జాడిమల్కాపూర్ సర్పంచ్ ను సన్మానించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

జాడిమల్కాపూర్ సర్పంచ్ ను సన్మానించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మొగుడంపల్లి మండలం జాడిమల్కాపూర్ గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన బి. రాజు ఉప సర్పంచ్ ఎజాజ్ పటెల్ ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారిని మర్యాద పూర్వకంగా కలవగా వారిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు భరత్ రెడ్డి,వెంకట్ రాంరెడ్డి, తిరుమలేష్,యస్.గోపాల్,తదితరులు ఉన్నారు

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు..

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మొగుడంపల్లి మండలం జాడిమల్కాపూర్ గ్రామానికి చెందిన శంకరయ్య గారి సతీమణి ప్రభావతి మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్ వారి నివాసానికి చేరుకొని పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు..వారితో పాటు గా గ్రామ ఎంపీటీసీలు భరత్ రెడ్డి,వెంకట్ రామ్ రెడ్డి,ఉప సర్పంచ్ రాజు నాయకులు తిరుమలేశ్, బాగన్న, తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version