జతర ఏర్పాట్లను పరిశీలించిన ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజ్..

 

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి..

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..

వనదేవతల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజ్ అన్నారు. సోమవారం జతర ఏర్పాట్లను పరిశీలించి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆలయ కమిటీ సమన్వయంతో అన్ని శాఖల అధికారులు జాతర ఏర్పాట్లు పూర్తి చేశారని ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఐటీడీఏ పీవో ఆదేశాలతో ఏర్పాట్లు అనుకున్న స్థాయిలో పూర్తయ్యాయని ఆయన తెలిపారు. మూడు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, త్రాగునీరు, పారిశుద్ధ్యం విద్యుత్ లైన్లో ఏర్పాటుచేసి ఆలయాన్ని విద్యుత్ కాంతులతో నింపామని ఆయన తెలిపారు. ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం, ఆర్డబ్ల్యూఎస్ విభాగం, ఎంపీడీవో కార్యాలయం, పోలీస్ శాఖ, వైద్యశాఖ, ఆలయ కమిటీ, సమన్వయంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కోరారు. సమస్యలు ఉంటే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని పిఓ గారితో చర్చించి సమస్యల త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. గుడికి బోర్వెల్, కాంపౌండ్ వాల్, స్నానాల ఘట్టాలు, త్రాగునీరు, షెడ్లు, సత్తర్ నిర్మించాలని మాజీ శాసనసభ్యులు మాజీ జడ్పీ చైర్మన్ చందా లింగయ్య కోరారు, ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన జాతరకు ఈ సంవత్సరం ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తాత్కాలిక ఏర్పాట్లు పూర్తయ్యాయని, గుడికి సంబంధించిన శాశ్వత పనులు గురించి, చందా లింగయ్య తెలిపిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన తెలిపారు.అధికారులందరూ జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దేవ వర కుమార్, తహసిల్దార్ నాగప్రసాద్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజేందర్, ఐ టి డి ఎ డి ఈ మధుకర్, ఏఈ యోగేశ్వరావు, జూనియర్ అసిస్టెంట్లు వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ తిరుమలేష్, డి ఈ బ్రహ్మదేవ్, ఏఈ విజయ్ కృష్ణ, కార్యదర్శులు, రామకృష్ణ, రవి, మారుతి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version