అసంపూర్తిగా ఇందిరమ్మ నమూనా ఇళ్ళు.

అసంపూర్తిగా ఇందిరమ్మ నమూనా ఇళ్ళు

◆ చెట్ల పొదలతో నిండిపోయిన పరిసర ప్రాంతం

◆ నిధుల లేమినా? అధికారుల నిర్లక్ష్యమా?

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం,రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల
నిర్మాణానికి ముందుగా ప్రతి మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మిం చాలని ప్రతిపాదించింది. దీని ఉద్దేశ్యం గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించు కునే లబ్దిదారులకు ఆదర్శంగా ఉండాలన్నాదే లక్ష్యం. కానీ అధికారుల నిర్లక్ష్య మో? నిధుల లేమితో తెలియదు కానీ మండల కేంద్రమైన ఝరా సంఘంలో తహసిల్దార్ కార్యాలయం ముందు భాగంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పనులు అసంపూర్తిగా మారాయి. దీంతో ఈ ఇల్లు పరిసర ప్రాంతం పిచ్చి మొక్క లు, ముళ్ల పొదలతో దర్శనమిస్తుంది. స్లాబు. గోడల నిర్మాణం పనులు పూర్త య్యాయి. దీనికి తలుపులు బిగించకపోవడంతో పశువులకు, శునకాలకు అడ్డాగా మారింది. తాసిల్దార్ కార్యాలయం కు వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు ఈ ఇల్లును మూత్రశాలంగా మార్చుకోవడంతో అక్కడ దుర్వాసన వెదజల్లుతుంది. గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లపై అవగాహన కల్పించి నిర్మాణం చేసుకోవాలని చెప్పే అధికారులే మోడల్ ఇందిరమ్మ ఇల్లును ఈ విధంగా వదిలిపెట్టడంతో పలువురు విస్మయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా ఈ మోడల్ ఇందిరమ్మ ఇల్లును పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉంది.

బాణాల రాంబాబుకు పెద్ది ఘన నివాళులు.

బాణాల రాంబాబుకు పెద్ది ఘన నివాళులు.

నర్సంపేట,నేటిధాత్రి:

బిఆర్ఎస్ పార్టీ నర్సంపేట మున్సిపల్ 23 వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీమతి బాణాల ఇందిరా భర్త బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాణాల రాంబాబు గుండెపోటుతో మరణించగా రాంబాబు పార్థివదేహానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి దంపతులు పూలమాలవేసి నివాళులర్పించారు.రాంబాబు భార్య మాజీ కౌన్సిలర్ ఇందిరతో పాటు కుటుంబాన్ని ఓదార్చారు.అనంతరం స్థానిక నాయకులతో కలిసి పెద్ది అంతిమ యాత్రలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటనారాయణ,ప్రధాన కార్యదర్శి, క్లస్టర్ బాధ్యులు, మాజీ కౌన్సిలర్స్, పట్టణ ఉపాధ్యక్షులు, పట్టణ పార్టీ ప్రచార కార్యదర్శి,వార్డు అధ్యక్షులు, పట్టణ పార్టీ ముఖ్య నాయకులు వివిధ అనుబంధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version