్‌ పోడులు,గిరిజనులు, తరలివస్తున్నారు. బొక్కల గుట్ట గాంధారి ఆలయం నుంచి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న సదర్ల భీమ న్న విగ్రహాల వద్ద పూజా కార్యక్రమాలను చేపట్టారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సదర్ల భీమన్న విగ్రహాల వద్దకు చేరుకొని తప్పెటగుళ్లను ఎత్తుకుని దేవతామూర్తులను గోదావరి నదికి సాగనంపారు. గిరిజన సంప్రదాయబద్దంగా సదర్ల భీమన్న విగ్రహాల వద్ద పట్నాలు నిర్వహించారు. అనంతరం తప్పెటగుల్ల, పిల్లనగ్రోవుల ఆటాపాటలతో ఆది వాసీలు గోదావరి నదికి తరలి వెళ్ళారు. తిరిగి నది జలాలతో ఖిల్లాకు చేరుకున్నారు. జాతర జరిగే ఖిల్లా ప్రాంతానికి కలెక్టర్ కుమార్ దీపక్ చేరుకొని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. జాతర సజావుగా జరిగేలా అధికారులు, నాయకులు సమన్వయంతో పని చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. జాతరకు వచ్చే భక్తులు సైతం భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకోవాలని అధికారులకు సహకరించాలని కోరారు.జాతర ప్రాంగణంలో మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి నేతృత్వంలో రామకృష్ణాపూర్‌ ఎస్సై రాజశేఖర్ భారీ బందోబస్తు చేప ట్టారు. క్యాతన్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్ గద్దె రాజు ఆధ్వర్యంలో జాతర ఏర్పా ట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గిరిజన, ఆది వాసీ నాయక్‌పోడుల ఆరాధ్య దైవమైన మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటే పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో అమ్మవారు రక్షిస్తారని గిరిజ నుల నమ్మకం. ఆదివాసీ నాయక్‌పోడ్‌ సేవా సంఘం ఆధ్వర్యంలో జాతరకు తరలి వచ్చే భక్తులకు సేవా కార్యక్ర మాలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. జాతర కార్యక్రమంలో మందమర్రి ఎమ్మార్వో సతీష్, ఆదివాసి నాయకపోడ్ సంఘం జిల్లా అధ్యక్షులు పెద్ది భార్గవ్, ప్రధాన కార్యదర్శి డి లక్ష్మణ్, గౌరవ అధ్యక్షులు ఎల్ రాజ్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ రోడ్డ రమేష్ ,రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి రాజన్న, ఆదివాసి హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు గంజి రాజన్న, ఆదివాసి నాయకపోడ్ పెద్దలు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version